కొంత మోదం... కొంత ఖేదం
కేంద్ర బడ్జెట్ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీని వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదు.
కేంద్ర బడ్జెట్పై వ్యాపార, ఉద్యోగ వర్గాల అభిప్రాయం
కేంద్ర బడ్జెట్ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీని వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదు.
చిన్ని కృష్ణారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఖమ్మం
మధ్య తరగతి ప్రజలకు ఇది ఊరటనిచ్చే బడ్జెట్. కొంత వరకు బాగానే ఉంది. వ్యాపార రంగానికి కొంత అనుకూలంగానే ఉంది. రక్షణ రంగానికి అధికంగా నిధులు కేటాయించటం సంతోషకరం. మనకున్న ఆయుధ సంపత్తిని చూసి పాకిస్థాన్, చైనా భయపడుతున్నాయి. ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఖమ్మం వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు
త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర బడ్జెట్పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది చూసిన తర్వాత నిరాశకు గురయ్యారు. ప్రధానంగా వ్యాపారవర్గాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. పరిశ్రమలకు, వ్యవసాయరంగానికి ఎక్కువగా నిధులు కేటాయించలేదు.
కొప్పు నరేశ్కుమార్, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వేతన జీవులకు కొంత ఊరట కలిగించినట్లు కన్పిస్తోంది. వ్యవసాయ రంగాన్ని, మధ్య తరగతి పరిశ్రమలను పూర్తిగా విస్మరించింది. కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేసినట్లుంది. దేశంలో వృద్ధి రేటు గణనీయంగా ఉన్నా ఆ ఫలాలను ఉపాధి కల్పనకు పెంపొందించలేకపోతున్నారు.
ఎన్.వెంకన్న, సహాయ ఆచార్యుడు, ఎకనమిక్స్, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల
కేంద్ర బడ్జెట్ ప్రధానాంశాల్లో ప్రకృతి వ్యవసాయంలో ఆలోచనా విధానం అభినందించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పునాదిలో వ్యవసాయం ప్రధానమైన, మేకింగ్ వర్క్షాప్ విధానం అమలు చేయటం చాలా ప్రధానం. సంక్షేమ కేటాయింపుల్లో అసమానతలు రాష్ట్రాల మధ్య జరగకుండా చూడాలి. ఒక విధంగా ఇది మెరుగైన బడ్జెట్టే.
డాక్టర్ ఎన్.గోపి, సహాయ ఆచార్యుడు, ఎకనమిక్స్
‘‘కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేలా కేంద్రం బడ్జెట్ ఇది. మంత్రి నిర్మల బడ్జెట్లో తెలంగాణకు ప్రయోజనం లేకుండా పోయింది. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూ.5,300 కోట్లు కేటాయించారు. తెలంగాణలో భాజపాకు నలుగురు ఎంపీలున్నా మొండి చేయి చూపారు. పునర్విభజన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు.’’
తాతా మధు, ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు
‘‘కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచింది. సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేసేలా ఉంది. పునర్విభజన చట్టంలో అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. నిరుద్యోగం, గిట్టుబాటు ధర పట్టించుకోలేదు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే యత్నం చేశారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఊసెత్తలేదు.
పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు
‘‘కేంద్ర బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంది. వ్యవసాయానికి రూ.20 లక్షల కోట్లు రుణాల రూపంలో మంజూరు చేశారు. ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.7 లక్షలకు పెంచారు. ఫార్మా అభివృద్ధి, మేకిన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం, సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం, మహిళలు, దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రానున్నాయి.’’
గల్లా సత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు
‘‘కేంద్ర బడ్జెట్లో విద్యా, వైద్య రంగాలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను రూపొందించారు. అల్పాదాయ వర్గాలను పూర్తిగా విస్మరించారు. ఉపాధి పథకానికి రూ.65 కోట్లు, విద్యకు 2.6 శాతం మాత్రమే కేటాయించారు. వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపు పెంచినా బ్యాంకు వడ్డీల పేరుతో లాగే ప్రయత్నం జరిగింది.’’
పోటు ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి
‘‘కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ వర్గాలను సంతృప్తిపరిచేలా ఉంది. నిరుద్యోగులు, రైతులు, మధ్యతరగతి వర్గాలను నిరాశపరిచింది. కీలక వ్యవసాయ రంగానికి తగిన కేటాయింపులు లేవు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు. రాష్ట్రంలో బయ్యారం ఉక్కు కర్మాగారానికి, ఇతర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేవు. పొడిగింపు విషయంలోనూ అన్యాయం జరిగిది.’’
పోటు రంగారావు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి
‘‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం దొరకని బడ్జెట్ ఇది. బడ్జెట్లో రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు కొత్త ప్రతిపాదనలేమీ లేవు. గతంలో హామీ ఇచ్చినా వాటి ఊసే లేదు. ఉపాధి హామీకి గతం కన్నా రూ.30 వేల కోట్లు తగ్గించారు. పరిశ్రమలకు 2 శాతం పన్ను మినహాయింపు కంటి తుడుపు చర్య’’.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఖమ్మం
- ఖమ్మం బుర్హాన్పురం, ఖమ్మం కమాన్బజార్, ఖమ్మం నగరం,
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..