వానొచ్చేలోపు విత్తనమేద్దాం !
ఎండలు అధికంగానే ఉన్నా.. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భూములను సిద్ధం చేయకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు.
కూలీల కొరత అధిగమించేందుకు రైతన్న తొందరపాటు
తెలకపల్లి : రాకొండ సమీపంలో వట్టి భూములలో పత్తి విత్తనాలు నాటుతున్న దృశ్యం
నాగర్కర్నూల్, న్యూస్టుడే : ఎండలు అధికంగానే ఉన్నా.. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భూములను సిద్ధం చేయకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే కూలీల కొరత, ఎద్దులు అందుబాటులోకి రాక ఇబ్బందులు కలుగుతాయని తొందర పడుతున్నారు. గతేడాది నష్టం వచ్చినా.. ఈ సారి కూడా ఎక్కువగా పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. నాగర్కర్నూల్, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, అచ్చంపేట, అమ్రాబాద్, పదర మండలాల్లో భూములను సిద్ధం చేయకుండానే రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. వర్షాలు సక్రమంగా పడకపోతే సరిగ్గా మొలకెత్తవు. రెండేళ్లుగా ఇలాగే విత్తుకుంటే సకాలంలో మొలకెత్తక రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం నీటి వసతి ఉంటేనే వట్టి భూముల్లో పత్తి విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
చిరుధాన్యాలపై కనిపించని ఆసక్తి..
ప్రభుత్వం ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును పెంచాలని, వాటిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిరు ధాన్యాల సాగు ఏటా జిల్లాలో వందల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. ఆముదం పూర్తిగా కనుమరుగైంది. దానిని పెంచేలా వ్యవసాయ శాఖ ఏ మాత్రం కసరత్తు చేయటం లేదు. రైతులకు అవగాహన కల్పించడం లేదు. జిల్లాలో 141 రైతు వేదికలు నిర్మించారు. ప్రతి చోట ఏఈవోను ఏర్పాటు చేశారు. మట్టి నమూనాల సేకరణ సైతం కనిపించలేదు. అవగాహన సదస్సులు నిర్వహిస్తేనే ప్రయోజనం ఉండనుంది.
అవగాహన కల్పిస్తాం..
రైతు వేదికల్లో రైతులకు తరచుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నీటి వసతి ఉంటే తప్పా వట్టి భూముల్లో పత్తి విత్తనాలను వేసుకోవద్దు. దీనిపై గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు నాటుకుంటే మంచిది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విస్తృతంగా విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ
[ 20-05-2024]
విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. -
పంచాయతీల అభివృద్ధి వివరాలు నమోదు చేయాలి
[ 20-05-2024]
అన్ని గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు, సమగ్ర సమాచారాన్ని పీడీఐ (పంచాయతీ డెవలప్ మెంట్ ఇండెక్స్) లాగిన్లో నమోదు చేయాలని ఎంపీడీవో రమేశ్కుమార్ అన్నారు. -
‘నేతన్నకు చేయూత’ నిధులు అందించాలని వినతి
[ 20-05-2024]
చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిఫ్టుఫండ్ (నేతన్నకు చేయూత) పథకం నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని రాజోలి చేనేత కార్మికులు ఆ శాఖ ఏడీ గోవిందయ్యకు సోమవారం విన్నవించారు. -
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి