ఊకదంపుడు ఉపన్యాసం.. వైకాపా శ్రేణుల్లో నిరుత్సాహం
కలెక్టరేట్, విద్య, జడ్పీ, నేరవిభాగం, న్యూస్టుడే: నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో శనివారం నిర్వహించిన జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ చప్పగా సాగింది.
నెల్లూరుకు హామీలు ఇవ్వకనే ముగిసిన జగన్ ప్రచారం
ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే వెనక్కు మళ్లిన ప్రజలు
దుకాణాలు మూసి, బారికేడ్ల ఏర్పాటుతో సామాన్యులకు ఇక్కట్లు
మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డి, అభివాదం చేస్తున్న ఆదాల ప్రభాకర్రెడ్డి, పక్కన ప్రసన్నకుమార్ రెడ్డి
ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్, విద్య, జడ్పీ, నేరవిభాగం, న్యూస్టుడే: నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో శనివారం నిర్వహించిన జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభ చప్పగా సాగింది. సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ పనులు, నెల్లూరు నగరంలో ఆగిపోయిన భూగర్భ డ్రైనేజీ, పెన్నా పొర్లుకట్టల బలోపేతం, రిటైనింగ్ వాల్ నిర్మాణం తదితరాలపై మాట్లాడుతారనుకుంటే.. వాటిని వదిలేసి చంద్రబాబు, పవన్కల్యాణ్, తెదేపా సూపర్-6 పథకాలపై విమర్శలు గుప్పించడంతో.. ప్రజలు అటుంచి, వైకాపా కార్యకర్తలు, అభిమానులే డీలా పడ్డారు. ఇటీవల జరిగిన కందుకూరు సభ కూడా తుస్సు మనడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.
మండుటెండలో మజ్జిగ ప్యాకెట్లకోసం ప్రజల అవస్థలు
మండుటెండలో నరకం
ఓ వైపు సూరీడు భగభగలు.. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభ ప్రజలకు నరకం చూపించింది. మండుటెండలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సభా ప్రాంతంలో కనీసం మంచినీరు కూడా అందించలేదు. ఉదయం 11 గంటల నుంచే పోలీసులు ఆంక్షలు విధించడంతో జన జీవనం స్తంభించింది. ముఖ్యమంత్రి 45 నిమిషాల ప్రసంగం కోసం నగరవాసులకు ఏడు గంటలు నరకం చూపించారు. అసలే గంట ఆలస్యంగా సభ ప్రారంభం కావడం.. దానికి తోడు ఊకదంపుడు ఉపన్యాసంతో జనం జారుకున్నారు. జగన్ ప్రసంగం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే పలువురు ప్రాంగణం నుంచి వెనుదిరిగారు.
నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు..
సీఎం ప్రసంగం వద్ద పలుచగా జనం
బలవంతంగా దుకాణాల మూత
పెట్రోల్ బంకును మూసి.. బారికేడ్ల ఏర్పాటు
వీఆర్సీ క్రీడా మైదానంలో హెలికాప్టర్ దిగిన జగన్ కోసం.. అక్కడి నుంచి గాంధీబొమ్మ సెంటర్లోని సభా ప్రాంగణం వరకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు పెట్టారు. జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30కి రాగా.. ఉదయం నుంచే పోలీసులు దుకాణాలు మూయించి.. బారికేడ్లు అడ్డుగా పెట్టారు. సభా ప్రాంగణానికి రెండు కి.మీ. దూరంలోని ఫత్తేఖాన్పేట రైతు బజారు నుంచే వాహనాలను దారి మళ్లించారు. మరోవైపు బోసుబొమ్మ వద్ద నుంచి వాహనాలను మళ్లించడంతో.. ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్లకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తరలించిన జనం.. తుర్రుమన్నారు
సీఎం ప్రసంగిస్తుండగానే.. వెనుదిరిగిన ప్రజలు
జగన్ కార్యక్రమానికి జనాన్ని తరలించేందుకు వైకాపా నాయకులు అష్టకష్టాలు పడ్డారు. ముఖ్యమంత్రి వచ్చే వరకు సభా ప్రాంగణం వెలవెలబోయింది. వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రాంగణానికి దూరంగా ఉన్న ప్రజల వద్దకు వెళ్లి.. అందరూ రావాలని కోరారు. 54 డివిజన్లకు రూ.54 లక్షలు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. నెల్లూరు గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి రూ.300, మద్యం సీసా ఇచ్చి ఆటోల్లో తీసుకొచ్చినట్లు అక్కడికి వచ్చిన వారే చెప్పడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకే అక్కడకు వచ్చిన జనం.. ఎండలో నిల్చోలేక దుకాణల ముందు సేదతీరారు. అన్ని దుకాణాలు మూసినా.. ట్రంకు రోడ్డులోని మద్యం దుకాణం మాత్రం మూయలేదు. దీంతో సభకు వచ్చిన చాలా మంది.. అక్కడే మద్యం కొనుగోలు చేసి, రోడ్డుపైనే తాగడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీవ్ర అస్వస్థత గురైన మాలేపాటి
[ 18-06-2024]
రాష్ట్ర తెదేపాఉపాధ్యక్షులు, కావలి నియోజకవర్గ తెదేపా నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. -
మామూళ్లు...చర్యలకు సంకెళ్లు!
[ 18-06-2024]
ఏకంగా 114 డాక్యుమెంట్లు.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు. కమిషనర్ సంతకం పెట్టలేదు. అయినా నగరపాలక సంస్థకు తనఖా పెట్టిన ఆస్తులను విడుదల చేశారు. -
పొర్లుకట్ట పనులు ప్రారంభం
[ 18-06-2024]
సంగంలో దువ్వూరు కాలువపై నూతనంగా నిర్మించిన రెగ్యులేటర్ నుంచి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు పొర్లుకట్ట నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. -
శాంతికి చిహ్నం ఇస్లాం
[ 18-06-2024]
జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు సోమవారం బక్రీద్ను ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి.. -
ఇప్పుడేమిటి దారి?
[ 18-06-2024]
జిల్లాలో 2022 అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతినగా- వాటి మరమ్మతులు, కొత్తగా వేసేందుకు నిధులు అందుబాటులో లేవు -
సోమశిల.. సాంకేతిక చిక్కులు తొలగేనా?
[ 18-06-2024]
జలాశయం నుంచి విడుదలయ్యే వరదనీటి వేగానికి అడ్డంకి ఎదురై.. ఏర్పడే ఒత్తిడి శక్తి ఆప్రాన్ కట్టడాలపై పడితే ఏం జరుగుతుందో 2020, 21 వరదలు తేటతెల్లం చేశాయి. -
ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అధ్యక్షుడిగా శోభన్బాబు
[ 18-06-2024]
ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్, పాన్బ్రోకర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నికల్లో.. ఏఎంఆర్ ప్యానల్ విజయం దక్కించుకుంది. దీంతో కొనగళ్ల శోభన్బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
అభివృద్ధి పేరుతో దోపిడీ?
[ 18-06-2024]
జగనన్నకాలనీల పేరుతో గ్రామాలను ఏర్పాటు చేస్తున్నాయని గ్రామ స్థాయి నాయకులకు అక్రమంగా దోచిపెట్టారనే అరోపణలు నానాటికి వినిపిస్తున్నాయి. -
పెంచలకోనలో చినజీయర్ స్వామి పూజలు
[ 18-06-2024]
రాజుపాలెం పరమానంద ఆశ్రమాన్ని రామానుజ చినజీయర్ స్వామితో కలిసి దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. -
సాగుకు సన్నద్ధం.. దిశానిర్దేశం శూన్యం
[ 18-06-2024]
పంటల సీజను సమీపిస్తుంది. తరచూ చినుకులు పడుతున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. వీరికి దిశానిర్దేశం కల్పించడంలో వ్యవసాయ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. -
దాహం తీర్చని శుద్ధ జల కేంద్రం
[ 18-06-2024]
ఓడరేవు కోసం గ్రామాలు కోల్పోయి పునరావాస కాలనీల్లో ఉంటున్న ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. -
రేపటి నుంచి ఐటీఐ కౌన్సెలింగ్
[ 18-06-2024]
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా సిద్ధం చేశామని బుధవారం నుంచి వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్ -
టీవీ రిమోట్ కోసం అన్నాచెల్లెళ్ల గొడవ బాలిక ఆత్మహత్య
[ 18-06-2024]
రిమోట్ విషయమై అన్నాచెల్లెలు గొడవ పడి.. క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
-
అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు
-
అమరావతి, పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం: పల్లా శ్రీనివాసరావు యాదవ్
-
‘అప్పుడు మోదీ దాచిపెట్టారా..?’: వయనాడ్ నుంచి ప్రియాంక పోటీపై భాజపాకు కాంగ్రెస్ కౌంటర్
-
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..