విజ్ఞాన సంస్కారం.. కీర్తి పురస్కారం
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయకర్త అనుముల శ్రీనివాస్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది.
చిట్యాల గ్రామీణం, న్యూస్టుడే: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన గ్రంథాలయకర్త అనుముల శ్రీనివాస్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ఈనెల 21న నాంపల్లిలోని విశ్వవిద్యాయలంలో ప్రదానం చేయనున్నారు. అనుముల శ్రీనివాస్ చదువుకునే రోజుల్లో గ్రామంలో ఒక దినపత్రిక, మాస పత్రిక వచ్చేది. చదివే వారు ఎక్కువగా ఉండటంతో పత్రికలు దొరకడం కష్టంగా మారేది. గ్రంథాలయం లేని లోటును భవిష్యత్తు తరానికి రానివ్వొద్దని నిశ్చయించుకొని తన తోటి మిత్రులతో కలిసి సమష్టిగా స్వచ్ఛందంగా గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 14 ఏప్రిల్ 2006న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య చేతుల మీదుగా దీనిని ప్రారంభింపజేశారు. దీనిని వినియోగించుకుని సుమారు 30 మంది యువకులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇలా 18 సంవత్సరాలుగా విజ్ఞాన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో ...
గుండ్రాంపల్లిలో గ్రంథాలయ ఏర్పాటు స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో తనకున్న పరిచయాలతో యువకులలో చైతన్యం నింపి గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. పలు గ్రామాల్లో స్థానికుల సహకారంతో గ్రంథాలయాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయ ఏర్పాటే లక్ష్యం
- అనుముల శ్రీనివాస్, గ్రంథాలయ వ్యవస్థాపక ఛైర్మన్, గుండ్రాంపల్లి
కీర్తి పురస్కారానికి గ్రంథాలయకర్తగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నా తోటి స్నేహితులు, విద్యావంతులు, గ్రామస్థుల సహకారంతో మా స్వగ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేశాం. వట్టికోట ఆల్వారుస్వామి కలలుగన్న మిషన్ వట్టికోటతో ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటికే గుండ్రాంపల్లి గ్రంథాలయాన్ని స్ఫూర్తిగా చాలా చోట్ల గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు