హలధారికి దారేది?
సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి భరోసాగా మారాల్సిన 161వ నంబరు జాతీయ రహదారి సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రధాన చౌరస్తాల్లో అండర్పాస్లు లేకపోవడమే కారణం.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
అండర్పాస్లు లేక.. జాతీయ రహదారిపై తీరిది
ఈనాడు, సంగారెడ్డి
సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి భరోసాగా మారాల్సిన 161వ నంబరు జాతీయ రహదారి సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రధాన చౌరస్తాల్లో అండర్పాస్లు లేకపోవడమే కారణం. కంది మండలం మామిడిపల్లి చౌరస్తా నుంచి నిజాంపేట వరకు 66 కిలోమీటర్లకు సంబంధించి ఇటీవల సింగూరు సమీపంలో టోల్ రుసుం వసూలు ఆరంభించారు. తమ బాధలను పట్టించుకోవడం లేదని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్లకుండా కంచె వేస్తున్నారంటున్నారు. అండర్పాస్లు లేకపోవడంతో రోడ్డుకు అవతలి వైపున్న పొలానికి వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తోందంటున్నారు.
కంచె నుంచి దూరి వెళ్లాల్సిందే
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మద్దికుంట నర్సింహులు. చౌటకూరు మండలం చక్రియాల్లో రోడ్డు పక్కనే వీరికి సాగు భూమి ఉంది. నాట్లు వేసేందుకు నారు పోశారు. దూరంగా ఉన్న మరో పొలానికి నారు ఇలా తీసుకెళుతూ కనిపించారు. పొలంలోకి వెళ్లకుండా కంచె వేశారని, కొంత వరకయినా తొలగించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తొలగిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టారన్నారు. అందుకే కష్టమయినా ఇలా వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామానికి దూరంగా.. నిరుపయోగం
మంజీరా నది దాటిన తర్వాత శివ్వంపేట గ్రామం రావడానికి ముందు నిర్మించిన అండర్పాస్ వంతెన ఇది. గ్రామానికి సమీపంలో కడితే ఉపయోగంగా ఉండేదని రైతులు, స్థానికులు చెబుతున్నారు. చక్రియాల నుంచి వచ్చే రైతులు రోడ్డుకు అవతలి వైపున్న పొలానికి వెళ్లాలంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని సింగూరు చౌరస్తా వద్ద ఉన్న టోల్ప్లాజాకు వెళ్లి... తిరిగి అంతే దూరం వెనక్కి రావాల్సి వస్తోంది.
చేనుకు చేరాలంటే..
సింగూరు కూడలి ఇది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తాడ్దాన్పల్లి మీదుగా సింగూరు వైపు వెళుతుంటాయి. పుల్కల్ మండల కేంద్రంతో పాటు చాలా గ్రామాలు ఈ మార్గంలో వస్తాయి. తాడ్దాన్పల్లికి చెందిన రైతుల పొలాలు రోడ్డుకు అవతలివైపే ఎక్కువగా ఉంటాయి. అండర్పాస్ నిర్మించలేదని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు రోడ్డు మీదుగా వచ్చేవారు సంగారెడ్డి వైపు వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని సరాఫ్వెళ్లి వరకు వెళ్లి.. తిరిగి రావాల్సిన పరిస్థితి.
మరికొన్ని చోట్ల ఇలా..
* టోల్ప్లాజా వద్ద టోల్ చెల్లించే వాహనాల కోసం రోడ్డు విశాలంగా ఉన్నా.. టోల్ చెల్లించని ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఇరుకు దారితో సరిపెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది తప్పదు.
* చౌటకూరు మండలం ఉమ్నాపూర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. అండర్పాస్ లేకపోవడంతో ఇటీవల ఇద్దరు విద్యార్థులు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు.
* జోగిపేట ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల(బాలికలు) సమీపంలోని చౌరస్తా వద్దా ఇదే పరిస్థితి నెలకొంది.
సుల్తాన్పూర్ వద్ద నిర్మిస్తాం..
హర్షవర్ధన్, సైట్ ఇంజినీర్, ఎన్హెచ్ఏఐ
సింగూరు చౌరస్తా సమీపంలో సుల్తాన్పూర్ వద్ద మరో అండర్పాస్ నిర్మించనున్నాం. భూ సమస్య వల్ల జాప్యమైంది. మేం సేకరించిన రోడ్డు ఆక్రమణ కావొద్దనే కంచెలు వేస్తున్నాం. అవసరమైన చోట నిబంధనల మేరకు ఖాళీలు వదులుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..