స్వర సామ్రాజ్యంలో మురళీరవం!
సంగీత దర్శకులు శ్రావ్యమైన పాటలు పాడించాలంటే అందుకు కావలసిన ప్రధాన వాయిద్యం పిల్లనగ్రోవి. సంగీత వాయిదాల్లో దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆనాడు ద్వాపరయుగంలో నల్లనయ్య పిల్లనగ్రోవి ఊదుతుంటే ఆవులూ, పాములూ నాట్యం చేశాయట.
ఒకరు రంధ్రాలు..ఇంకొకరు స్వరాలు రాబడుతున్న
అన్నదమ్ములు రాఘవేంద్ర, విజయ్
వీరికి ఎలా అబ్బిందంటే..? : రాఘవేంద్ర తాత గారు ప్రేమనాథ్ సా బది, పెద్దనాన్న విఠల్ సా బది చక్కని వేణు గాయకులు. ఇందులో విఠల్ బది రాజ్యోత్సవ పురస్కారం కూడా అందుకున్నారు. వారి నుంచి కుమారుడు రాఘవేంద్రకు ఈ విద్య అబ్బింది. పదేళ్ల కిందట రాఘవేంద్రకు చిన్న ప్రమాదంలో వేలు తెగింది. దీంతో వేణుగానం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే దానిపై మమకారం చంపుకోలేక గానానికి స్వస్తి చెప్పి మురళీలు తయారీలోకి దిగారు. గాన సాధనలో లభించిన అనుభవాన్ని తయారీలో చూపించారు. అనతికాలంలోనే ఆన్లైన్లో ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. దీంతో తమ్ముడు విజయ్, ఇంట్లోని ఇతర సభ్యులు చేదోడుగా నిలిచి దీనినే ఉపాధిగా మలచుకున్నారు.
వివిధ కొలతల్లో తయారీ ..: బాన్సురీలకు కావలసిన నాణ్యమైన వెదురు అసోం, ఉత్తరప్రదేశ్ల నుంచి తెచ్చుకుంటారు. పదింటిలో సగం పురుగుపట్టో, వంకరపోయో వృథా అవుతుంటాయి. బాగా పచ్చిగా ఉన్న వెదురు కర్రలను ఆవపు నూనెలో నానబెట్టి నెల రోజుల వరకూ ఎండబెడతారు. అనంతరం సైజుల ప్రకారం పిల్లనగ్రోవులను తయారు చేస్తారు. ఒక మురళి అర గంటలోనే తయారవుతోంది. అయితే మెరుగులు దిద్దడానికి నాలుగు గంటల వరకూ సమయం పడుతోంది.
పిల్లనగ్రోవులను మొత్తం 36 రకాల వాయిద్యాలకు అనువుగా వివిధ కొలతల్లో (సైజుల్లో) రూపొందిస్తారు. హిందుస్థానీ రాగానికి ఏడు రంధ్రాలు పెడతారు.. వీటినీ కళాకారులు ఆరు వేళ్లతో మోగిస్తారు. అదే కర్ణాటక సంగీతకారులు ఎనిమిది రంధ్రాలు గల సాధనాన్ని తీసుకుని ఏడు వేళ్లు ఉపయోగించి ఊదుతారు. ఎనిమిది నుంచి 40 అంగుళాల సైజుల వరకూ ఆర్డర్లపై వీటిని తయారు చేస్తారు. తొలుత రంధ్రాలు వేసి.. రాగాలు సరిగా పలుకుతున్నాయో లేదో చూస్తారు. ఆపై వెదురు పగిలిపోకుండా రేష్మీ దారంతో గట్టిగా చుట్టి మెరుగులు అద్ది శానిటైజ్ చేసి ఆర్డర్ల ప్రకారం ప్యాకింగ్ చేస్తారు. ఒక్కోటి సైజును బట్టి రూ.2000 నుంచి రూ.5000 వరకూ ధర నిర్ణయిస్తారు. వేణువుతో ముడిపడిన మా కుటుంబానికి అదే జీవనాధారం అయిందని రాఘవేంద్ర బది, విజయ్కుమార్ బది అన్నదమ్ములు ఆనందంగా చెబుతున్నారు.
పిల్లనగ్రోవి తయారీలో రాఘవేంద్ర బది
ఇలా పెట్టెల్లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తారు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు