పది పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు
జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ తెలిపారు. పట్టణంలోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో శనివారం ఏర్పాట్లను తనిఖీ చేశారు
జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ తెలిపారు. పట్టణంలోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో శనివారం ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 107 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 19,910 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు, సిబ్బంది ఎలక్ట్రానిక్స్ వస్తువులు, చరవాణిలు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు 1,110 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. ప్రశ్న పత్రాలను సమీప పోలీస్ స్టేషన్లకు తరలించి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని వివరించారు. టెలి కాన్ఫరెన్స్లో డీఈవో భిక్షపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరణకు క్షేత్ర స్థాయి బృందాలు
నల్గొండ కలెక్టరేట్: అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న నిరుపేదల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు క్షేత్ర స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 58 జీవో ప్రకారం 125 గజాల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి, పేదలకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించేందుకు మొబైల్ యాప్ను రూపొందించిందని వివరించారు. ఒక లాగిన్ ద్వారా 250 దరఖాస్తులను ఒక బృందం పరిశీలించవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.