సృజనాత్మక చిత్రం.. క్షణాల్లో ఆవిష్కృతం
సృజనాత్మకమైన చిత్రాలు గీయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు ఓ యువ చిత్రకారిణి. కుంచెలను ఉపయోగించకుండా కూరగాయలు, వివిధ రకాల
కాకరకాయ ముక్కలు బ్రష్గా ఉపయోగించి అరుణ వేసిన చిత్రాలు
మఠంపల్లి, న్యూస్టుడే: సృజనాత్మకమైన చిత్రాలు గీయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు ఓ యువ చిత్రకారిణి. కుంచెలను ఉపయోగించకుండా కూరగాయలు, వివిధ రకాల పండ్లు, పూలతో పాటు వంటగదిలో వాడే వస్తువులతో జీవ కళ ఉట్టిపడే రంగుల చిత్రాలు క్షణాల్లో గీసి అబ్బురపరుస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎలాంటి నైపుణ్యం లేకున్నా బొమ్మలను ఆలవోకగా గీసే శిక్షణను యూట్యూబ్ ద్వారా ఉచితంగా ఇస్తూ తన కళాభిమానాన్ని చాటుకుంటున్నారు. బాల్యం నుంచి ఉన్న అభిరుచే ఈ రంగంలో రాణించేందుకు దోహద పడుతోందని చెబుతోన్న మన్నెం అరుణ స్వగ్రామం మఠంపల్లి. ఎమ్మెస్సీ, బీఎడ్ పూర్తి చేసిన ఆమె ఎడ్సెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, ఓయూ పరిధిలో జరిగిన పీజీ సెట్లో 24వ ర్యాంకు సాధించారు. పదో తరగతిలోనూ 503 మార్కులతో ఈ సరస్వతీ పుత్రిక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ‘అరుణంజయ ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి చిత్రకళపై ఆసక్తి ఉన్న వారికోసం ఇప్పటి వరకు 82 వీడియోలు అప్లోడ్ చేశారు. శిక్షణ పొందే వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.
అగ్గిపుల్లలను బ్రష్గా వాడి గీసిన సుందర చిత్రం
కళకు కాదేదీ అనర్హం
మండల కేంద్రానికి చెందిన మన్నెం నారాయణరెడ్డి, కళావతి దంపతుల కూతురు అరుణ చదువుల్లో రాణిస్తూనే చిత్రకళపై అభిరుచి పెంచుకున్నారు. బొమ్మలను గీయడంలో వైవిధ్యాన్ని చూపాలన్న తలంపుతో బ్రష్లను వాడకుండా కాకర, వంకాయ, బెండ, క్యారెట్ తదితర కూరగాయలను భిన్న ఆకృతులలో కోసి వాటితో రంగులు అద్దుతూ వివిధ చిత్రాలకు రూపమిస్తున్నారు. చార్టులపై ప్రకృతి సౌందర్యాన్ని గోడలపై ప్రతిబింబించేలా మయూరం, కొలనులో నడయాడే హంసలు వంటి గోడ చిత్రాలు(వాల్స్టిక్కర్స్) అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే కూరగాయలు, పూలు, గరిటెలు, చెంచాలు, పప్పుగుత్తి తదితర వస్తువులను ఉపయోగించి రంగుల బొమ్మలు వేయడంలో నైపుణ్యాన్ని సాధించి శిక్షకులకు తర్ఫీదు ఇస్తున్నారు.
బీరకాయ పీచుతో రంగులద్దిన చిత్రం
బాపూనే స్ఫూర్తి:
మన్నెం అరుణ చిత్రకారిణి, మఠంపల్లి
ప్రముఖ చిత్రకారుడు బాపు గీసిన బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్పూర్తితోనే చిత్రాలు వేయడం నేర్చుకున్నాను. ఎన్నో చిత్రాలు వేశాను. ఆబాల గోపాలాన్ని అలరించే బొమ్మలు వేయాలన్న పట్టుదల, అందరూ ఆలవోకగా ఈ కళను నేర్చుకోవాలన్న సంకల్పం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టేలా చేశాయి. ప్రస్తుతం టెట్కు సిద్ధమవుతున్నాను. 15 రోజుల తర్వాత మరిన్ని వీడియోలు కళాసాధకుల కోసం అప్లోడ్ చేస్తాను.
బాపు స్ఫూర్తితో అరుణ వేసిన మనసును దోచే చిత్రాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రిలో స్వామి అలంకార వేడుకలు
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీనరసింహస్వామి వారి వార్షిక జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి అలంకార వాహన సేవోత్సవాన్ని నిర్వహించారు. -
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల