మానేయొద్దు.. బడికి రండి
జిల్లాలో అర్ధంతరంగా బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ రప్పించే ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 13,580 బడి మానేయగా ఆదివారం నాటికి 4,747 మంది ఆచూకీ తెలుసుకొని విద్యాశాఖ సిబ్బంది వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
4,747 మందిని తిరిగి చేర్చిన అధికారులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే:
జిల్లాలో అర్ధంతరంగా బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ రప్పించే ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 13,580 బడి మానేయగా ఆదివారం నాటికి 4,747 మంది ఆచూకీ తెలుసుకొని విద్యాశాఖ సిబ్బంది వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. దసరా సెలవుల అనంతరం బడికి వచ్చేలా ఒప్పించారు. అదే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఆయా విద్యార్థుల పేర్లు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి విద్యార్థి వాస్తవ సమాచారం సేకరించాలని ఇటీవల కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు డీఈవో బి.విజయభాస్కర్ మండలస్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు. డ్రాపవుట్ అయిన ప్రతి విద్యార్థి ఎక్కడో ఒకచోట చదవడమే లక్ష్యమని పేర్కొన్నారు.
సచివాలయ సిబ్బంది సాయంతో
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి పదోతరగతి లోపు విద్యార్థులు మొత్తం 3,31,754 మంది ఉన్నారు. వారిలో 28,140 మంది ఈ ఏడాది కొత్తగా బడిలో చేరినవారే. ఇందులో సక్రమంగా బడికి రానందున హెచ్ఎంలు తొలగించిన పేర్లు 3235 ఉన్నాయి. మరో 10,345 మంది ఎక్కడున్నారో గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వాములను చేసేందుకు సోమవారం వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. -
ఆటల్లోనూ జగన్నాటకం
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది.