కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందా? ఇలా చేయండి మరి!
ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది.
లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేయించుకోవాలని సూచిస్తున్న విద్యుత్తు అధికారులు
ఈనాడు, హైదరాబాద్
ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ ఇదే తీరు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా ఎవరికైనా మీటర్ మీదనే సందేహం వస్తుంది. విద్యుత్తు సంస్థకు నిర్ణీత రుసుం చెల్లించి మీటర్ను తనిఖీ చేయిస్తే లోపాలుంటే పాత మీటర్ స్థానంలో కొత్తవి బిగిస్తారు. మరి మీటర్ బాగానే ఉందని టెస్టింగ్లో తేలితే? మీటర్లలో లోపాలే కాదు.. ఇంట్లో వాడే గృహోపకరణాలు ఎప్పటివి? ఎర్తింగ్, కరెంట్ సరఫరా వ్యవస్థలోని లోపాలు కూడా కారణం అవుతుంటాయని ఇంజినీర్లు చెబుతున్నారు. వైరింగ్లో లోపాలు ఉన్నప్పుడు అసలు వినియోగించకుండా కరెంట్ వృథాగా పోయే అవకాశం ఉందని బిల్లు పెరగడానికి అది ఓ కారణంగా చెబుతున్నారు.
పాత వాటితోనే మోత..
* ప్రతి నెలా ఎక్కువ యూనిట్లు కాలుస్తున్నట్లు బిల్లులో చూస్తే వాస్తవంగా అంత వినియోగిస్తున్నామా? లేదా బేరీజు వేసుకోవాలి. బిల్లులో రికార్డెడ్ మాగ్జిమమ్ డిమాండ్ (ఆర్ఎండీ)ను పరిశీలిస్తే ఎంత వాడుతున్నారో తెలుస్తుంది.
* ఇంట్లో ఉన్న ఉపకరణాలు, వాటికి వినియోగానికి అయ్యే కరెంట్ ఎంత? అనేది అవగాహన ఉంటే బిల్లు చూడగానే ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా అనేది తెలిసిపోతుంది.
* ఉపకరణాలు తక్కువగా ఉన్నా ఎక్కువ బిల్లు వస్తుందంటే.. గృహోపకరణాలను ఎంతకాలం నుంచి వాడుతున్నారనేది పరిశీలించాలి. రిఫ్రిజిరేటర్లు పాతవి కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. నెలంతా 50 యూనిట్లతో పనిచేయాల్సిన రిఫ్రిజిరేటర్లు 150దాకా కాలుస్తుంటాయి. వీటి స్థానంలో కొత్తవి కొనడం మేలు. విద్యుత్తు ఆదా చేసే స్టార్ రేటింగ్వి తీసుకోవాలి.
* సరైన నాణ్యతా ప్రమాణాలు లేని ఫ్యాన్లు, గీజర్లు, ఇతర గృహోపకరణాల వాడకంతోనూ మీటర్ గిరాగిరా తిరుగుతుంది. వీటి స్థానంలో నాణ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి.
లీకేజీలు అరికడితే..
* ఇంట్లో అన్ని ఉపకరణాలు కొత్తవే. పైగా నాణ్యత ప్రమాణాలు కలిగినవే.. అయినా ఎక్కువ కరెంట్ ఎందుకు కాలుతుందో అర్థం కావడం లేదంటారా? ఇంట్లో కరెంట్ లీకేజీ కారణంగా కూడా వినియోగం పెరుగుతుందని.. ఇవన్నీ మీటర్లో రికార్డు అవుతుంటాయని విద్యుత్తు ఇంజినీర్లు చెబుతున్నారు.
* మొదట ఇంట్లోకి కరెంట్ సరఫరా అయ్యే మెయిన్బ్రేకర్ ఆపేయాలి. దీంతో మీటర్ ఆగిపోతుంది. అప్పటికీ మీటర్ తిరుగుతుందంటే లీకేజీ ఉన్నట్లు. ఎలక్ట్రీషియన్ను సంప్రదిస్తే లీకేజీ కరెంట్ క్లాంప్ మీటర్తో లోపాన్ని గుర్తిస్తాడు. దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. ్య మీటర్ దగ్గర్నుంచి ఎర్త్ పాయింట్ వరకు.. స్విచ్బోర్డులు, సాకెట్ల దాకా లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్తో తనిఖీ చేయించాలి. ప్రతి పాయింట్ పరిశీలిస్తే ఎక్కడ నుంచి కరెంట్ లీక్ అవుతుందో తెలుస్తుంది.
* ఇళ్లలో తప్పుడు వైరింగ్ కారణంగానే బిల్లులు మారిపోతుంటాయి. ఒక ఫ్లాట్ తీగను మరో ఫ్లాట్ మీటర్లో కలపడం, కామన్ మోటారును ఎవరో ఒక పోర్షన్లో ఉండే వారికి కలపడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి సరి చేసుకుంటే వాస్తవిక బిల్లునే చేతికొస్తుంది.
లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్ అంటే..
చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ (సీఈఐజీ), ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా వైర్మెన్ పర్మిట్ గానీ సూపర్వైజర్ పర్మిట్గానీ ఉన్నవారు. ఇలాంటి వారు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుడిబుడి అడుగులు..చదువులకు పరుగులు
[ 13-06-2024]
వేసవి సెలవులు ముగిశాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. ఇన్ని రోజులు ఇళ్లలో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు పాఠశాలల పునఃప్రారంభంతో తరగతి గదుల్లో అడుగుపెట్టారు. -
శివారులన్నీ బల్దియాలోకి
[ 13-06-2024]
హైదరాబాద్ శివారులోని ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు -
రూ.200 కోట్ల మనీ లాండరింగ్లో నిందితురాలని బెదిరించి..
[ 13-06-2024]
మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్నారని ఫోన్ చేసి నగదు దోచేశారంటూ బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో బుధవారం ఫిర్యాదు చేశారు. -
వెలుగుల మాటున చేతి వాటం
[ 13-06-2024]
విద్యుత్తు కనెక్షన్ల జారీ, పాడైన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, లైన్ క్లియర్ అనుమతి, సీటీబీటీ మీటర్లకు సీల్ వేయడం..ఇలా ప్రతిదాంట్లో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది, ఇంజినీర్లు బహిరంగంగానే వసూళ్లకు తెగబడుతున్నారు. -
నీరు నిలిస్తే.. ఖర్చు యజమానులదే
[ 13-06-2024]
వర్షాకాలం మొదలైనందున డెంగీ, మలేరియా, ఇతర వ్యాధుల నుంచి నగరవాసులకు రక్షణ కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు -
ఇన్స్టాలో స్నేహం.. పెళ్లయ్యాక డ్రగ్స్ వ్యాపారం
[ 13-06-2024]
బెంగళూర్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న భార్యాభర్తలు సయ్యద్ ఫైజల్ (27), ముషారత్ ఉన్నీసాబేగం అలియాస్ నదియా(27)తోపాటు జునైద్ఖాన్(29), మహ్మద్ అబ్రార్ ఉద్దీన్(28), రహ్మత్ఖాన్(46)లను తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీన్యాబ్) పోలీసులు అరెస్టు చేసినట్టు బుధవారం తెలిపారు. -
శివార్లలో ధార్ గ్యాంగ్.. పోలీసుల అలర్ట్
[ 13-06-2024]
నగర శివార్లలో ధార్ గ్యాంగ్ కదలికల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకేసారి ఎక్కువ ఇళ్లలో దోపిడీలతో దడ పుట్టించే ఈ ముఠా శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో రాత్రిపూట పెట్రోలింగ్ పెంచాలని నిర్ణయించారు. ‘ -
పబ్బుల్లో అమ్మాయిలతో ఎర.. డబ్బు గుంజేసే ముఠా
[ 13-06-2024]
ఆన్లైన్ డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి పబ్బుల్లో దందా నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ పోలీసులు అరెస్టుచేశారు. -
రూ.7 కోట్లు వసూలు చేసి మరొకరికి కాంట్రాక్టు
[ 13-06-2024]
మణికొండ చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో మరో కుంభకోణం బయపడింది. సొసైటీ భూముల్లో ట్విన్ టవర్స్ నిర్మాణం పేరుతో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ తన దగ్గర రూ.7 కోట్లు వసూలు చేశారని ఓ కాంట్రాక్టరు సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆశ్రయించారు. -
దూకుడు తగ్గేదెలా !
[ 13-06-2024]
రవాణాశాఖ నిబంధనల ప్రకారం..డ్రై వింగ్ లైసెన్సు పొందలేని మైనర్లు వాహనాలను నడపొద్దు.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసినా పిల్లలకు వాహనాలు ఇవ్వడంతో దూకుడుగా వెళ్లి ప్రమాదాలకు కారణమవుతున్నారు -
పాఠశాల బస్సులపై కొరడా
[ 13-06-2024]
గ్రేటర్వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు తెరుచుకున్న దృష్ట్యా రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫిట్నెస్ లేకపోవడంతోపాటు త్రైమాసిక పన్నులు చెల్లించకుండా రోడ్డెక్కిన బస్సులపై కొరడా ఝుళిపించారు. -
నవ్వాంద్రకు చంద్రుడు.. నవచరితకు ఆద్యుడు
[ 13-06-2024]
‘‘నవ్యాంధ్ర రథసారథిగా.. చంద్రన్న కొలువుదీరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వేదికగా.. లక్షలాది అభిమానులు.. వేలాది ఆత్మీయులు.. వందలాది బంధుమిత్రులు తరలిరాగా.. ప్రధాని మోదీ సమక్షంలో.. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
అక్రమార్కులతో అధికారుల జట్టు
[ 13-06-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో ప్రణాళిక విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల్లో కీలకమైన ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేయడంతోపాటు బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తోంది. -
రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
[ 13-06-2024]
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు ఆయన మానస విద్యాలయం రమాదేవి పబ్లిక్ స్కూల్లో బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. -
కళాశాలల గుర్తింపు ప్రక్రియ రెండో విడతపై కసరత్తు
[ 13-06-2024]
ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపులో కీలకమైన అప్పిలేట్ కమిటీ పరిశీలన రెండో ఫేజ్కు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. -
తొలిరోజే.. తప్పని నిరీక్షణ!
[ 13-06-2024]
పాఠశాలల పునః ప్రారంభమైన తొలిరోజే బుధవారం ఉర్దూ మాధ్యమం పాఠశాల తెరుచుకోక పిల్లలు నిరీక్షించి ఇంటిదారి పట్టారు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం..మండల పరిధిలోని ఎన్కతలలో ఉర్దూ విద్య అభ్యసించేందుకు ప్రాథమిక పాఠశాల ఉంది. -
గంజాయి ఘాటు..కట్టడి చేయకుంటే చేటు
[ 13-06-2024]
జిల్లాల గంజాయి అక్రమ రవాణా, వాడకం చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువతే లక్ష్యంగా గంజాయి దందా కొనసాగుతోంది. -
ఆ ప్రచారం నమ్మొద్దు.. సాధారణ బస్సు ఛార్జీలు పెంచలేదు: టీజీఎస్ ఆర్టీసీ
[ 13-06-2024]
తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (TGS RTC) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.