మానేయొద్దు.. బడికి రండి
జిల్లాలో అర్ధంతరంగా బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ రప్పించే ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 13,580 బడి మానేయగా ఆదివారం నాటికి 4,747 మంది ఆచూకీ తెలుసుకొని విద్యాశాఖ సిబ్బంది వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
4,747 మందిని తిరిగి చేర్చిన అధికారులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే:
జిల్లాలో అర్ధంతరంగా బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ రప్పించే ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 13,580 బడి మానేయగా ఆదివారం నాటికి 4,747 మంది ఆచూకీ తెలుసుకొని విద్యాశాఖ సిబ్బంది వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. దసరా సెలవుల అనంతరం బడికి వచ్చేలా ఒప్పించారు. అదే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ఆయా విద్యార్థుల పేర్లు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి విద్యార్థి వాస్తవ సమాచారం సేకరించాలని ఇటీవల కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు డీఈవో బి.విజయభాస్కర్ మండలస్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు. డ్రాపవుట్ అయిన ప్రతి విద్యార్థి ఎక్కడో ఒకచోట చదవడమే లక్ష్యమని పేర్కొన్నారు.
సచివాలయ సిబ్బంది సాయంతో
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి పదోతరగతి లోపు విద్యార్థులు మొత్తం 3,31,754 మంది ఉన్నారు. వారిలో 28,140 మంది ఈ ఏడాది కొత్తగా బడిలో చేరినవారే. ఇందులో సక్రమంగా బడికి రానందున హెచ్ఎంలు తొలగించిన పేర్లు 3235 ఉన్నాయి. మరో 10,345 మంది ఎక్కడున్నారో గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వాములను చేసేందుకు సోమవారం వారితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరు జీవితాల్లో ఇసుక తుపాను
[ 08-05-2024]
గద్దెనెక్కగానే కొత్త ఇసుక పాలసీ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాకాలూదారు. ఆ వెనుకే జనాలకు గోతులు తవ్వే కుట్రలు పన్నారు. అక్రమాల జాతరకు తెర లేపారు. దేశానికే ఆదర్శమంటూ అనుయాయులకు రీచ్లు అప్పగించారు. -
మునుగుతున్నాం.. కొనేద్దాం!
[ 08-05-2024]
2019 ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చారు. అమలు చేయమని అడిగితే పోలీసులను ఉసిగొల్పి అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపించారు. గత అయిదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి లేదు. మరోసారి జనం నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. మరోపక్క విద్యుత్తు ఛార్జీలతో పాటు, అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగాయి. -
పార్టీ మారారని అక్కసు.. వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
ఎన్నికల వేళ ఓటమి భయం వైకాపా నాయకులను బరితెగించేలా చేస్తోంది. ప్రచారంలో తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. విధానాలు నచ్చక పార్టీ వీడిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. -
చెవి నొగ్గి వినండి అరాచక ముఠా దిగింది!
[ 08-05-2024]
కార్యకర్తలొద్దు.. ప్రైవేట్ సైన్యమే దన్ను...: ఎన్నికల్లో సదరు బదిలీ అభ్యర్థి పూర్తిగా తన ప్రైవేట్ సైన్యం పైనే ఆధారపడ్డారు. తాయిలాల పంపిణీ నుంచి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల్లోని వారికి ఎరవేయడంలో బిజీగా ఉన్నారు. -
పాలబుగ్గలపైనా పాలకుడి పగ
[ 08-05-2024]
ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు..అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు. -
వెలుగొండ పూర్తి.. పథకాలతో ప్రతిఇంటికీ అబ్ధి
[ 08-05-2024]
రాష్ట్రంలో కీలక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు. కోస్తా.. రాయలసీమ సంస్కృతుల సమ్మిళితమైన ఈ ప్రాంతం నుంచి తెదేపా తరఫున బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. ఇటు సేవా కార్యక్రమాలు..అటు పార్టీలకతీతంగా వివాద రహితుడిగా గుర్తింపు పొందడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
ఓటుకు వందనం
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
పోలైన తపాలా ఓట్లు 16,400
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
నగదు బదిలీతో ఓట్ల కొనుగోలు
[ 08-05-2024]
నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన ఉదంతంపై దర్శి పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు