‘కలెక్టరేట్ ముట్టడి’కి పోలీసు ఆంక్షలు
గురువారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసి అడ్రస్లు తెలుసుకుని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.
గురజాలలో ఉపాధ్యాయ సంఘ నేతకు నోటీసు అందజేస్తున్న పోలీసు సిబ్బంది
గురజాల, న్యూస్టుడే: గురువారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసి అడ్రస్లు తెలుసుకుని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. చలో కలెక్టరేట్ ముట్టడికి ఎటువంటి అనుమతులు లేవని నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున, శాంతిభద్రతల దృష్ట్యా మిమ్మల్ని ఇంట్లోనే ఉండాల్సిందిగా తెలియజేయడమైనదని, పోలీసు వారికి సహకరించగలరని కోరారు. నోటీసు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని అందులో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు, పలువురు ఉపాధ్యాయులకు నోటీసులు అందజేశారు.
అందజేసిన నోటీసు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.