logo

అతివేగం తీసింది ప్రాణం

ద్విచక్రవాహనం కారును ఢీకొట్టిన ఘటనలో పొన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన బాపట్ల-అప్పికట్ల మార్గంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నూరులోని

Published : 19 Jan 2022 03:31 IST

రోడ్డు ప్రమాదంలో పొన్నూరు యువకుల దుర్మరణం

సంఘటన దృశ్యం

బాపట్ల, న్యూస్‌టుడే :   ద్విచక్రవాహనం కారును ఢీకొట్టిన ఘటనలో పొన్నూరుకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన బాపట్ల-అప్పికట్ల మార్గంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నూరులోని ముబారక్‌ నగర్‌కు చెందిన యలవర్తి వెంకటేష్‌ (28), డీవీసీ కాలనీకి చెందిన కుంచాల ఏసుబాబు (30) సెంట్రింగ్‌ కార్మికులుగా పనిచేస్తున్నారు. పనుల నిమిత్తం బాపట్ల వచ్చి ద్విచక్రవాహనంపై పొన్నూరుకు తిరుగుపయనమయ్యారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అప్పికట్లలో పంట పొలాలు పరిశీలించి కారులో బాపట్ల వైపు వస్తుండగా.. యువకులు ద్విచక్రవాహనంతో వేగంగా ఎదురుగా వెళ్లి ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఏసుబాబును బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని బాపట్ల గ్రామీణ ఎస్సై వెంకట ప్రసాద్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఏసుబాబుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కారు డ్రైవర్‌ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని