హలధారికి దారేది?
సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి భరోసాగా మారాల్సిన 161వ నంబరు జాతీయ రహదారి సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రధాన చౌరస్తాల్లో అండర్పాస్లు లేకపోవడమే కారణం.
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
అండర్పాస్లు లేక.. జాతీయ రహదారిపై తీరిది
ఈనాడు, సంగారెడ్డి
సురక్షిత, వేగవంతమైన ప్రయాణానికి భరోసాగా మారాల్సిన 161వ నంబరు జాతీయ రహదారి సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ప్రధాన చౌరస్తాల్లో అండర్పాస్లు లేకపోవడమే కారణం. కంది మండలం మామిడిపల్లి చౌరస్తా నుంచి నిజాంపేట వరకు 66 కిలోమీటర్లకు సంబంధించి ఇటీవల సింగూరు సమీపంలో టోల్ రుసుం వసూలు ఆరంభించారు. తమ బాధలను పట్టించుకోవడం లేదని స్థానికులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లోకి వెళ్లకుండా కంచె వేస్తున్నారంటున్నారు. అండర్పాస్లు లేకపోవడంతో రోడ్డుకు అవతలి వైపున్న పొలానికి వెళ్లాలన్నా కిలోమీటర్ల మేర తిరగాల్సి వస్తోందంటున్నారు.
కంచె నుంచి దూరి వెళ్లాల్సిందే
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మద్దికుంట నర్సింహులు. చౌటకూరు మండలం చక్రియాల్లో రోడ్డు పక్కనే వీరికి సాగు భూమి ఉంది. నాట్లు వేసేందుకు నారు పోశారు. దూరంగా ఉన్న మరో పొలానికి నారు ఇలా తీసుకెళుతూ కనిపించారు. పొలంలోకి వెళ్లకుండా కంచె వేశారని, కొంత వరకయినా తొలగించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తొలగిస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపెట్టారన్నారు. అందుకే కష్టమయినా ఇలా వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామానికి దూరంగా.. నిరుపయోగం
మంజీరా నది దాటిన తర్వాత శివ్వంపేట గ్రామం రావడానికి ముందు నిర్మించిన అండర్పాస్ వంతెన ఇది. గ్రామానికి సమీపంలో కడితే ఉపయోగంగా ఉండేదని రైతులు, స్థానికులు చెబుతున్నారు. చక్రియాల నుంచి వచ్చే రైతులు రోడ్డుకు అవతలి వైపున్న పొలానికి వెళ్లాలంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోని సింగూరు చౌరస్తా వద్ద ఉన్న టోల్ప్లాజాకు వెళ్లి... తిరిగి అంతే దూరం వెనక్కి రావాల్సి వస్తోంది.
చేనుకు చేరాలంటే..
సింగూరు కూడలి ఇది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తాడ్దాన్పల్లి మీదుగా సింగూరు వైపు వెళుతుంటాయి. పుల్కల్ మండల కేంద్రంతో పాటు చాలా గ్రామాలు ఈ మార్గంలో వస్తాయి. తాడ్దాన్పల్లికి చెందిన రైతుల పొలాలు రోడ్డుకు అవతలివైపే ఎక్కువగా ఉంటాయి. అండర్పాస్ నిర్మించలేదని రైతులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు రోడ్డు మీదుగా వచ్చేవారు సంగారెడ్డి వైపు వెళ్లాలంటే 4 కిలోమీటర్ల దూరంలోని సరాఫ్వెళ్లి వరకు వెళ్లి.. తిరిగి రావాల్సిన పరిస్థితి.
మరికొన్ని చోట్ల ఇలా..
* టోల్ప్లాజా వద్ద టోల్ చెల్లించే వాహనాల కోసం రోడ్డు విశాలంగా ఉన్నా.. టోల్ చెల్లించని ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఇరుకు దారితో సరిపెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది తప్పదు.
* చౌటకూరు మండలం ఉమ్నాపూర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. అండర్పాస్ లేకపోవడంతో ఇటీవల ఇద్దరు విద్యార్థులు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు.
* జోగిపేట ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల(బాలికలు) సమీపంలోని చౌరస్తా వద్దా ఇదే పరిస్థితి నెలకొంది.
సుల్తాన్పూర్ వద్ద నిర్మిస్తాం..
హర్షవర్ధన్, సైట్ ఇంజినీర్, ఎన్హెచ్ఏఐ
సింగూరు చౌరస్తా సమీపంలో సుల్తాన్పూర్ వద్ద మరో అండర్పాస్ నిర్మించనున్నాం. భూ సమస్య వల్ల జాప్యమైంది. మేం సేకరించిన రోడ్డు ఆక్రమణ కావొద్దనే కంచెలు వేస్తున్నాం. అవసరమైన చోట నిబంధనల మేరకు ఖాళీలు వదులుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హామీలు ఇవ్వక.. పాతవి రద్దు చేస్తున్నారు
[ 08-05-2024]
‘కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాల హయాంలో ఘనపూర్ ఆనకట్ట నాశనమైంది, భారాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.150 కోట్లతో బాగు చేశాం, ఆనకట్ట ఎత్తుపెంచాం. -
లాడ్జిలో భారీగా వస్త్రాలు స్వాధీనం
[ 08-05-2024]
రామాయంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో ఎన్నికల్లో పంపిణీ చేయడానికి సామగ్రి దాచి ఉంచారనే ఫిర్యాదు నేపథ్యంలో మంగళవారం పోలీసులు తనిఖీలు చేశారు. -
ఆరుగాలం పంట.. ఆగమాగం
[ 08-05-2024]
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. మంగళవారం కురిసిన అకాల వర్షానికి ఆరుబయట ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. -
ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు?
[ 08-05-2024]
ఇండియా కూటమిలోని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఆ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షో, కొత్త బస్టాండ్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. -
పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం
[ 08-05-2024]
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మెదక్ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు అన్నారు -
అనుత్తీర్ణులపై ప్రత్యేక శ్రద్ధ
[ 08-05-2024]
ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఆశించిన స్థాయిలో రాలేదు. గత ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు ఎగబాకి ఈ ఏడాది కాస్త మెరుగైన ఫలితాలు వచ్చాయి -
ప్రజాస్వామ్య ఆయువుపట్టు.. ఓటరన్నా నిలబెట్టు
[ 08-05-2024]
ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు.. ఓటు. దాని సద్వినియోగంతోనే మనతో పాటు సమాజానికి మేలు చేకూరుతుంది. ఇదే నినాదంతో పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఓటరు చైతన్యానికి కంకణబద్ధులయ్యారు. -
పోలీసులు, ఎమ్మెల్యే పేర్లతో వసూళ్లు
[ 08-05-2024]
పోలీసులు, ఎమ్మెల్యే పేరు చెప్పి.. సీఎం రేవంత్రెడ్డి తమ్ముడితో సంబంధాలు ఉన్నాయంటూ ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండు చేస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్న నిందితుడిని మంగళవారం మెదక్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
వలస ఓటరు కలిసొచ్చేనా ..
[ 08-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటరూ కీలకమే. ఉపాధికి వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారిని సైతం స్వగ్రామాలకు రప్పించేందుకు నాయకులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కర్షకుల కరుణకు నేతల ఆరాటం
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జిల్లా ఓటర్లలో అత్యధికులది రైతు కుటుంబాల నేపథ్యమే. -
వ్యవసాయాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
[ 08-05-2024]
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బి.వినోద్కుమార్ విమర్శించారు -
‘గౌరవెల్లి’ నీరందించడమే అత్యంత ప్రాధాన్యం
[ 08-05-2024]
గౌరవెల్లి రిజర్వాయరు ద్వారా సాగునీరందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM