నాలుగు రోజులుగా అంధకారం
అకాల వర్షం, గాలుల బీభత్సంతో పల్నాడు జిల్లా నకరికల్లులో నాలుగు రోజులుగా అంధకారం అలుముకుంది. బలమైన గాలులకు విద్యుత్తు స్తంభాలు నేలవాలాయి.
నకరికల్లులో ప్రజలకు తాగునీటి కష్టాలు
నకరికల్లులో ట్యాంకరు వద్ద నీటి కోసం పాట్లు
నకరికల్లు, న్యూస్టుడే: అకాల వర్షం, గాలుల బీభత్సంతో పల్నాడు జిల్లా నకరికల్లులో నాలుగు రోజులుగా అంధకారం అలుముకుంది. బలమైన గాలులకు విద్యుత్తు స్తంభాలు నేలవాలాయి. తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నకరికల్లు సమగ్ర రక్షిత మంచినీటి పథకం నుంచి మూడు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. చీకట్లు తొలగకపోవడంతో అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారు. దోమల బెడదతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారు. చంటిబిడ్డలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల వెతలు వర్ణణాతీతం. వ్యాపారులు స్తంభించాయి. ఛార్జింగ్లేక చరవాణులు మూగబోయాయి. విద్యుత్తు కష్టాలతో నకరికల్లుకు చెందిన కొందరు ఇతర ప్రాంతాలకు కుటుంబాలతోసహా తరలివెళ్లారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సొంత ఖర్చులతో మూడు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటికోసం మహిళలు పోటీపడుతున్నారు. మంగళవారం ఉదయం కొన్ని ప్రాంతాలకు సరఫరా పునరుద్ధరించారు. సాంకేతిక కారణాలతో మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్లీ నిలిచిపోయింది. ఉపకేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తిందని బుధవారం నాటికి అన్ని ప్రాంతాలకు విద్యుత్తు పునరుద్ధరిస్తామని ఆ శాఖ నరసరావుపేట గ్రామీణ డీఈఈ వెంకటేశ్వరరెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.