కోతలరాయ.. ఎత్తిపోతల నీరేదయ్యా
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు.
ముఖ్యమంత్రి జగన్కు రైతుల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు. బహిరంగ సభల్లో బాకా ఊదడం మినహా అన్నదాతల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపడం లేదు. జిల్లాలో జీవగెడ్డల నుంచి వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించేందుకు గత ప్రభుత్వాలు జిల్లాలో పదికి పైగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశాయి. కొన్నాళ్లు బాగానే పనిచేసినా నిర్వహణ లేక మూలకు చేరాయి.
న్యూస్టుడే, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం
మాటలు..
రైతు పక్షపాత ప్రభుత్వమని చెప్పేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. సాగునీటి వనరుల నిర్మాణాలు చేపట్టి పుష్కలంగా నీరు అందిస్తున్నాం.
పలు వేదికలపై ముఖ్యమంత్రి జగన్
చేతలు..
మన్యం జిల్లాలో సుమారు 12 వేల ఎకరాల్లోని మెట్ట, బీడు భూములకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వాలు ఎత్తిపోతల పథకాలను నిర్మించాయి. అన్ని చోట్లా ఇవి మూలకు చేరినా వైకాపా అయిదేళ్ల పాలనలో ఎటువంటి మరమ్మతులు లేవు.
కాట్రగడ(బి) వద్ద వేసిన శిలాఫలకం
4800 ఎకరాల ఎదురుచూపు
భామిని, న్యూస్టుడే: వంశధార నుంచి వస్తున్న నీరు వృథాగా సముద్రంలో కలిసిపోకుండా గత ప్రభుత్వ హయాంలో కిమిడి కళావెంకటరావు మంత్రిగా ఉన్న సమయంలో మండలంలోని పాలవలస, వడ్డంగి వద్ద ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించారు.
- వడ్డంగి, నేరడి, నులకజోడు గ్రామాల్లోని 2,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా గజపతిసాగరం వద్ద పథకం ఏర్పాటుకు రూ.33 కోట్లతో శంకుస్థాపన చేశారు.
- కాట్రగడ(బి) సమీపంలో మనుమకొండ, పాలవలస, బొమ్మిక, కాట్రగడ(బి) గ్రామాల్లోని 2,300 ఎకరాలకు నీరిచ్చేలా రూ.18.10 కోట్లతో అంచనాలు తయారు చేసి భూమిపూజ చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుకు కదలలేదు. దీంతో 13 పంచాయతీల ప్రజలు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
అయిదేళ్లలో నిధులేవీ
పైపులైను కుండీ వద్ద మరమ్మతులు చేస్తున్న సిబ్బంది(పాతచిత్రం)
సీతానగరం, న్యూస్టుడే: మండలంలోని గాదెలవలస వద్ద సువర్ణముఖి నది నుంచి రెండు దశల్లో నీరు సరఫరా చేసి 450 ఎకరాలకు అందించేలా 1993లో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. స్టేజ్-1 నుంచి స్టేజ్-2కు నీరు పంపించే కాలువ తవ్వకంతో సరఫరా అరకొరగా ఉండేది. ఈ స్థానంలో పైపులైను ఏర్పాటు చేశారు. కానీ తరచూ మరమ్మతులు, పైపులైను లీకవడంతో గాదెలవలస, బూర్జ, ఆవాలవలస, జె.రాయపురానికి చెందిన 500 మంది చిన్న, సన్నకారు రైతుల సంఘం తరఫున పనులు చేసుకునేవారు. కానీ అయిదేళ్లుగా ఎలాంటి నిధులు మంజూరు కాకపోవడంతో గోగు, వేరుసెనగ పంటలపై ఆధారపడే వారు ఇబ్బందులు పడుతున్నారు.
మూడేళ్లుగా మూలనే
బలిజిపేట: బలిజిపేట మండలంలోని అంపావల్లిలో రూ.1.20 కోట్లతో వీరాంజనేయ ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు 2001లో అప్పటి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు నిధులు మంజూరు చేయించారు. వేగావతి నది నుంచి 518 ఎకరాల ఆయకట్టుకు నీరు మళ్లేలా బావి ఏర్పాటు చేశారు. ఆయకట్టు మొత్తానికి అందకపోవడంతో పైపులైన్లు మార్చాలని నిర్ణయించారు. తెదేపా కాలంలో మంత్రి మృణాళిని వద్దకు రైతులు వెళ్లగా రూ.కోటి మంజూరు చేశారు. రెండేళ్ల పాటు సక్రమంగా సాగునీరు వెళ్లగా తర్వాత నిర్వహణ వదిలేశారు. దీంతో మూడేళ్లుగా మూలకు చేరింది.
అడారు అలంకారప్రాయం
పార్వతీపురం గ్రామీణం, న్యూస్టుడే: పార్వతీపురం, మక్కువ మండలాల్లోని 650 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు మినీ జలాశయం నిర్మించాలని 2006లో భావించారు. వివిధ కారణాలతో పనులు ఆలస్యం కావడంతో తాత్కాలికంగా వంద ఎకరాలకు సాగు నీరు ఇచ్చేలా 2012లో ఎత్తిపోతల పథకం నిర్మించారు. మొదటల్లో దిగువ అడారు, ఎగువ అడారు, గుడారివలస, గదబవలసకు చెందిన రైతులు లబ్ధి పొందేవారు. కొన్నాళ్లకు మోటార్లు పాడయ్యాయి. ఒకటి, రెండు సార్లు బాగు చేసినా తర్వాత పట్టించుకోలేదు. దీంతో మూడేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజల గొంతులో గరళం!
[ 20-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పుర, నగర పాలక, నగర పంచాయతీల ప్రజలకు స్వచ్ఛజలం అందడం లేదు. చాలా చోట్ల రంగుమారి.. మురుగు వాసన, నలకలతో సరఫరా అవుతోంది. తాగునీటి పథకాలను, రిజర్వాయర్లను శుభ్రం చేయకపోవడం, -
ముంచెత్తిన వర్షం
[ 20-05-2024]
పార్వతీపురంలో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఉరుములు, పిడుగులతో ఎడతెరిపి లేకుండా పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. -
కాలువలకు గండ్లు.. రైతులకు కడగండ్లు
[ 20-05-2024]
ఏటా వర్షాభావంతో కరవు దోబూచులాడుతోంది. ప్రకృతిసిద్ధంగా వనరులు అపారంగా ఉన్నా.. సాగుజలం వట్టిమాటే అవుతోంది. ఓ వైపు ఖరీఫ్ ముంచుకొస్తున్నా.. ప్రాజెక్టుల ఆధునికీకరణపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. -
నాలుగేళ్లయినా బాలారిష్టాలే!
[ 20-05-2024]
ఉత్తరాంధ్రకు సంబంధించి గరివిడిలో ఏర్పాటైన పశు వైద్య (వెటర్నరీ సైన్స్) కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా సమస్యలతో మూలుగుతోంది. కళాశాలను ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా.. -
వారధి కిందే అక్రమ తవ్వకాలు
[ 20-05-2024]
ఎన్నికల అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న స్తబ్ధతను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సంతకవిటి మండలం రంగరాయపురం సమీపంలోని నాగావళి నదిపై ఉన్న వంతెన కాంక్రీటు పిల్లర్ల వద్ద యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. -
కేజీబీవీల్లో అక్రమాలు..!
[ 20-05-2024]
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీలు) అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ నిధులు సైతం దుర్వినియోగం అవుతున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. -
ఆయకట్టు ఆయువు తీసేశారు
[ 20-05-2024]
అధికారికంగా 2,200 ఎకరాల ఆయకట్టు.. అనధికారికంగా మరో 500 ఎకరాలు.. వందలాది మంది రైతులకు ప్రధాన నీటి వనరు.. 40కు పైగా చెరువులకు దిక్కైన ఎస్.కోట మండలంలోని చిలకలగెడ్డ ఆనకట్ట పాలకుల తీరుతో నేడు అధ్వాన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
పట్టాలిచ్చినా ప్రయోజనం శూన్యం
[ 20-05-2024]
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గ్రామీణ మండలంలోని కొండకరకం సమీపంలోని ఓ కొండపై జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నాలుగేళ్ల కిందట దాదాపు 2,500 మందికిపైగా లబ్ధిదారులకు పట్టాలిచ్చారు. -
సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
తొలకరికి ముందే వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు విత్తనాలను అందించేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సైతం సమయాత్తమవుతోంది. -
నారాయణపురం ఆనకట్ట వెలవెల
[ 20-05-2024]
సంతకవిటి మండలంలోని నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఇది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు పలు మండలాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టుది కీలక భూమిక.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM