‘అప్రజాస్వామికంగా కేంద్ర ప్రభుత్వ తీరు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఐఎన్టీయూసీ నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మౌనదీక్ష చేపట్టారు.
గోదావరిఖని: మౌన దీక్షలో కాంగ్రెస్ నాయకులు
గోదావరిఖని, న్యూస్టుడే: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఐఎన్టీయూసీ నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మౌనదీక్ష చేపట్టారు. ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ప్రసాద్ ఆధ్వర్యంలో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని దీక్షలో కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక పార్లమెంటు సభ్యత్వం రద్దు చేసిందని ఆరోపించారు. భాజపాలో ఎంతో మంది నాయకులు రూ.వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డవారున్నారని.. మంత్రుల హోదాలో ఉన్న వారిపై కేసులు వేస్తే ఒక్కరూ పార్లమెంటులో మిగలరన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వారి ప్రాణాలు తీస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు ఎస్.నర్సింహారెడ్డి, ధర్మపురి, జగన్మోహన్, తిరుపతి, రాజేందర్, దాస్, మనోహర్, వికాస్, కార్పొరేటర్ సుజాత, నాయకులు వాజిద్ఖాన్ తదితరులున్నారు.
సెంటినరీ కాలనీలో రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
సెంటినరీకాలనీ: రాహుల్గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని వ్యతిరేకిస్తూ రామగిరి మండల కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఆదివారం రామగిరి మండలంలో రాస్తారోకోను నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రమైన సెంటినరీ కాలనీకి చేరుకొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దపల్లి - మంథని రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేశారు. కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలశాఖ అధ్యక్షుడు చంద్రయ్య, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, రవీందర్రెడ్డి, గణపతి, మహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.