నాటకాలు అలరించె.. ఆహుతులను మెప్పించె
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్త నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి.
ముగిసిన జాతీయస్థాయి నాటకపోటీలు
పద్యనాటక పోటీల్లో జాతీయ స్థాయి ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైన కర్నూలు జిల్లా టీజీవీ కళాక్షేత్రం వారి ‘ శ్రీ కృష్ణ కమలపాలిక’ నాటక విజేతలకు బహుమతి అందజేస్తున్నఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం సంయుక్త నిర్వహించిన జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. జాతీయస్థాయి పద్య, సాంఘిక నాటక పోటీల్లో విజేతలకు వేర్వేరుగా బహుమతులను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నాటకాలు సజీవంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. తాను ఇప్పటి వరకు నాటకాలు చూడలేదని, మొదటిసారి వీక్షించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. నాటకాలు, కళల పరిరక్షణకు ఎంతో కృషిచేస్తున్న మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం ప్రతినిధుల్ని అభినందించారు. మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం అధ్యక్షుడు బోయినేపల్లి భుజంగరావు మాట్లాడుతూ.. అందరి సహకారంతోనే మొదటిసారిగా జాతీయస్థాయి నాటకపోటీలను 11 రోజులపాటు నిర్వహించగలిగామన్నారు. చంద్రశేఖర్రావు, పులి కృష్ణమూర్తి, మామిడాల ఉపేందర్, విద్యారత్న, శ్రీనివాసశర్మ, శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణశర్మ, పి.రామావతారం, చిల్లంచర్ల చంద్రశేఖర్, బాపనయ్య, బాబురావు, రాఘవయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి పద్యనాటక పోటీల విజేతలు... ఉత్తమ ప్రదర్శన కనబర్చిన కర్నూలు టీజీవీ కళాక్షేత్రం వారు ‘ శ్రీకృష్ణ కమలపాలిక’ నాటికకు ( రూ.40వేలు నగదు) మొదటి బహుమతి పొందగా, కాకినాడ శ్రీ సీతారామాంజనేయ నాట్యమండలి ‘నర్తనశాల’ కు( రూ.30వేలు నగదు) ద్వితీయ బహుమతి లభించింది. హైదరాబాద్ మురళీకృష్ణ నాట్యమండలి వారి ‘ వసంతరాజీయం’( రూ.20వేలు నగదు) నాటిక తృతీయ బహుమతి సొంతం చేసుకుంది. వరంగల్ స్టార్ బ్రదర్స్ సాంస్కృతిక కళాపరిషత్ వారి ‘ విజయానిరుద్ధం’ నాటకం జ్యూరీ ప్రదర్శనగా ఎంపికయ్యింది. వీటితో పాటు 19 మంది నటీనటులకు వ్యక్తిగతంగా బహుమతులు అందజేశారు. ఉత్తమ సంగీతం, అలంకరణ, ఆహార్యం విభాగాల్లోనూ బహుమతులు అందించారు.
జాతీయస్థాయి సాంఘిక నాటక పోటీల విజేతలు ... జాతీయస్థాయి సాంఘిక నాటక విభాగంలో హైదరాబాద్ కర్టెన్కాల్ థియేటర్ వారి ‘పెట్రోమాక్స్ పంచాయతీ’ ప్రదర్శనకు మొదటి బహుమతి లభించగా ( రూ.20వేలు నగదు), హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ వారి ‘థింక్’ నాటికకు ద్వితీయ బహుమతి(రూ.15వేలు నగదు), కరీంనగర్ చైతన్య కళాభారతి వారి ‘చీకటిపువ్వు’ (రూ.10వేలు నగదు) నాటికకు తృతీయ బహుమతి లభించింది. జ్యూరీ ప్రదర్శనగా కొప్పోలు పండు క్రియేషన్స్ వారి ‘పక్కింటి మొగుడు’ నాటకం ఎంపికయ్యింది. వీటితో పాటు వ్యక్తిగతంగా 19 మంది నటీనటులకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సంగీతం, అలంకరణ, ఆహార్యం విభాగాల్లోనూ బహుమతుల్ని అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!