కొంత మోదం... కొంత ఖేదం
కేంద్ర బడ్జెట్ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీని వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదు.
కేంద్ర బడ్జెట్పై వ్యాపార, ఉద్యోగ వర్గాల అభిప్రాయం
కేంద్ర బడ్జెట్ వల్ల వ్యాపార వర్గాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు. వ్యవసాయం దెబ్బతింటే దాని ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీని వల్ల అదనంగా ఒనగూరే ప్రయోజనం లేదు.
చిన్ని కృష్ణారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఖమ్మం
మధ్య తరగతి ప్రజలకు ఇది ఊరటనిచ్చే బడ్జెట్. కొంత వరకు బాగానే ఉంది. వ్యాపార రంగానికి కొంత అనుకూలంగానే ఉంది. రక్షణ రంగానికి అధికంగా నిధులు కేటాయించటం సంతోషకరం. మనకున్న ఆయుధ సంపత్తిని చూసి పాకిస్థాన్, చైనా భయపడుతున్నాయి. ఆర్థికంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశం మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఖమ్మం వర్తక సంఘం మాజీ అధ్యక్షుడు
త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర బడ్జెట్పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది చూసిన తర్వాత నిరాశకు గురయ్యారు. ప్రధానంగా వ్యాపారవర్గాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. పరిశ్రమలకు, వ్యవసాయరంగానికి ఎక్కువగా నిధులు కేటాయించలేదు.
కొప్పు నరేశ్కుమార్, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వేతన జీవులకు కొంత ఊరట కలిగించినట్లు కన్పిస్తోంది. వ్యవసాయ రంగాన్ని, మధ్య తరగతి పరిశ్రమలను పూర్తిగా విస్మరించింది. కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేసినట్లుంది. దేశంలో వృద్ధి రేటు గణనీయంగా ఉన్నా ఆ ఫలాలను ఉపాధి కల్పనకు పెంపొందించలేకపోతున్నారు.
ఎన్.వెంకన్న, సహాయ ఆచార్యుడు, ఎకనమిక్స్, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల
కేంద్ర బడ్జెట్ ప్రధానాంశాల్లో ప్రకృతి వ్యవసాయంలో ఆలోచనా విధానం అభినందించాల్సిన విషయం. ఆర్థిక వ్యవస్థ పునాదిలో వ్యవసాయం ప్రధానమైన, మేకింగ్ వర్క్షాప్ విధానం అమలు చేయటం చాలా ప్రధానం. సంక్షేమ కేటాయింపుల్లో అసమానతలు రాష్ట్రాల మధ్య జరగకుండా చూడాలి. ఒక విధంగా ఇది మెరుగైన బడ్జెట్టే.
డాక్టర్ ఎన్.గోపి, సహాయ ఆచార్యుడు, ఎకనమిక్స్
‘‘కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేలా కేంద్రం బడ్జెట్ ఇది. మంత్రి నిర్మల బడ్జెట్లో తెలంగాణకు ప్రయోజనం లేకుండా పోయింది. కర్ణాటక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూ.5,300 కోట్లు కేటాయించారు. తెలంగాణలో భాజపాకు నలుగురు ఎంపీలున్నా మొండి చేయి చూపారు. పునర్విభజన హామీలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు.’’
తాతా మధు, ఎమ్మెల్సీ, భారాస జిల్లా అధ్యక్షుడు
‘‘కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశపరిచింది. సామాన్య, మధ్య తరగతి ప్రజల బతుకులను ఛిద్రం చేసేలా ఉంది. పునర్విభజన చట్టంలో అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. నిరుద్యోగం, గిట్టుబాటు ధర పట్టించుకోలేదు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే యత్నం చేశారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేదు. గిరిజన విశ్వవిద్యాలయం ఊసెత్తలేదు.
పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు
‘‘కేంద్ర బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉంది. వ్యవసాయానికి రూ.20 లక్షల కోట్లు రుణాల రూపంలో మంజూరు చేశారు. ఉద్యోగులకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.7 లక్షలకు పెంచారు. ఫార్మా అభివృద్ధి, మేకిన్ ఇండియా, మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం, సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం, మహిళలు, దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రానున్నాయి.’’
గల్లా సత్యనారాయణ, భాజపా జిల్లా అధ్యక్షుడు
‘‘కేంద్ర బడ్జెట్లో విద్యా, వైద్య రంగాలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను రూపొందించారు. అల్పాదాయ వర్గాలను పూర్తిగా విస్మరించారు. ఉపాధి పథకానికి రూ.65 కోట్లు, విద్యకు 2.6 శాతం మాత్రమే కేటాయించారు. వేతన జీవులకు ఆదాయ పన్ను మినహాయింపు పెంచినా బ్యాంకు వడ్డీల పేరుతో లాగే ప్రయత్నం జరిగింది.’’
పోటు ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి
‘‘కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ వర్గాలను సంతృప్తిపరిచేలా ఉంది. నిరుద్యోగులు, రైతులు, మధ్యతరగతి వర్గాలను నిరాశపరిచింది. కీలక వ్యవసాయ రంగానికి తగిన కేటాయింపులు లేవు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదు. రాష్ట్రంలో బయ్యారం ఉక్కు కర్మాగారానికి, ఇతర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేవు. పొడిగింపు విషయంలోనూ అన్యాయం జరిగిది.’’
పోటు రంగారావు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి
‘‘దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమాధానం దొరకని బడ్జెట్ ఇది. బడ్జెట్లో రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు కొత్త ప్రతిపాదనలేమీ లేవు. గతంలో హామీ ఇచ్చినా వాటి ఊసే లేదు. ఉపాధి హామీకి గతం కన్నా రూ.30 వేల కోట్లు తగ్గించారు. పరిశ్రమలకు 2 శాతం పన్ను మినహాయింపు కంటి తుడుపు చర్య’’.
- నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఖమ్మం
- ఖమ్మం బుర్హాన్పురం, ఖమ్మం కమాన్బజార్, ఖమ్మం నగరం,
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎలా వెళ్తారో.. అలా రావాల్సిందే..
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వినియోగించే ఈవీఎంలను ఆయా శాసనసభ నియోజకవర్గాలకు తరలించిన అధికారులు.. పోలింగ్ సిబ్బందిని సైతం సిద్ధం చేశారు. -
జిల్లాలో వర్షం
[ 08-05-2024]
నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
[ 08-05-2024]
ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు. -
రక్తహీనత.. బాధితులకు చేయూత
[ 08-05-2024]
థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. -
ఖమ్మంలో కమల వికాసం ఖాయం
[ 08-05-2024]
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కాంగ్రెస్, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. -
సత్వర న్యాయమే ప్రథమ ప్రాధాన్యం: జిల్లా జడ్జి
[ 08-05-2024]
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని, న్యాయవాదులు బెంచ్కు సహకరించాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్లో నూతన న్యాయాధికారుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. -
ఘనంగా సీతారామ కల్యాణోత్సవం
[ 08-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు సాగాయి. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన నిర్వహించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. -
రఘురాంరెడ్డిని గెలిపిస్తే.. ‘ఖమ్మం’ను అగ్రస్థానంలో నిలబెడతారు
[ 08-05-2024]
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
భారాస విజయమే లక్ష్యంగా పనిచేయండి: నామా
[ 08-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భారాస విజయమే లక్ష్యంగా బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బూత్స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కేసీఆర్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: కవిత
[ 08-05-2024]
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. దాస్తండాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి: భంజ్దేవ్
[ 08-05-2024]
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్ అన్నారు. భాజపా లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి దుర్మరణం
[ 08-05-2024]
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ భవన నిర్మాణ పనుల కోసం గుత్తేదారు, ఏపీలోని కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం బాలరామపురానికి చెందిన దాసరి సూరిబాబు(40), మరి కొందరిని తీసుకొచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM