ఇద్దరికి అమాత్యయోగం
అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సీనియర్ నేతలకే అవకాశం
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
పొన్నం ప్రభాకర్
ఈనాడు, కరీంనగర్, పెద్దపల్లి : అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో అనుభవం దృష్ట్యా మొదటి విడతలోనే మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీధర్బాబు ఇప్పటికే అయిదుసార్లు మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు మంత్రిగా పనిచేశారు. పొన్నం ప్రభాకర్కు గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీధర్బాబు 2009లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందించారు. రోశయ్య కేబినెట్లోనూ కొనసాగిన ఆయనకు కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా శాసనసభ వ్యవహారాలు, న్యాయమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
కార్యకర్తల సంబరాలు
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో హుస్నాబాద్ కలుపుకొని 13 నియోజకవర్గాలుండగా ఇందులో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మరో అయిదుచోట్ల భారాస అభ్యర్థులు గెలుపొందారు. పాత కరీంనగర్ జిల్లాలో శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతోపాటు మరొకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం సాగినప్పటికీ ఇద్దరికే అమాత్య యోగం దక్కింది. మున్ముందు విస్తరణలో మరొకరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొన్నం నివాసం కరీంనగర్లో ఉండటంతో ఆయన ఇక్కడికి తరచూ రాకపోకల్ని సాగించే అవకాశం ఉండగా.. మంత్రి శ్రీధర్బాబు గతంలో మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్లోనే నివాసం ఉండే అవకాశమున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గతంలో మన జిల్లా మంత్రులు వీరు...
- ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 21 మంది మంత్రి పదవుల్ని అందుకున్నారు. ఈసారి కొత్తగా పొన్నం ప్రభాకర్ ఈ జాబితాలో చేరడంతో మొత్తంగా 22 మందికి అమాత్య యోగం లభించింది. వీరేకాకుండా గతంలో జి.నారాయణరావు, దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్లుగా పనిచేశారు.
- పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన జి.వెంకటస్వామి కార్మిక, పౌరసరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు.
1. పీవీ నరసింహారావు : న్యాయ, ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, విద్యాశాఖ
2. కెవి. నారాయణరెడ్డి : ప్రణాళిక, న్యాయశాఖ
3. జె.చొక్కారావు : రవాణా, భూగర్భజలాలు, వ్యవసాయం, పరిశ్రమలు, పౌరసరఫరాలు
4. వర్దినేని వెంకటేశ్వర్రావు : భూగర్భజలాలు, లఘు పరిశ్రమలు, కార్మిక, న్యాయ, రెవెన్యూశాఖలు
5. టి. జీవన్రెడ్డి : ఎక్సైజ్ ఆబ్కారీ, పంచాయత్రాజ్ శాఖ
6. మాతంగి నర్సయ్య : షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ
7. రాజేశంగౌడ్ : న్యాయశాఖ
8. పాటిరాజం : నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ
9. సి.ఆనందరావు : న్యాయశాఖ
10. ఎన్.రాంకిషన్రావు : అటవీశాఖ
11. ఎం. దామోదర్రెడ్డి : మైనింగ్శాఖ, సాంకేతిక విద్య
12. ఎల్.రమణ : చేనేత , జౌళి శాఖ
13. సుద్దాల దేవయ్య : సహకార శాఖ
14. ఇనుగాల పెద్దిరెడ్డి : కార్మిక, ఉపాధి, పర్యాటకం, చక్కెరశాఖలు
15. ఎం. సత్యనారాయణరావు : దేవాదాయ, క్రీడలు, సినిమాటోగ్రఫీ
16. కెప్టెన్ లక్ష్మీకాంతరావు : బీసీ సంక్షేమశాఖ
17. దుద్దిళ్ల శ్రీధర్బాబు : ఉన్నత విద్య, న్యాయ, ఎన్నారై వ్యవహారాలు, పౌరసరఫరాలు వినయోగదారుల వ్యవహారాలు, శాసనసభ వ్యవహారాలు శాఖలు
18. ఈటల రాజేందర్ : ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాలు, వైద్యఆరోగ్యశాఖలు
19. కె.తారకరామారావు : పురపాలిక, ఐటీ, పరిశ్రమల శాఖలు
20. కొప్పుల ఈశ్వర్ : ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలు
21. గంగుల కమలాకర్ : బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖలు
దుద్దిళ్ల శ్రీధర్బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..