ఆపదలో..ఆదుకుని..ఆపదలో..చిక్కుకుని !
కరోనా అందర్నీ వణికించింది.. లాక్డౌన్లో ఇంటికే పరిమితం చేసింది.. కొవిడ్ బారిన పడిన బాధితులు ఆర్తనాదాలు పెట్టినా ఇరుగుపొరుగు వారు కనీసం కన్నెత్తి చూడని ఘటనలు అనేకం.. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ ఫోన్ కాల్ రాగానే ప్రైవేటు
కరోనా బాధితులకు ప్రైవేటు అంబులెన్సుల సేవలు
బిల్లులు అందక అప్పుల్లో కూరుకుపోయిన నిర్వాహకులు
అత్యవసర పరిస్థితిలో అండగా..
జిల్లాలో 2020 మార్చి నెలాఖరులో లేపాక్షి మండలంలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. ఆ తర్వాత జిల్లా అంతటా వైరస్ వ్యాప్తి చెందింది. వైరస్ సోకిన బాధితుల ప్రాణాలు కాపాడటానికి అత్యవసర వాహన సేవలు అందించే శక్తి ప్రభుత్వం కోల్పోయింది. ఆ సమయంలో జిల్లాలోని ప్రైవేట్ అంబులెన్సు డ్రైవర్లు, యజమానులను రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు పిలిపించారు. బాధితులు సకాలంలో ఆసుపత్రికి రాకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, వారికి అండగా నిలవాలని చెప్పారు. కోరినంత డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు 15 అంబులెన్సులను బలవంతంగా లాక్కున్నారు. రోగులకు రాత్రింబవళ్లు అంబులెన్సు సేవలతోపాటు, మృతదేహాలను అంత్యక్రియలకు తరలించే పనులు చేయించారు.
చెల్లింపుల్లో లెక్కలేనితనం
ప్రైవేట్ అంబులెన్సు యజమానులను పిలిచి రోజుకు రూ.1000 బాడుగ, డ్రైవర్ బత్తా రూ.375గా నిర్ణయించారు. అనంతపురం, హిందూపురం కొవిడ్ ఆసుపత్రులకు బాధితులను తరలించడానికి ప్రభుత్వ అనుమతితో తొలుత 15 ప్రైవేట్ అంబులెన్సులను తీసుకున్నారు. హిందూపురం ప్రాంతంలో కేసులు అధికం కావడంతో అదనంగా తొమ్మిది వాహనాలను ఏర్పాటు చేశారు. ఇలా ప్రభుత్వం 153 రోజులు పనిచేయించుకుంది. హిందూపురానికి చెందిన తొమ్మిది వాహనాలకు డీజిల్ ఖర్చులు ఏరోజుకారోజు చెల్లించారు. అద్దెగా దాదాపు రూ.12 లక్షలు అయింది. ఏడాదిపాటు అధికారుల చుట్టూ తిరగ్గా రూ.5.22 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.6.53 లక్షల కోసం ఏడాదిన్నరపైగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరోవైపు 15 ప్రైవేట్ అంబులెన్సుల యజమానుల ఒత్తిడితో ఇటీవల రూ.85 లక్షలు చెల్లించారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించి రూ.2.60 లక్షలు, ఈ ఏడాది మే నుంచి ఆగస్టు వరకు రూ.12 లక్షలు.. మొత్తంగా అన్ని వాహనాలకు కలిపి రూ.21.13 లక్షలు బకాయి ఉంది. పలువురు యజమానులు ప్రైవేట్గా రూ.లక్షలు అప్పులు చేసి కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేశారు. రూ.వేల ఖర్చుతో మరమ్మతులు చేయించి ప్రభుత్వానికి అప్పగించారు. వారంతా బిల్లులు అందక అప్పులపాలయ్యారు. వడ్డీ భారంతో కుదేలవుతున్నారు.
మృతుల తరలింపులో ప్రైవేట్ అంబులెన్సు
బిల్లులన్నీ ఉన్నతాధికారులకు పంపించాం
- శివరాంప్రసాద్, డీటీసీ, అనంతపురం, శ్రీనివాసులు, తహసీల్దార్, హిందూపురం
ప్రైవేట్ అంబులెన్సు యజమానులకు బిల్లుల బకాయి వాస్తవమే. గతేడాది కొంత చెల్లించాం. ఇంకా రూ.20 లక్షలు పైగా చెల్లించాల్సి ఉంది. యజమానులు రోజూ కార్యాలయానికి వచ్చి అడుగుతున్నారు. మేము ఎప్పటికప్పుడు బిల్లును ఉన్నతాధికారులకు పంపించాం. కొన్ని బిల్లులకు సంబంధించి సీఎఫ్ఎంఎస్ నుంచి చెల్లింపులు జరగాల్సి ఉంది. మరికొన్ని ఖజానా కార్యాలయంలో నిచిపోయాయి. మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సొమ్ము అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.
పోలీసులతో దెబ్బలు తిన్నాం
- మహబూబ్ బాషా, హిందూపురం
మృత దేహాలను తరలించే క్రమంలో పోలీసులతో అనేకమార్లు దెబ్బలుతిన్నాను. బంధువులు భయంతో దూరంగా నిల్చొని నాతోనే అంత్యక్రియలు చేయించారు. ప్రాణాలకు తెగించి రాత్రి, పగలు తేడాలేకుండా కరోనా మృతులను మోసుకెళ్లాం. మీరు అడిగినంత డబ్బు ఇస్తామని అధికారులు చెప్పారు. కనీసం బత్తా కూడా ఇవ్వలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
అప్పులకు వడ్డీ కడుతున్నాం
- అహ్మద్, అంబులెన్సు యజమాని
అధికారులు పిలిచి కరోనా రోగులకు సేవలందించాలని చెప్పిన వెంటనే సైనికుల్లా పనిచేశాం. డీజిల్ పోయించారే తప్ప వాహనం అద్దె, డ్రైవర్ బత్తా ఇవ్వలేదు. ఏడాదిపాటు అధికారుల చుట్టూ తిరిగితే 2020 మే, జూన్ నెలల బిల్లులు కొంత చెల్లించారు. అందరికీ దాదాపు రూ.6.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రోజూ తహసీల్దార్ వద్దకు వెళ్లి వస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిరప రైతుపై శీతకన్ను
[ 20-05-2024]
మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?
[ 20-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. -
కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!
[ 20-05-2024]
లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. -
పతకం కల.. దక్కించుకునే పట్టుదల
[ 20-05-2024]
ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్ టెన్నిస్ రాకెట్ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్ టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్లో అడుగుపెట్టాడు. గేమ్ మొత్తం లాన్ టెన్నిస్ మాదిరిగానే ఉంటుంది. -
నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 20-05-2024]
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
[ 20-05-2024]
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సిట్ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ
[ 20-05-2024]
తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. -
ఎస్కేయూలో హాస్టళ్ల మూసివేతపై రగడ
[ 20-05-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో నాన్బోర్డర్ల బెడదతో వివాదం నెలకొంది. వేసవి సెలవుల్లో కూడా మహానంది వసతి గృహం తెరచి ఉంచాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. -
కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. -
జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి
[ 20-05-2024]
మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి యువతి బలి
[ 20-05-2024]
విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించింది. -
టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
[ 20-05-2024]
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
[ 20-05-2024]
ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.