యువత చేతుల్లోనే.. దేశ భవిష్యత్తు
యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని.. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు కోరారు.
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్ కోటేశ్వరరావు, జేసీ రామ్సుందర్రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: యువత చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని.. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు కోరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని యువత ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారం వారికే ఉందన్నారు. మన భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులను ఎన్నుకోవాలన్నారు. జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డి మాట్లాడుతూ ఏడాదిలో నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. డీఆర్వో నాగేశ్వరరావు మాట్లాడుతూ యువత ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. నూతనంగా నమోదు చేసుకున్న యువ ఓటర్ల అభిప్రాయాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో హరిప్రసాద్ అందరి చేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఎనిమిది మంది యువ ఓటర్లు, ఆరుగురు వృద్ధ ఓటర్లు, ఏడుగురు విభిన్న ప్రతిభావంతులను సన్మానించారు. ఓటరు దినోత్సవ కార్యక్రమంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి జ్ఞాపికలు అందించారు. ఉత్తమ సేవలు కనబరిచిన జేసీ రామ్సుందర్రెడ్డి, డీఆర్వో నాగేశ్వరరావు, ఆర్డీవో హరిప్రసాద్, కర్నూలు అర్బన్, కల్లూరు తహసీల్దార్లు విజయశ్రీ, టి.వి.రమేష్బాబును కలెక్టర్ సన్మానించారు. అనంతరం కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసర రెడ్డి, సెట్కూరు సీఈవో పి.వి.రమణ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ విజయ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సర్వే తప్పులు.. రుణానికి తిప్పలు
[ 20-05-2024]
భూసర్వేలో జరిగిన తప్పులు రైతులకు శాపంగా మారాయి.. భూహక్కు పత్రాల్లో తప్పులు.. విస్తీర్ణంలో తేడాలు.. ఉమ్మడి హక్కు పత్రాల కారణంగా పంట రుణాల నవీకరణకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. -
గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
[ 20-05-2024]
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. -
అతిసారం.. కలవరం
[ 20-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. -
గుట్టుగా ఇసుకను తోడేస్తున్నారు
[ 20-05-2024]
తుంగభద్ర నదిలోని రీచ్ల వద్ద ఇసుకను గుట్టుగా తవ్వుతున్నట్లు తేలింది..కౌతాళం మండలం గుడికంబాలి, మరళి రీచ్లను ఆదివారం కలెక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
దాచిన సొమ్ము దోచుకున్నారు
[ 20-05-2024]
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. -
మీటరు గిర్రు.. గుండె గుబిల్లు
[ 20-05-2024]
ఫిబ్రవరి వేడెక్కింది.. మార్చి ‘మాడ’కొట్టింది.. ఏప్రిల్ కుతకుత ఉడికింది.. ఇలా మే మొదటి వారం వరకు ఎండలు దంచికొట్టాయి.. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంది. -
కళలకు వేదిక..ప్రతిభా వీచిక
[ 20-05-2024]
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. -
నిధుల ఆటంకం
[ 20-05-2024]
క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. -
పంట నష్టం.. గణన కష్టం
[ 20-05-2024]
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీలోగా పంట నష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషన్ వెల్లడించింది. -
చెరువులో శవాలు
[ 20-05-2024]
నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు