ఎల్ఆర్ఎస్.. నిబంధనలు తుస్
ఆదిలాబాద్లో ప్లాట్ల క్రమబద్ధీకరణలో అక్రమ దందా నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వ అసైన్డ్ భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖలకు చెందిన భూముల్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదని స్పష్టమైన ఆదేశాలున్నాయి.
అసైన్డ్ భూముల్లోని ప్లాట్లకూ క్రమబద్ధీకరణ
న్యూస్టుడే ఆదిలాబాద్ పట్టణం
మావల మండలం బట్టిసావర్గాం శివారు పరిధిలోకి వచ్చే సర్వే నెం.72/3 లోని ఈ స్థలంలో కొన్ని రోజులుగా రహదారులు, మురుగు కాలువల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కొత్తగా నిర్మించే జిల్లా సమీకృత భవన సముదాయం (కలెక్టరేట్ భవనానికి) ఆనుకొని ఉన్న పదెకరాల ఈ అసైన్డ్ భూమికి 13 ఏళ్ల కిందట ఆర్డీఓ నుంచి ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ అయింది. ఆ తరువాత అదనపు పాలనాధికారి(జాయింట్ కలెక్టర్) ఆ ఎన్ఓసీని రద్దు చేశారు. అక్కడ క్రయవిక్రయాలు, ప్లాట్లు చేస్తే రెవెన్యూ అధికారులు పీఓటీ యాక్టు(ప్రొబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) ప్రకారం స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు. అయినా ఈ వివాదాస్పద భూమిలోని కొన్ని ప్లాట్లకు మాత్రం అధికారులు ఎల్ఆర్ఎస్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆదిలాబాద్లో ప్లాట్ల క్రమబద్ధీకరణలో అక్రమ దందా నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వ అసైన్డ్ భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖలకు చెందిన భూముల్లో ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తించదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్నాయి. 1956 కంటే ముందు అసైన్డ్ చేసిన భూములకు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వడంతో దాన్ని సాకుగా చేసుకొని చాలామంది ప్లాట్లు చేసి విక్రయించారు. మరికొంత మంది నకిలీ ఎన్ఓసీలు సృష్టించి ప్లాట్ల దందా సాగించారు. అసలు ఎన్ఓసీకి అర్హత లేని భూముల్లోనూ దర్జాగా ప్లాట్లు చేశారు. ఎన్ఓసీల జారీపై ఆరేడేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్ని భూములకు జిల్లా అధికారులు ఎల్ఓసీ ఇచ్చారనేది స్పష్టత లేదు. మరికొందరు ప్రైవేటు పట్టాలు చూపించి ప్రభుత్వ భూముల్లో పాగావేసి అమ్మకాలు జరిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ సమస్య అధిగమించేందుకు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎన్ఓసీ భూముల జాబితా ఇవ్వాలని అప్పటి పురపాలక కమిషనర్ శైలజ జిల్లా కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి జాబితా రాలేదు. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన మొత్తం 19 వేల దరఖాస్తుల్లో 12 వేల వరకు ఎన్ఓసీ భూముల్లోని ప్లాట్లవే కావడం విశేషం. భూములపై వివాదాలు ఉండటంతో ప్రతి పత్రం, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉండగా అవేమి ఇక్కడ కనిపించడం లేదు. చెరువులకు 30 మీటర్ల దూరంలో, చిన్న చెరువులైతే 9 మీటర్లు, వాగులు, పెద్ద కాలువలైతే 9 మీటర్ల దూరంలో, చిన్న కాలువలకు 2 మీటర్ల దూరంలోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని నిబంధన ఉంది. ఎక్కడ వాగులు, కుంటలు ఉన్నాయనే వివరాలు నీటి పారుదల శాఖ అధికారుల నుంచి తీసుకోవాలి. పుర అధికారులు మాత్రం ఇవన్నీ గాలికొదిలేసి ఎల్ఆర్ఎస్ ఆమోదిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం..
-సాయికుమార్, పట్టణ ప్రణాళిక విభాగం సూపర్వైజర్
బట్టిసావర్గాం శివారు సర్వే నెం.72/3లోని లేవుట్లో కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసిన మాట వాస్తవమే. అక్కడ తప్పు జరిగింది. ఆ ప్లాట్ల ఎల్ఆర్ఎస్ రద్దు కోసం గత కమిషనర్కు నివేదించాం. కొత్తగా వచ్చిన పుర కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయిస్తాం.
రద్దు చేయడం కష్టమే
-ఎం.డి.ఖమర్హైమద్, పురపాలక కమిషనర్
ఒకసారి ఎల్ఆర్ఎస్ చేశాక రద్దు చేయడం చాలా కష్టం. ఆన్లైన్ విధానంలో దీన్ని ఆమోదిస్తారు. ఆన్లైన్లోనే రద్దు చేయాలి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వివాదాస్పద భూముల్లోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేశారంటే అది సిబ్బంది తప్పిదమే. దీనిపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 18-06-2024]
జిల్లాలో సోమవారం బక్రీద్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
గృహజ్యోతికి దూరం.. బిల్లు భారం
[ 18-06-2024]
జిల్లాలో 2.67 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా ఇందులో గృహావసరాలకు సంబంధించిన కనెక్షన్లు 2.04 లక్షలు ఉన్నాయి. -
బల్దియాలో అవిశ్వాస రాజకీయం
[ 18-06-2024]
ఆదిలాబాద్ పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్ ఛైర్మన్ జహీర్ రంజానిపై అవిశ్వాసానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. -
అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్ధులకు శాపం
[ 18-06-2024]
వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అసౌకర్యాలు నెలకొన్నాయి. తాగునీరు, ప్రహరీ, గదులకు మరమ్మతులు, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించే పనులు కొన్ని చోట్ల కొనసాగుతుండగా.. -
ప్రకృతి సోయగం ఆస్వాదిస్తే ఆనందం
[ 18-06-2024]
ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో నిలదొక్కుకునేందుకు జనాలు తీవ్ర ఒత్తిడి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకు వారు తమ జీవన శైలిని మార్చుకుంటున్నారు. -
క్రీడా పాఠశాల ఎంపికకు వేళాయె..
[ 18-06-2024]
ఆటలను కెరీర్గా చేసుకోవాలనే పిల్లలకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సువర్ణ అవకాశం కల్పించేందుకు ముందుకొచ్చింది. -
పులుల ఆవాసం.. కావాలి ప్లాస్టిక్ రహితం
[ 18-06-2024]
కవ్వాల్ పులులు సంరక్షణ కేంద్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తే వన్యప్రాణులకు మేలు కలుగుతుంది. మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్ వరకు వెళ్లే ప్రయాణికులు, కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో ఉన్న పుణ్యక్షేత్రాల వద్దకు వెళ్లే భక్తులు విసిరివేసే ప్లాస్టిక్తో ఇబ్బందులు తప్పడం లేదు. -
ప్రత్యేక ముద్ర.. సేవల్లో ముందంజ!
[ 18-06-2024]
రెండున్నరేళ్లుగా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించిన కొల్లు సురేష్కుమార్.. సోమవారం సైబరాబాద్ బాలానగర్ డీసీపీగా బదిలీ అయ్యారు. -
ఎడతెగని నిరీక్షణ!
[ 18-06-2024]
ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ అడుగడుగునా అవాంతరాలతో ఉత్కంఠ రేపుతోంది. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం -
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం కసరత్తు
[ 18-06-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటువైపు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఐబీలోని సమీకృత మార్కెట్ నిర్మాణ స్థలంలో తొలుత ఎంసీహెచ్ను నిర్మించాలని భావించారు. -
చెరువు మట్టి.. అక్రమంగా కొల్లగొట్టి
[ 18-06-2024]
చెరువు మట్టి తరలింపు వ్యవహారం అక్రమార్కులకు వరంగా మారింది. మండలంలోని చెరువుల్లో జేసీబీల సహాయంతో వందల ట్రాక్టర్ల మట్టి తరలిస్తూ అక్రమ సంపాదనకు కొందరు తెరలేపారు. -
చెరువు ఆక్రమణల ఆదరువు
[ 18-06-2024]
భూగర్భజలాల పెంపునకు దోహదం చేయడంతోపాటు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో నిర్మల్ను పాలించిన రాజులు తవ్వించిన చెరువుల శిఖం ఆక్రమించి కొంతమంది యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. -
చెట్లు కాదు.. కొమ్మలే తొలగింపు
[ 18-06-2024]
విద్యుత్తు లైన్లు, చెట్లు కలిసిపోయి గాలి వీచినప్పుడు కొమ్మలు తీగలకు రాసుకుని షార్ట్సర్క్యూట్ ఏర్పడి సరఫరాలో అంతరాయాలు తలెత్తుతుంటాయి. మైదాన ప్రాంతాల్లో తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించినంత తేలికగా అటవీ ప్రాంతాల్లో సాధ్యం కాదు. -
పసిప్రాయం.. యాచిస్తోంది
[ 18-06-2024]
కలం పట్టి అక్షరాలు రాయాల్సిన బాల్యం చేతులు చాచి యాచిస్తోంది. బడికెళ్లి విద్యాబుద్ధులు నేర్వాల్సిన చిన్నారులు యాచనకు అలవాటుపడుతున్నారు. -
భారీ వర్షం.. అన్నదాత హర్షం
[ 18-06-2024]
వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భైంసా పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
-
అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు
-
అమరావతి, పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం: పల్లా శ్రీనివాసరావు యాదవ్
-
‘అప్పుడు మోదీ దాచిపెట్టారా..?’: వయనాడ్ నుంచి ప్రియాంక పోటీపై భాజపాకు కాంగ్రెస్ కౌంటర్
-
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
-
నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా భారాస ఆందోళన