ఆ రోజులే వేరు..!
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు మా స్వగ్రామం. చిన్నతనంలో వేసవి సెలవులను బాగా ఆస్వాదించేవాళ్లం.
యాట సత్యనారాయణ, ‘రజాకార్’ చిత్ర దర్శకుడు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు మా స్వగ్రామం. చిన్నతనంలో వేసవి సెలవులను బాగా ఆస్వాదించేవాళ్లం. వార్షిక పరీక్షలు ముగియడంతో అప్పటి వరకు మాపై ఉన్న ఒత్తిడి తొలగిపోయేది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న రెండు వ్యవసాయ బావులు ఉండేవి. తెల్లవారింది మొదలు పిల్లలం అంతా కలిసి బావుల వద్దకు వెళ్లి ఈత కొట్టేవాళ్లం. అదొక్కటే మాకు ఆనందంగా గడిపే వ్యాపకంగా ఉండేది. ఆకలిని కూడా మరిచి ఈతలో మునిగిపోయేవాళ్లం.
- ప్రాథమిక పాఠశాలలో చదువుకునే సమయంలో వేసవి సెలవులకు సంబంధించి నా జీవితంలో బాగా గుర్తుండి పోయే ఘటన ఒకటి జరిగింది. గ్రామశివారులో ఎర్రకుంట ఉండేది. సెలవులు వస్తే కొంతమంది పిల్లలు అందులో ఈతకొట్టేవాళ్లు. నేను ఒక పనిపై అటుగా వెళ్తుంటే ఎర్రకుంటలో ఈత కొడుతున్న నా స్నేహితులు ఒకరిద్దరు నన్నుకూడా కుంటలోకి రమ్మని పిలిచారు. ఈత గురించి కూడా తెలియని నేను ఒడ్డువెంట నీటిలో నడుచుకుంటూ వారి వద్దకు చేరాను. తిరిగి వారు నన్ను ఒడ్డుకు తీసుకొచ్చారు. వారు వెళ్లిపోతున్న సమయంలో ఈత అంటే భళే తమాషాగా ఉందని మరోసారి కుంటనీటిలోకి ఒంటరిగా వెళ్లాను. నీటిలో నడవడానికి కిందపట్టులేక క్రమంగా మునిగిపోవడం ప్రారంభమైంది. నా అరచేతులు మాత్రమే నీటిపైన కనిపిస్తున్నాయి. అప్పటికే కుంటగట్టుదాటుతున్న శ్రీశైలం అనే అబ్బాయి ఇది గమనించి నన్ను లాగే ప్రయత్నం చేశాడు. అతన్ని గట్టిగా పట్టుకుని నీటిపైకి తేలి నేను అరవడంతో శ్రీశైలం సోదరుడు గోపాల్ వచ్చి ఇద్దరినీ బయటకు లాక్కొచ్చాడు.నన్ను నీటి గండం నుంచి బయటపడేయడానికి ప్రయత్నించిన శ్రీశైలం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం నన్ను కలిచివేసింది.
- రాత్రివేళల్లో యక్షగానాలు, ఇతర వీధి నాటకాలు ఆసక్తిగాచూసే వాళ్లం. కొందరు కళాకారులకు అప్పట్లో కూడా బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు చూసిన వీధినాటకాలు, యక్షగానాలు నాలో నింపిన స్ఫూర్తితోనే నేను సినీరంగంలోకి రావడానికి ప్రేరణగా నిలిచాయి. తాటి వనాల్లోకి వెళ్లి ముంజలు తినడం కూడా వేసవిసెలవుల్లో మరిచిపోలేని అనుభూతి.
న్యూస్టుడే, చిట్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
-
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు