రాహుల్ రంగప్రవేశం
ఇప్పటికే దావణగెరెలో సిద్ధరామయోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ మరో భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో ప్రవేశించే ఏఐసీసీ నేత రాహుల్గాంధీ ‘భారత ఐక్యతా యాత్ర’ (భారత్ జోడో యాత్ర) రానున్న 21 రోజులు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనుంది.
నేడే గుండ్లుపేటలో యాత్ర
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
ఈనాడు, బెంగళూరు : ఇప్పటికే దావణగెరెలో సిద్ధరామయోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన కాంగ్రెస్ మరో భారీ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటలో ప్రవేశించే ఏఐసీసీ నేత రాహుల్గాంధీ ‘భారత ఐక్యతా యాత్ర’ (భారత్ జోడో యాత్ర) రానున్న 21 రోజులు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనుంది. తమిళనాడు, కేరళలో ఇప్పటికే 22 రోజుల యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్.. రాష్ట్రంలో 500కుపైగా కిలోమీటర్ల పాటు ముందుకు సాగనున్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనుండగా- అధికార పక్షం ఈ యాత్ర ప్రభావాన్ని లెక్కించే పనిలో ఉంది.
రాహుల్ రాక నేపథ్యంలో గుండ్లుపేటలో స్వాగత ద్వారం ఏర్పాటు
రాష్ట్రం.. కీలకం
సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన రాహుల్ యాత్ర 12 రాష్ట్రాల మీదుగా కశ్మీరులో ముగుస్తుంది. ఈ రాష్ట్రాలన్నింటిలో కర్ణాటక ఆ పార్టీకి ఎంతో కీలకం. మరో ఆరు నెలల్లో నిర్వహించే విధానసభ ఎన్నికల నేపథ్యంలో ఈ యాత్రను విజయవంతం చేయటం కాంగ్రెస్కు ఎంతో కీలకం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో కాస్త బలంగా ఉన్న కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుకొనేందుకు యత్నిస్తోంది. రాష్ట్ర చరిత్రలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలను రాబట్టిన సిద్ధరామోత్సవానికి మించి జోడో యాత్రను విజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ ఈ యాత్రలో పాల్గొంటారు. రాష్ట్ర నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సత్తా చాటడానికి ముందుకు కదలుతున్నారు.
‘పే సీఎం’ ఉత్సాహంతో..
కాంగ్రెస్ సామాజిక మాధ్యమం సృష్టించిన ‘పే సీఎం’ ప్రచారం భాజపాకు దాదాపు చెమటలు పట్టించింది. జాతీయ స్థాయిలో అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. ఓ వైపు అధికారపక్షం ఈ ప్రచార బాధ్యులను విచారించి అదుపులో తీసుకునే పనిలో ఉన్నా కాంగ్రెస్ ఏమాత్రం జంకలేదు. ఈ ఉత్సాహంలో సామాజిక మాధ్యమ విభాగాన్ని ఇంకాస్త బలోపేతం చేసేందుకు యువకులైన సాంకేతిక నిపుణులను నియమించుకుంది. యువనేత ప్రియాంక్ ఖర్గే నేతృత్వంలోని ఈ విభాగం రానున్న రోజుల్లో మరిన్ని ప్రచారాలతో అధికార పక్షానికి సవాలు విసరనుంది. రాష్ట్రంలో ‘40 శాతం అవినీతి’ పేరిట కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అధికార పక్షానికి మింగుడుపడని అంశం.
అధిష్ఠానం సూచనలతో..
దావణగెరెలో సిద్ధరామోత్సవం సాధించిన విజయం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి పలు సవాళ్లను ముందుంచింది. ఈ కార్యక్రమంపై అధిష్ఠానం ప్రత్యేక నివేదిక కూడా తెప్పించుకుని రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది. తాజా ‘పే సీఎం’ ప్రచారం జాతీయ స్థాయిలో కలకలం రేపడంతో అధిష్ఠానం బొమ్మై సర్కారుపై నిప్పులు చెరిగినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమైన బొమ్మై.. పార్టీని, నాయకత్వాన్ని బలోపేతం చేయటం, కాంగ్రెస్ చేసిన ‘పే సీఎం’ ప్రచారానికి దీటైన ప్రచారాన్ని చేపట్టకపోవటంపై అధిష్ఠానం గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ప్రతిపక్షం చేసిన ప్రచారంలో వాస్తవాలెలా ఉన్నా ‘40 శాతం కమీషన్’ అంశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేదిగా పరిణమించినట్లు జాతీయ స్థాయిలో సమీక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మొదలైన కాంగ్రెస్ భారత్ ఐక్యతా యాత్రపైనా దృష్టి సారించాలని రాష్ట్ర నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. గుండ్లుపేట జాతీయ రహదారిలో యాత్ర తాలూకు ఫ్లెక్సీలను చించివేసిన సంఘటన పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉండరాదని బొమ్మై పార్టీ నేతలకు సూచించారు.
గుండ్లుపేటలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తదితరులు
యాత్రకు ‘స్వరాజ్’మద్దతు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : దక్షిణం నుంచి ఉత్తర భారతదేశానికి కర్ణాటక, సాహిత్య, సంస్కృతిని పరిచయం చేయాలని స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఆయన శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో అధికార పార్టీ ద్వేష రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజల మధ్య చీలికలను తీసుకు వస్తోందని ఆరోపించారు. కర్ణాటక నుంచి జ్ఞానపీఠ పురస్కారాలను అందుకున్న గిరీశ్ కర్నాడ్, అనంతమూర్తి, కువెంపు, దారా బేంద్రే తదితరుల అనువాద రచనలతో పాటు దళిత సాహితీవేత్తలు డి.ఆర్.నాగరాజ్, దేవనూరు మహదేవ రచనలను తాను చదివానని చెప్పారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను రాహుల్గాంధీ దిల్లీ వరకు తీసుకెళ్లాలని సూచించారు.
పాపాల శిశివు.. భాజపా
సిద్ధరామయ్య
మైసూరు, న్యూస్టుడే : పీఎఫ్ఐ.. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన బిడ్డ అయితే- ఆర్ఎస్ఎస్ పాపాల శిశువే భాజపా అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. భాజపా నాయకులు ఒకే అబద్దాన్ని వందలసార్లు చెప్పి, దాన్ని నిజమని భ్రమింపజేస్తారని ఎద్దేవా చేశారు. మైసూరులో గురువారం తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా జాగృతి కల్పించేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం గుండ్లుపేటకు చేరుకుంటోందని తెలిపారు. అక్కడి నుంచి నంజనగూడు మార్గంలో కడకోళలో భోజనం చేసి, బండీపాళ్య వద్ద బహిరంగ సభలో రాహుల్ మాట్లాడతారని వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన మైసూరులో బస చేస్తారని చెప్పారు. పీఎఫ్ఐ, ఎస్డీపీఐ రెండూ భాజపాకు బీటీమ్గా వ్యవహరిస్తున్నాయని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ఆరోపించారు. భాజపా అధికారంలో ఉన్నచోట మత ఘర్షణలు, ప్రజల మధ్య చీలికలు తెచ్చేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నింటారని విమర్శించారు. గుండ్లుపేటలో భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలను చించివేయడం వెనుక భాజపా కార్యకర్తల పాత్ర ఉందన్నారు. యాత్రకు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలేక ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్