అవగాహనతో సైబర్ నేరాల నియంత్రణ
నిరంతర అధ్యయనం, అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ, సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతాయని అదనపు డీజీపీ(ట్రైనింగ్స్) ఎన్.సంజయ్ అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో
మాట్లాడుతున్న ఎస్పీ మలికా గార్గ్..
చిత్రంలో పీటీసీ ప్రిన్సిపల్ దామోదర్ తదితరులు
ఒంగోలు నేరవిభాగం: నిరంతర అధ్యయనం, అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ, సమగ్ర దర్యాప్తు సాధ్యమవుతాయని అదనపు డీజీపీ(ట్రైనింగ్స్) ఎన్.సంజయ్ అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాల(పీటీసీ)లో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్(సీఆర్సీఐడీఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజుల కార్యశాల ఏర్పాటు చేశారు. తొలుత అదనపు డీజీపీ(ట్రైనింగ్స్) ఎన్.సంజయ్, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ జి.పాలరాజు వీక్షణ ద్వారా అమరావతి నుంచి ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి, మరింత సమర్థ దర్యాప్తు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అధికారులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. దిల్లీకి చెందిన సీఆర్సీఐడీఎఫ్ సంస్థతో ఒప్పందం కుదర్చుకుని ఈ కార్యశాల నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అతిత్వరలో అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఏర్పాటు కానుందని, ప్రతి జిల్లాకు సైబర్ టూల్స్ను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఎస్పీ మలికా గార్గ్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు రోజు రోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలు, ఆధార్ కార్డులు, కొవిడ్ వ్యాక్సిన్ పేరుతో, ఓటీపీ, కేవైసీ, ఆన్లైన్ మోసాలు చోటుచేసుకుంటున్నాయని.. మహిళలపై వేధింపులు పెరిగాయన్నారు. శిక్షణతో సైబర్ నేరాలకు ముకుతాడు వేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని 13 జిల్లాలు, కమిషనరేట్ల నుంచి 115 మంది అధికారులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. పీటీసీ ప్రిన్సిపల్ ఎ.ఆర్.దామోదర్, వైస్ ప్రిన్సిపల్ కె.జె.ఎం.చిరంజీవి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల