ఆటలాడేద్దాం..
చదువుతోపాటు ఆటలు, వ్యాయామం ఉంటేనే విద్యార్థులు రాణించగలరు. ప్రభుత్వ పాఠశాలలకు కొన్నేళ్లుగా సరైన క్రీడా సామగ్రి లేక క్రీడా శిక్షణ తూతూమంత్రంగానే సాగుతోంది.
ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామగ్రి
మాడుగుల గ్రామీణం, నక్కపల్లి, న్యూస్టుడే
చదువుతోపాటు ఆటలు, వ్యాయామం ఉంటేనే విద్యార్థులు రాణించగలరు. ప్రభుత్వ పాఠశాలలకు కొన్నేళ్లుగా సరైన క్రీడా సామగ్రి లేక క్రీడా శిక్షణ తూతూమంత్రంగానే సాగుతోంది. ఈ కొరత తీరేలా ప్రభుత్వం క్రీడా పరికరాలను మంజూరు చేయగా, ఉమ్మడి విశాఖలోని 4,032 పాఠశాలలకు ఇవి చేరనున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో ఆటలు ఆడించాలనేది దశాబ్దాల తరబడి వస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఓ గంటపాటు ఆటలు ఆడిస్తారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. రెండున్నరేళ్ల కిందట విద్యాశాఖ కొన్ని రకాల ఆట వస్తువులు ఇవ్వగా వాటితోనే ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. ఇందులో చాలా వరకు పాడైపోవడంతో పరుగుపందెం, కబడ్డీ, ఖోఖో తదితర ఆటలు తప్పితే వస్తువులతో ఆడే అవకాశం చాలామందికి లేకుండాపోయింది. పాఠశాలలకు తగినన్ని నిధులు లేకపోవడంతో చేసేదేమీ లేక ఉన్న వాటితోనే పీడీలు సరిపెట్టుకుని విద్యార్థులను ఆడిస్తున్నారు. వాస్తవంగా క్రీడా సామగ్రిని ఏడాది కిందటే కేటాయించాల్సి ఉంది. కరోనా కారణంగా సంబంధిత సంస్థ వీటిని కేటాయించడంలో జాప్యం చేసింది. ఎట్టకేలకు ఆట వస్తువులను పంపిస్తుండటంతో ఇటు విద్యార్థులు, అటు వ్యాయామ ఉపాధ్యాయుల్లో నూతనోత్సాహం వచ్చింది.
క్రికెట్, షటిల్ బ్యాట్లు
అదనంగా కేటాయింపు
రెండున్నరేళ్ల కిందట 13 రకాల సామగ్రి ఇవ్వగా.. ఇప్పుడు 23 రకాల ఆట వస్తువులను ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలకు 4, ప్రాథమికోన్నత పాఠశాలకు 9 రకాల వస్తువులు ఇవ్వగా.. ఉన్నత పాఠశాలకు 23 ఇచ్చారు. వీటిలో క్యారమ్స్, రింగ్స్, లూడో, డిస్క్త్రో, జావెలిన్ త్రో, క్రికెట్ బ్యాట్లు, బాల్స్, టెన్నికాయిట్ రింగ్స్, ఖోఖో పోల్స్, వాలీబాల్, త్రోబాల్, నెట్లు, హ్యాండ్బాల్, షటిల్ బ్యాట్లు, కాక్లు, స్కిప్పింగ్ రోప్స్, రిలే బ్యాటర్స్, హ్యాడిల్స్ తదితర రకాలున్నాయి. ప్రస్తుతం జావెలిన్త్రో, రిలే బ్యాటర్స్, హ్యాండ్ బాల్, క్రికెట్ బాల్స్, క్యారమ్స్ బోర్డు, ఖోఖో పోల్స్ అదనంగా వచ్చాయి. ఇవన్నీ కేంద్రియ బాండార్ నుంచి కేటాయించారు. ఉన్నత పాఠశాలలకు సామగ్రి కేటాయింపు విషయంలో ఆయా ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు. చాలాచోట్ల 500కు మించి విద్యార్థులున్నారు. తక్కువ, ఎక్కువ అని లేకుండా అందరికీ ఒకే రకంగా ఆట వస్తువులు ఇవ్వడంతో ఎక్కువ మంది ఉన్నచోట్ల ఆడించేందుకు సరిపోవని చెబుతున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికగా తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆటవస్తువులు తీసుకెళుతున్న ఉపాధ్యాయులు
ఫిట్నెస్ పెంచేలా..
పాఠశాలల్లో ఆటలు ఆడించేందుకు ఇప్పుడు కేటాయించిన క్రీడా సామగ్రి బాగా ఉపయోగపడుతుంది. రెండేళ్ల కిందటి కంటే ఈసారి రెట్టింపు స్థాయిలో వస్తువులు ఇచ్చారు. ప్రధానంగా ఫిట్నెస్ పెంచే పరికరాలను కేటాయించారు.
కుందూరు రాజు, వ్యాయామ ఉపాధ్యాయుల కన్వీనర్, నక్కపల్లి
ఆటల్లో తీర్చిదిద్దాలి
ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆట వస్తువులను కేటాయిస్తుంది. ప్రస్తుతం ఇచ్చిన వాటిలో అన్ని తరగతుల వారికి ఉన్నాయి. చదువుతోపాటు సమాంతరంగా ఆటలు ఆడించాలి. క్రీడల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దాలి. ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తుండాలి.
బి.లింగేశ్వరరెడ్డి, డీఈఓ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే