భూములిస్తే.. మా సంగతేంటి?
రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ సమస్యగా మారింది.
ప్రత్యేక ఉపకలెక్టరు పద్మావతిని చుట్టుముట్టిన గ్రామస్థులు
కందుకూరు, న్యూస్టుడే: రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఓడరేవును గుడ్లూరు మండలం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం పరిధిలోని 832 ఎకరాల్లో నిర్మిస్తుండగా- ఈ రెండు గ్రామాల్లో భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. పరిశ్రమల కోసం చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 1545 ఎకరాలు సేకరించనున్నట్లు 15 రోజుల కిందట ప్రకటన ఇవ్వగా.. అప్పటి నుంచి సమస్య మొదలైంది. పరిశ్రమలకు సేకరించనున్న భూముల్లో చేవూరులోని మాగాణి ఉంది. ఇక్కడ చిన్న, సన్నకారు రైతులే అధికం. తమకున్న కొద్దిపాటి పొలాన్ని తీసుకుంటే.. జీవనోపాధి ఎలా అనేది వారి ప్రశ్న. దీనికితోడు సుమారు 200 మంది ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు 60 ఏళ్లకుపైగా ప్రభుత్వ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నారు. రావూరులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి భూములకు రిజిస్ట్రేషన్ విలువ సుమారు రూ. 7.20 లక్షలు ఉండగా- పరిహారం కింద రూ. 22 లక్షలు ఇస్తున్నారు. రావూరులో రిజిస్ట్రేషన్ విలువ రూ.2.70 లక్షలు ఉండగా.. ఇక్కడి రైతులకు రూ. పది లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఇదే సమస్యకు ఆజ్యం పోసింది. రెండు గ్రామాల్లో ఒకే రీతిన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. చేవూరు పరిధిలో సుమారు 500 ఎకరాలకుపైగా చుక్కల భూములు ఉన్నాయి. వాటి క్రయ విక్రయాల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాటిని వెంటనే పరిష్కరిస్తే మా బాధలు తీరే అవకాశం ఉందంటున్నారు.
సర్వే అడ్డగింత
గుడ్లూరు, న్యూస్టుడే: రామాయపట్నం ఓడరేవు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన పరిశ్రమలకు భూసేకరణ నిమిత్తం వెళ్లిన అధికారులకు గ్రామస్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో 1545 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రెండు రోజులుగా గ్రామాల్లో భూముల సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామస్థులు సర్వేను అడ్డుకున్నారు. సోమవారం భూసేకరణ ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే సిబ్బంది చేరుకోగా- అక్కడ గ్రామస్థులు భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. పరిశ్రమలకు భూములిస్తే జీవనాధారం కోల్పోతామన్నారు. కూలీలుగా మారి.. పనుల కోసం వలసబాట పట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రావూరు గ్రామస్థులు పంచాయతీ కార్యాలయం ఎదుట పందిరి వేసి.. భూములిచ్చే ప్రసక్తే లేదని.. రైతుల పొట్ట కొట్టొద్దంటూ నినాదాలు చేశారు. మా భూములు తీసుకోవద్దంటూ.. రావూరు గ్రామస్థులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో సర్వే సిబ్బంది చేసేదేమీ లేక వెనుదిరిగారు.
ఆ పరిస్థితే వస్తే...
ఓడరేవు భూసేకరణ సమయంలో అసైన్డ్, ప్రభుత్వ భూములకు.. పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని మొదట్లో ప్రకటించారు. చివరకు కేవలం రూ.2 లక్షలే ఇస్తామనడంతో బాధితులు అడ్డుకున్నారు. అనేక చర్చల అనంతరం ఎకరాకు రూ.5లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే వస్తే.. తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు అంటున్నారు.
ఉన్నతాధికారులకు తెలియజేస్తాం..
లావణ్య, తహసీల్దారు,గుడ్లూరు
రావూరు, చేవూరులో భూసేకరణకు గ్రామస్థులు అడ్డుపడిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. భూసేకరణ సర్వేకు వచ్చిన ప్రత్యేక ఉపకలెక్టరు పద్మావతి ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే ప్రజాస్వామ్యం
[ 20-05-2024]
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని జనరల్ మర్చంట్ వ్యాపారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకట శేషారెడ్డి అన్నారు. -
హ్యాపీసేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
[ 20-05-2024]
కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నెలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’