బియ్యం అమ్మకాల్లో గోల్మాల్
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు.
తక్కువ తూకంతో విక్రయం
బ్రాండ్ల పేరుతో మాయ
న్యూస్టుడే, హుజూరాబాద్
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. బియ్యం ప్యాకింగ్ అనుమతులు లేకుండా విక్రయిస్తూ తూకంలో మోసం చేస్తూ ప్రజలను నష్టపరిచి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలిసిన రైస్డిపోలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని బియ్యం అమ్మకాల్లో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
అనుమతులు ఏవి..
రైస్డిపోల ఏర్పాటుకు ప్యాకేజ్డ్ కమోడిటిస్ యాక్టు కింద తప్పనిసరిగా తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. బియ్యం సంచులపై బ్రాండ్ పేరు, ఎన్ని కిలోలు, ఎంఆర్పీ, తయారీ సంస్థ, చిరునామా, ప్యాకింగ్ తేదీ, చరవాణి నంబరు తదితర వివరాలు తప్పనిసరిగా ముద్రించాలి. బియ్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను విధించిన నేపథ్యంలో తప్పనిసరిగా జీఎస్టీ లైసెన్స్ తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలేవి వ్యాపారులు పాటించడం లేదు. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్క రైస్డిపోకు కూడా ప్యాకింగ్ అనుమతి లేకపోవడం గమనార్హం. హుజూరాబాద్లోని పలు రైస్డిపోల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్రాండెడ్ పేర్లు ముద్రించి బియ్యం నింపేందుకు సిద్ధంగా ఉన్న వేల ఖాళీ సంచులను తూనికల, కొలతల శాఖ అధికారులు గుర్తించారు.
వినియోగదారుల కళ్లకు గంతలు
ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బీపీటీ, జైశ్రీరాం, సోనా, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ తదితర సన్న రకం బియ్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేస్తారు. కానీ తక్కువ నాణ్యత కల్గిన బియ్యాన్ని ఈ పేర్లతో ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారులు లాభం పొందుతున్నారు. స్థానికంగా పండించిన ధాన్యాన్ని మరపట్టించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ముద్రించిన సంచుల్లో బియ్యాన్ని నింపి అమ్ముతున్నారు. ఎక్కువ ధర ఉన్న సన్నాల బియ్యంలో తక్కువ ధర బియ్యాన్ని కలిపి బ్రాండెడ్ అని నమ్మించి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఆర్ఎన్ఆర్ బియ్యాన్ని జైశ్రీరాం బ్రాండ్ పేరిట సంచుల్లో ప్యాకింగ్ చేసి క్వింటాకు రూ.7,000 చొప్పున విక్రయిస్తున్నారు. దీనికితోడు బియ్యం తూకంలోనూ వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. నిజానికి ఖాళీ బియ్యం సంచి బరువు 100 గ్రాములు ఉంటుంది. 25, 26 కిలోల సంచులను తూకం వేస్తే 100 గ్రాములు అదనంగా ఉండాలి. కానీ 25 కిలోల సంచిని తూకం వేస్తే 700 గ్రాములు, అలానే 26 కిలోల సంచి కిలో 600 గ్రాములు తక్కువగా ఉంటుంది. ఈ నెల 8న, 24న తూనికలు, కొలతల శాఖ అధికారులు హుజూరాబాద్లోని నాలుగు రైస్డిపోల్లో దాడులు నిర్వహించగా ఈ తరహా మోసం బయట పడింది. సదరు దుకాణాలపై కేసులు నమోదు చేసి సుమారు రూ.3 లక్షల విలువైన 165 బియ్యం సంచులను సీజ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 12,35,810 కుటుంబాలు 70 శాతం సన్న బియ్యం వినియోగిస్తుండగా నెలకు 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిల్లర్లు, వ్యాపారుల దోపిడితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు ఏ స్థాయిలో నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
-కె.విజయసారథి, ఏసీ, తూనికలు, కొలతల శాఖ, కరీంనగర్
ఉమ్మడి జిల్లాలో బియ్యం ప్యాకింగ్ అనుమతులు ఒక్క దుకాణానికి లేవు. వినియోగదారులు కచ్చితంగా తూకం వేసిన తర్వాతే బియ్యం కొనుగోలు చేయాలి. తూకం తక్కువ ఉంటే అంతే ధర చెల్లించాలి. ఇలాంటి మోసాలపై వినియోగదారులు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే తనిఖీలు నిర్వహించి సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. ఇకపై తనిఖీలు ముమ్మరం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బల్దియా అక్రమాలపై నజర్
[ 17-06-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యకలాపాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అభివృద్ధి పనులు, పట్టణ ప్రణాళికపై వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఆ దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. -
ఆడపిల్లలపై వీడని వివక్ష
[ 17-06-2024]
జిల్లాలో బాలికల సంఖ్య తగ్గుతోంది. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడంతో వారి సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. -
సిబ్బంది కొరత.. శిథిల భవనం
[ 17-06-2024]
గంగాధరలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమస్యలు వేధిస్తున్నాయి. సరిపడా సిబ్బంది లేక.. శిథిల భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీస వసతులు లేక కార్యాలయానికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆలయ మాన్యాలకు శఠగోపం
[ 17-06-2024]
దేవుడి మాన్యాలకూ రక్షణ కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్నప్పటికీ ఆదాయం లేక ఆలయాల నిర్వహణ భారంగా మారింది. -
పేద విద్యార్థుల ప్రతిభకు పట్టం
[ 17-06-2024]
వారంతా పేద విద్యార్థులు.. అయినా వారిలో ప్రతిభకు కొదవలేదు. చదివేది ప్రభుత్వ పాఠశాలలోనైనా పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని జాతీయ ప్రతిభ ఉపకార వేతనాలకు ఎంపికయ్యారు. -
సాగులో సస్యరక్షణ చర్యలే కీలకం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పత్తి, ఇతర పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. కొద్దిపాటి వర్షానికే ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వరి సాగుకు నారును సిద్ధం చేశారు. తీరా వర్షం కురవకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. -
సృజన ఆవిష్కృతం.. విజ్ఞాన సమ్మిళితం
[ 17-06-2024]
ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసేందుకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
భార్య జ్ఞాపకం.. గుడితో పదిలం
[ 17-06-2024]
భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలు గుర్తుండేలా గుడి నిర్మించాడు ఓ భర్త.. నిత్యం ఆ గుడిలో దీపం వెలిగించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. -
శాశ్వత చర్యలు ఎక్కడ?
[ 17-06-2024]
వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఏటా వరదలు సంభవించి కాలనీలు జలమయమవడం, ఇళ్ల నుంచి ప్రజలు బయటకురాని పరిస్థితులు నెలకొన్నా ముప్పు నివారణకు పాలకులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. -
సంస్కరణల అమలుతోనే అభివృద్ధి
[ 17-06-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ఆలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురిలో రానున్న రోజుల్లో పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అరకొర వసతులు.. మొక్కుబడి పరీక్షలు
[ 17-06-2024]
ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక వాహనాల రిజిస్ట్రేషన్లతో యూనిట్ కార్యాలయం నుంచి ఆర్టీవో స్థాయికి ఉన్నతి పొందిన పెద్దపల్లి రవాణా శాఖ అద్దె భవనంలో అరకొర వసతులతోనే కాలం వెళ్లదీస్తోంది. -
ధరణి సమస్యలకు పరిష్కారం లభించేనా!
[ 17-06-2024]
ధరణి సమస్యల పరిష్కారంపై కదలిక వచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పెండింగ్ దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
దుకాణాలను మింగిన రహదారి
[ 17-06-2024]
మండల కేంద్రమైన రుద్రంగి ప్రధాన రహదారి గుట్టను ఆనుకొని ఎత్తు ప్రదేశంలో ఉంటుంది. ఇలాంటి రహదారిని ఎత్తుగా నిర్మించే క్రమంలో పాత రహదారిపై ఉన్న మట్టిని తొలగించకుండానే కొత్తగా వేయడంతో మరింత ఎత్తు పెరిగి దాని వెంబడి దుకాణాలు నిండా మునిగాయి. -
నీరు పారదు.. పంట తడవదు
[ 17-06-2024]
కాల్వల్లో పెరిగిన చెట్లు.. పూడికతో నిండిన మట్టి.. పగుళ్లు బారిన లైనింగ్, ధ్వంసమైన డిస్ట్రిబ్యూటరీలు. కొన్ని చోట్ల అసలు కాల్వల నామరూపాల్లేకుండా పోయాయి. -
చెక్డ్యాంల రక్షణ గోడలకు మరమ్మతులు
[ 17-06-2024]
భూగర్భ జలాలను పెంపొందించేందుకు, వ్యవసాయ, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం మూలవాగులో చెక్డ్యాంల నిర్మాణం చేపట్టింది. అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రక్షణ గోడలు కోతకు గురయ్యాయి. -
మంత్రికి మగ్గంపై నేసిన చిత్రపటం బహూకరణ
[ 17-06-2024]
చేనేత మగ్గంపై నేసిన బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాన్ని ఆదివారం టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ హుస్నాబాద్లో ఆయనను కలిసి బహూకరించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బెదిరించి రాజీనామాలు చేయించారు.. వైకాపా నేతలపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదు
-
జగన్ ఇంటి బయట కూల్చివేతలు.. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్పై బదిలీ వేటు
-
‘కర్మ’ఫలం ఇది.. వైకాపాను ఉద్దేశించి పోస్టు చేసిన సీమెన్స్ మాజీ ఎండీ!
-
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
-
‘ఉద్యోగాలు దక్కాలంటే పెట్టెలు తేవాలన్న బొత్స, సజ్జల’
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’