15 రోజుల్లో పెళ్లి..కాటేసిన పిడుగు
ఆ యువకుడికి మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం మంచి మాటలకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. మృత్య రూపంలో పిడుగు కాటు వేయడంతో యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన గురువారం రాత్రి బళ్లారి తాలూకాలో జరిగింది.
శోకసంద్రంగా మారిన రాయపురం
రుద్రమణి (పాత చిత్రం)
బళ్లారి, న్యూస్టుడే: ఆ యువకుడికి మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం మంచి మాటలకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారు. మృత్య రూపంలో పిడుగు కాటు వేయడంతో యువకుడు అనంతలోకాలకు చేరుకున్న ఘటన గురువారం రాత్రి బళ్లారి తాలూకాలో జరిగింది. ఈ ఘటనతో సంతోషంగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది. తాలూకా రాయపుర గ్రామానికి చెందిన రుద్రమణి(23), స్నేహితుడు తరుణ్(21)లు గురువారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వర్షం రావడంతో పొలంలో చెట్టు కిందకు వెళ్లారు. ఉన్న ఫళంగా పిడుగు పడటంతో రుద్రమణి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, తరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి గాయపడిన తరుణ్ను విమ్స్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రాయపురు గ్రామస్థాయి పి.డి.వో ప్రకాష్, ఇతర అధికారులు పి.డి.హళ్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విమ్స్కు తరలించారు. శుక్రవారం కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పి.డి.హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మంత్రి బి.నాగేంద్ర సోదరుడు వెంకటేష్ ప్రసాద్ రాయపుర గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం సాయం వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.
పెళ్లింట విషాదఛాయలు
రుద్రమణికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. శనివారం నిశ్చితార్థం చేసుకుని తాంబూలాలు తీసుకోవాల్సి ఉంది. ఉన్న ఫళంగా గురువారం రాత్రి పిడుగు పడి రుద్రమణి మృతిచెందడంతో ఇల్లు, గ్రామం శోకసంద్రంగా మారింది. తాలూకా యాల్పి గ్రామానికి చెందిన ఓ రైతు కూడా చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురై మృతిచెందిన ఘటన మరవక ముందే మరో యువకుడు ఇదే తరహాలో మృతిచెందడాన్ని తాలూకా ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్