రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు దీక్ష కొనసాగిస్తా
దీక్షా శిబిరంలో శ్రీలక్ష్మి తదితరులు
గుంటూరు రూరల్, న్యూస్టుడే: న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుల అక్రమాలు, భూకబ్జాలకు వ్యతిరేకంగా గుంటూరులో శ్రీలక్ష్మి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం కొనసాగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భూకబ్జాలు, గంజాయి విక్రయాల అరికట్టటానికి ఎన్నో ఏళ్లగా ఇక్కడ పోరాటం సాగిస్తున్నానని తెలిపారు. మనుషులను చంపుతూ ఆ శవాలపై వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు.జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రాణం ఉన్నంతవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. ఓ మహిళ వేలు కోసుకుని దీక్ష చేపడితే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళి మోహన్ అన్నారు. ఆమెను పరామర్శించి మాట్లాడారు. వందనాదేవి, కృష్ణ రేఖ ఆనంద్ కుమార్, పద్మావతి, విజయ, దేవి, యల్లమంద రావు తదితరులు శిబిరాన్ని సందర్శించి ఆమెకు మద్దతు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు సంతకాలు.. అందరికీ ఫలాలు
[ 14-06-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నారా చంద్రబాబునాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలు అమలు చేసేలా వాటికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసి అమలుకు శ్రీకారం చుట్టారు. -
సచివాలయం..పచ్చని సోయగం
[ 14-06-2024]
సచివాలయంలోని ఉద్యానవనంలో పచ్చదనం పరుచుకుంది. మొన్నటివరకు కళావిహీనంగా మారిన దీన్ని సీఆర్డీఏ అధికారులు పునరుద్ధరించారు. -
ఉపాధ్యాయ కొలువులపై చిగురించిన ఆశలు
[ 14-06-2024]
ఉపాధ్యాయ కొలువులపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీపికబురు చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ దస్త్రంపై చేయడంతో ఉపాధ్యాయ శిక్షణార్థుల్లోనే కాదు టీచర్లలోనూ హర్షం, ఆనందం వ్యక్తమైంది. -
తెనాలిలో మంత్రి మనోహర్కు బ్రహ్మరథం
[ 14-06-2024]
మంత్రిగా ప్రమాణ సీˆ్వకారం చేసిన తరవాత తెనాలి వచ్చిన నాదెండ్ల మనోహర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెనాలి మండలం నందివెలుగు నుంచి గురువారం సాయంత్రం మొదలైన ప్రదర్శన నాలుగు వరుసల రోడ్డు, ఐతానగర్, రజకచెరువు కూడలి, నెహ్రూ రోడ్డు, గాంధీచౌక్, బోస్రోడ్డు మీదుగా కార్యాలయానికి చేరుకుంది. -
మా ఆకాంక్ష నెరవేరింది
[ 14-06-2024]
రాజధాని అమరావతి నుంచి తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధికి 11 మంది రాజధాని రైతులు గురువారం పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని గ్రామం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం కాలినడకన రైతులు బయలుదేరి వెళ్లారు. -
యువ దీప్తి.. సేవా స్ఫూర్తి
[ 14-06-2024]
నేటి యువత నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాల మాయలో ప్రపంచాన్ని మరచిపోతున్నారని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కానీ గుంటూరుకు చెందిన ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వాట్సప్ ద్వారా రక్తదానం చేస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. -
గుంటూరులో అదృశ్యం.. విజయనగరంలో ప్రత్యక్షం
[ 14-06-2024]
పిల్లలతో సహా అదృశ్యమైన తల్లిని గుంటూరు జీఆర్పీ పోలీసులు గుర్తించి గురువారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీఆర్పీ పోలీసుస్టేషన్లో వివరాలను సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు. -
అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయేనే...
[ 14-06-2024]
రొంపిచర్ల మండలానికి చెందిన ఓ రైతు మిర్చి, పత్తి అమ్మగా వచ్చిన రూ.50 లక్షలను వైకాపా గెలుపుపై బెట్టింగ్లో పెట్టారు. జగన్ మరోసారి సీఎం అవుతారని, జిల్లాలో నాలుగు అసెంబ్లీ సీట్లలో వైకాపా గెలుస్తుందని మధ్యవర్తుల వద్ద పందెం వేశారు. -
తొలి సంతకం.. మెగా సంతోషం
[ 14-06-2024]
ఉపాధ్యాయ కొలువులపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీపికబురు చెప్పింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేసి నిలబెట్టుకుంది. -
రేపల్లె కళాశాలకు స్వయం ప్రతిపత్తి
[ 14-06-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పేరొందిన రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి(అటానమస్) హోదా లభించింది. తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రభుత్వ కళాశాల కూడా ఇదే. న్యాక్-ఎ ప్లస్ గ్రేడ్తో విద్యార్థులను బాగా ఆకర్షిస్తోంది. -
ప్రగతి సారథీ సాహో.. అమరవతీ జయహో...
[ 14-06-2024]
నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రిగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి వెళుతున్న చంద్రబాబుకు అన్నదాతలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్నారు.