రాతి గోపురం.. బంగారు తాపడం
ఇంద్రకీలాద్రిపై కొలువైన పురాతన శివాలయం కొత్తరూపు సంతరించుకోనుంది. శతాబ్దాల కిందట సున్నంతో నిర్మించిన గోపురం కావడంతో ఇప్పటికే కాలపరిమితి తీరిపోయింది. తాజాగా రాతితో పూర్తిగా గోపురం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాతి గోపురంపై
రూ.4 కోట్లతో నిర్మాణం.. దాతల సాయం
ఈనాడు, అమరావతి
ఇంద్రకీలాద్రిపై కొలువైన పురాతన శివాలయం కొత్తరూపు సంతరించుకోనుంది. శతాబ్దాల కిందట సున్నంతో నిర్మించిన గోపురం కావడంతో ఇప్పటికే కాలపరిమితి తీరిపోయింది. తాజాగా రాతితో పూర్తిగా గోపురం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాతి గోపురంపై బంగారు తాపడం చేయించనున్నారు. దీని కోసం అవసరమైన బంగారం దాతల నుంచి విరాళాల రూపంలో సేకరించనున్నారు. శివాలయం గోపురం నిర్మాణానికి అవసరమైన రాళ్లను చిలకలూరిపేట క్వారీలోనే సిద్ధం చేయించి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసి పాత గోపురం తొలగించే పనులు ఆరంభించనున్నారు. అనంతరం అత్యాధునిక పద్ధతిలో నిర్మించబోయే రాతి గోపురం నాలుగు నెలల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. అందుకే ముందుగానే అవసరమైన రాళ్లను పక్కాగా తయారు చేయించి తీసుకొస్తున్నారు.
విజయవాడ నగరంలో నుంచి చూస్తే ఇంద్రకీలాద్రిపై ఉండే శివాలయమే దర్శనమిస్తుంది. అమ్మవారి ప్రధాన ఆలయం లోపలి వైపు ఉంటుంది. బయట నగరం మొత్తం కనిపించేది శివాలయ గోపురమే. అందుకే.. ఈ అతిపురాతనమైన గోపురం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతుండడంతో కొత్తగా రాతితో నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న గోపురానికి బంగారు తాపడం వేయడం చాలా కష్టం. గోపురానికి ముందుగా రాగి తాపడం వేస్తారు. దానిపైన బంగారు పూత వస్తుంది. తాపడం వేసేందుకు గోపురానికి రంధ్రాలు చేయాల్సి ఉంటుంది. సిమెంటు, సున్నంతో చేసిన గోపురం అయితే.. వర్షాకాలంలో నీళ్లు రంధ్రాల ద్వారా లోపలకు చేరి.. ఫంగస్ వచ్చేస్తుంది. బయటకు మాత్రం బంగారు తాపడం బాగానే కనిపిస్తుంది.. లోపలి వైపు ఫంగస్ పెరిగిపోతుంది. రాతి గోపురం అయితే ఈ సమస్య ఉండదని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
బంగారం సేకరణకు బ్యాంకు ఖాతా.. శివాలయానికి బంగారు తాపడం చేయించేందుకు దాతల సహకారం తీసుకోనున్నారు. ఇప్పటికే దాతల నుంచి బంగారం స్వీకరణకు ఓ బ్యాంకు ఖాతాను కూడా తెరిచారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.70 కోట్లలో నుంచి రూ.4 కోట్లను శివాలయం కోసం వినియోగించనున్నారు. శివాలయం గోపురం నిర్మాణం ఈ డబ్బులతో చేపట్టనున్నారు. ఇప్పటికే గోపుర నిర్మాణానికి స్లాబ్ ఎత్తు వరకు అవసరమైన రాళ్లను తయారు చేయించి తీసుకొచ్చారు. గతంలో ఆలయం నిర్మించే ప్రదేశం వద్దకే ముడి రాతిని తీసుకొచ్చి చెక్కేవాళ్లు. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకుండా క్వారీలోనే చెక్కించి తీసుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
[ 19-05-2024]
విజయవాడ శివారు ప్రసాదంపాడుకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దీనిని ఆమోదించిన అతనికి బినాన్స్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చని, పెద్ద మొత్తంలో రాబడులు వస్తాయని అవతలి వ్యక్తి ఆశ చూపించాడు. -
సైకిల్ సవారీ.. వేస్తారా దారి?
[ 19-05-2024]
విజయవాడ, మచిలీపట్నం నగరాల్లో ప్రజలు వాకింగ్ చేసేందుకు సరైన పార్కులు, ట్రాక్లు లేవు. వివిధ కళాశాలల ప్రాంగణాల్లో సంబంధిత యాజమాన్యాల అనుమతితో వేలాదిమంది ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. -
విజ్ఞానం.. వినోదం
[ 19-05-2024]
తిరువూరు పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక, గ్రేడ్-1 శాఖ గ్రంథాలయం, ఐడియాస్ సేవా సంస్థలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. -
ఈసారీ అదే తంతు..?
[ 19-05-2024]
పాఠశాలల పునః ప్రారంభసమయం సమీపిస్తోంది. బడులు తెరిచేనాటికే అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించామనీ, ఇప్పటికే పలు మండలాల్లోని ఎమ్మార్సీకేంద్రాలకు కొన్ని పుస్తకాలు చేరాయని తెలిపారు. -
చిలకలపూడి స్టేషన్లో సమస్యల కూత
[ 19-05-2024]
మచిలీపట్నంలో ప్రధాన రైల్వేస్టేషన్తో పాటు చిలకలపూడి స్టేషన్లో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా రోల్డ్గోల్డ్ నగల వ్యాపారులు, వివిధ కళాశాలలకు వచ్చే విద్యార్థులు ఈ స్టేషన్నే ఆశ్రయిస్తారు. -
భక్తితో వాసవీ మాత జయంతి
[ 19-05-2024]
నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత జయంతి మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలకవర్గ ప్రతినిధులు మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, మామిడి మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. -
కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం
[ 19-05-2024]
పెడన నియోజకవర్గంలో ఉన్న ఏకైక బంటుమిల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి అమడ దూరంలో ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇక్కడ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనిని 1997లో ప్రారంభించారు. -
నీ పరుగులేవమ్మ ... కృష్ణమ్మా..
[ 19-05-2024]
కృష్ణానది నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చే నీరు లేకపోవడంతో నీటిమట్టం పడిపోతోంది. -
నీరుగారిన చెత్త నిర్వహణ
[ 19-05-2024]
మండల పరిధిలోని చెత్త నిర్వహణ కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. రూ.లక్షలు వ్యయంతో నిర్మించిన కేంద్రాలను వినియోగించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో రహదారుల వెంట చెత్త ఇష్టానుసారం పడేస్తున్నారు. 24 గ్రామాల్లో ఏడేళ్లనాడు చెత్త కేంద్రాలు నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM