Guntur: బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చూపిస్తూ మెదడుకు శస్త్రచికిత్స
అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే ఆ రోగి మెలకువగా ఉండటమే కాదు.. అతనికి ఎంతో ఇష్టమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించారు.
గుంటూరు శ్రీసాయి ఆసుపత్రిలో ఉచితంగా సర్జరీ
రోగి మణికంఠతో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, త్రినాథ్ తదితరులు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: అత్యంత క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలోనే ఆ రోగి మెలకువగా ఉండటమే కాదు.. అతనికి ఎంతో ఇష్టమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించారు. దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడాన్ని రోగి టీవీలో చూస్తూ భక్తితో పరవశం చెందుతున్న సమయంలోనే సర్జరీ పూర్తి చేయడం విశేషం. గుంటూరు అరండల్పేటలోని శ్రీసాయి హాస్పిటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యూరోసర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి సర్జరీ వివరాలు వెల్లడించారు. అత్యంత ఖరీదైన ఈ సర్జరీని పూర్తి ఉచితంగా చేశామన్నారు. ఆయన తెలిపిన వివరాలివే..
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన దానబోయిన మణికంఠ(29) కొంత కాలంగా ఫిట్స్ వీడకుండా వేధిస్తూనే ఉన్నాయి. ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో గుంటూరులోని శ్రీ సాయి ఆసుపత్రిలో ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెదడులో అత్యంత కీలకమైన ప్రాంతంలో 7 సెం.మీ పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించాం. వెంటనే మణికంఠ మెదడు త్రీ-డీ మ్యాప్ తయారుచేసుకున్నాం. కుడి చేయి, గొంతు, మాటల పనితీరును ప్రభావితం చేసే మెదడులోని కీలక ప్రాంతంలో కణితి ఉండటంతో రోగి మెలకువగా ఉన్న సమయంలోనే మెదడుకు సర్జరీ చేయాలని నిర్ణయించాం. ఈ నెల 11వ తేదీన ఓ వైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే మరోవైపు రోగికి ఇష్టమైన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వీడియో చూపించాం. రోగి స్పృహలో మాట్లాడుతుండగానే మెదడుకు సర్జరీ పూర్తి చేసి కణితిని తొలగించాం. శస్త్రచికిత్స మధ్యలో రెండు చేతులతో బాలరాముడికి నమస్కరించారు. మెదడు సర్జరీలో ఎక్కడ ఎంత వరకూ తీయొచ్చు? దేన్ని ముట్టుకోకూడదు? అన్నది కీలకం. ఈ ప్రాంతాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ‘నావిగేషన్’ వంటి అత్యాధునిక విధానాలను అనుసరించాం. నావిగేషన్ సాయంతో కచ్చితంగా ఆ ప్రాంతం ఎక్కడో గుర్తించి అక్కడే తెరిచి కణితిని తొలగించొచ్చు. గతంలో చిన్న కణితులను తొలగించాల్సి ఉన్నా.. దాన్ని చేరుకోవడానికి తల మీద పెద్ద ప్రాంతం తెరవాల్సి వచ్చేది. రోగి పూర్తిగా కోలుకున్నందున సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జి చేశాం. ఈ సర్జరీలో తనతో పాటు మత్తు వైద్యులు త్రినాథ్, న్యూరోసర్జన్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
టీవీలో బాలరాముడిని చూస్తూ నమస్కరిస్తున్న మణికంఠ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జల్లెడ పడుతున్నారు!
[ 20-05-2024]
ఎన్నికల సంఘం నియమించిన సిట్ బృందం జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తోంది. శనివారం నరసరావుపేట, కారంపూడి వచ్చిన బృందాలు, ఆదివారం దాచేపల్లి, మాచర్లలో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. -
అరాచక శక్తులను అణిచేస్తేనే..
[ 20-05-2024]
జిల్లాకు మూడో ఎస్పీగా వస్తున్న మలికా గార్గ్కు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల సమయంలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
తెలంగాణ మద్యం స్వాధీనం
[ 20-05-2024]
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటన ఆదివారం చీరాలలో వెలుగు చూసింది. -
అదును దాటుతున్నా.. విత్తే దారేది?
[ 20-05-2024]
సీజన్లో రైతులకు విత్తనాలు సకాలంలో అందించి ఇబ్బందులు లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఘనంగా ప్రకటిస్తుంది. -
అడిగినవి ఇవ్వరంట.. పనులు పూర్తి చేయాలంట
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు
[ 20-05-2024]
తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని మహ్మదాపూర్ గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అంతర్రాష్ట్ర ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
ప్రకృతి సొగసు ప్రోత్సహిస్తూ.. పస్తులుంటున్నారు?
[ 20-05-2024]
వారంతా రైతులే. చేస్తోంది వ్యవసాయమే. ఓ అడుగు ముందుకేసి వ్యవసాయం చేస్తూనే.. మరోవైపు మరికొందరిని ఆ విధానంలోకి తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తుంటారు. -
గంజాయి మత్తు.. ప్రజలకు విపత్తు
[ 20-05-2024]
నగరంలో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనేది జగమెరిగిన సత్యం. గత ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నగరంలో కాలినడకన పర్యటించిన సమయంలో పాతగుంటూరులోని ఓ పాత ఇంటిని అడ్డాగా చేసుకొని గంజాయి తాగుతున్నారని ఫిర్యాదు -
అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొన్న బస్సు
[ 20-05-2024]
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మంగళగిరి గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం. -
‘పైపెచ్చు’ పఠనమూ ప్రమాదమే!
[ 20-05-2024]
గుంటూరులో 1954లో స్థాపించిన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. ఇక్కడ 1.5లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. -
గుంటూరు నుంచి గుజరాత్.. వయా జహీరాబాద్!
[ 20-05-2024]
బస్తాల ప్యాకింగ్ మార్చి గుంటూరు నుంచి గుజరాత్కు జహీరాబాద్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్-2 హైదరాబాద్ అధికారులు పట్టుకున్నారు. -
అడిగినవి ఇవ్వకుండా.. పనుల పూర్తి ఎలా?
[ 20-05-2024]
పాఠశాలల్లో నాడు-నేడు కింద చేపట్టిన భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణాలను ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్షా అదనపు సమన్వయకర్తలకు మెమోలిచ్చింది. -
ఓట్ల లెక్కింపునకు భద్రత కట్టుదిట్టం
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 4న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. -
ఓటులో పోటీ.. స్ఫూర్తిలో మేటి
[ 20-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే గీటురాయి. తమకు ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్న కసి ప్రతి ఒక్కరిలో కనిపించింది. గతంతో పోల్చితే ఈసారి ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది.