ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్న కలెక్టర్ గౌతమ్, ఎన్నికల పరిశీలకుడు సంజయ్
ఖమ్మం నగరం, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు. మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండో దశలో ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్, మూడు బ్యాలెట్ యూనిట్లు కేటాయించామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో రాజేశ్వరి, చీకటి రాంబాబు (భారాస), గోపాలరావు (కాంగ్రెస్), విద్యాసాగర్ (భాజపా), స్వతంత్ర అభ్యర్థులు చిట్టిమల్లు, జోగ్రామ్, రవిచందర్ చౌహాన్ పాల్గొన్నారు.జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 10,907 మందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
ఇంటి నుంచి ఓటేసిన 1,597 మంది
ఖమ్మం లోక్సభ స్థానంలో హోం ఓటింగ్ పద్ధతిలో రెండు రోజుల్లో 1,597 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
ఖమ్మం గ్రామీణం: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఖమ్మం గ్రామీణ తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను శనివారం పరిశీలించారు. పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్ల రిజిస్ట్రేషన్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి మే 8వరకు పోస్టల్ ఓటేసే అవకాశముందన్నారు. తహసీల్దారు రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన.. పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్దత్ శనివారం పరిశీలించారు. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతోపాటు పాలేరు, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లకి సంబంధించిన ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ఇక్కడే చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఏఆర్ఓ రాజేశ్వరీ, డీఎస్ఓ చందన్కుమార్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, ఖమ్మం గ్రామీణ ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పడేశారా? పడిపోయాయా?
[ 18-06-2024]
అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప తరలింపు వ్యవహారం సోమవారం నాటకీయ పరిణామాల మధ్య సాగింది. తరలించింది, దాన్ని అడ్డుకున్నదీ ఆ శాఖ సిబ్బందే కావటం గమనార్హం. -
ప్రభుత్వ భూమి.. ఆక్రమణపాలు
[ 18-06-2024]
రెండు నెలల నుంచి ఇల్లెందు పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది నాయకులు, అధికారుల అండదండలతో భూములు ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
వరుణుడి అలక... సాగని అరక
[ 18-06-2024]
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. ఇంతవరకు రైతులు ఆశించిన స్థాయి వర్షాలు కురవలేదు. -
భారజలానిదే ఉజ్వల భవిష్యత్తు
[ 18-06-2024]
దేశంలో న్యూక్లియర్, నాన్ న్యూక్లియర్ రంగాల్లో భారజలానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత హెవీవాటర్ బోర్డ్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.సత్యకుమార్ అన్నారు. -
కళ తప్పిన వైరా జలాశయం
[ 18-06-2024]
మధ్యతరహా వైరా జలాశయం వెలవెలబోతుంది. వానాకాలం సీజన్లో మూడో వారం గడుస్తున్నా జలాశయానికి చుక్క నీరు చేరలేదు. -
రేపు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ శిబిరం
[ 18-06-2024]
కొత్తగూడెంలోని కేసీఓఏ క్లబ్లో మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఈ నెల 19న నిర్వహించనున్నారు. -
నమోదులో లోపాలే శాపాలు
[ 18-06-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం అర్హులందరికీ అందటం లేదు. డేటాఎంట్రీ సందర్భంగా ఆపరేటర్లు చేసిన తప్పిదాలు అర్హుల పాలిట శాపంగా మారాయి. -
ఆ రోజు పుస్తకాలొద్దు.. ఉత్సాహం ఉరకలెత్తాలి!
[ 18-06-2024]
ఆటపాటలతో ఆనందంగా సాగాల్సిన పసిడిరెక్కల బాల్యం స్కూల్ బ్యాగ్ల మోతలతోనే అణగారిపోతోంది. పెరిగి పెద్దవారవుతున్న క్రమంలో మెడ, వెన్నునొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వెన్నాడుతున్నాయి. -
ధరణి దరఖాస్తులకు మోక్షం
[ 18-06-2024]
ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్యలతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు, భూయజమానుల కష్టాలు త్వరలోనే తీరిపోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్
-
ఇక్సిగో లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.6,762 లాభం
-
గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకూ వెనుకాడొద్దు: కోదండరాం
-
విరాట్ @ విండీస్.. విజృంభణ పక్కానా?
-
వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ.. శశిథరూర్, స్థానిక నేతల కామెంట్స్ ఇవే..
-
మార్కెట్లోకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్ విశేషాలివీ..