అక్కడికెళ్తే సహనానికి పరీక్షే..!
సంతబొమ్మాళి మండలం భావనపాడుకు చెందిన ఓ మహిళ నాన్జ్యుడీషియల్ స్టాంపు కొనుగోలుకు కార్యాలయానికి శుక్రవారం వస్తే నెట్వర్క్ సమస్యతో స్టాంపు ఇవ్వలేదు. దీంతో రూ.20 విలువైన స్టాంపును బయట మార్కెట్లో రూ.40కు కొనుగోలు చేసినట్లు ఆమె వాపోయారు.
టెక్కలి సబ్రిజిస్ట్రారు కార్యాలయాన్ని వేధిస్తున్న సమస్యలు
వినియోగదారులకు తప్పని అవస్థలు
న్యూస్టుడే, టెక్కలి, టెక్కలి పట్టణం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
సంతబొమ్మాళి మండలం భావనపాడుకు చెందిన ఓ మహిళ నాన్జ్యుడీషియల్ స్టాంపు కొనుగోలుకు కార్యాలయానికి శుక్రవారం వస్తే నెట్వర్క్ సమస్యతో స్టాంపు ఇవ్వలేదు. దీంతో రూ.20 విలువైన స్టాంపును బయట మార్కెట్లో రూ.40కు కొనుగోలు చేసినట్లు ఆమె వాపోయారు.
టెక్కలి సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ప్రింటర్ ఇంక్ అయిపోయిందని ఇటీవల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
...ఇలా ఒక్కటేమిటి సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అక్కడి పనులపై వచ్చేవారికి స్టాంపు నుంచి సర్వరు కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. దీంతో విసిగిపోతున్న కొందరు కోటబొమ్మాళి, పలాస కార్యాలయాలకు వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకుంటున్నారు.
స్టాంపుల కోసం వెళితే..
ఏ లావాదేవీకైనా ప్రాథమికంగా నాన్ జ్యుడీషియల్ స్టాంపులతోనే పని ప్రారంభమవుతుంది. అందులోను కనీస ముఖవిలువ రూ.50, రూ.100లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అయితే టెక్కలిలో స్టాంపుల కొరత నిరంతరం ఉంటోంది. బహిరంగ మార్కెట్లో బ్లాక్ ధరలలో దొరికే స్టాంపులు సబ్రిజిస్ట్రారు కార్యాలయంలో మాత్రం నెలల తరబడి అందుబాటులో ఉండవు. స్టాంపులు అమ్మితే వచ్చే అదనపు ఆదాయమేదీ ఉండకపోవడంతో వాటిపై ద]ృష్టిపెట్టేందుకు సిబ్బంది ఇష్టపడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా అడ్డంకులే..
టెక్కలి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలు వింటే ఎవరైనా విస్తుపోతారు. విద్యుత్తు కోతతో కార్యాలయంలో పనులు నిలిచిపోతాయి. ఏమని అడిగితే తహసీల్దార్ కార్యాలయానికి, తమ కార్యాలయానికి కలిపి ఇన్వర్టర్ ఉన్నందున విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని చెబుతారు. రెండోది సర్వర్ సమస్య. ఇది రోజులో ఏ సమయంలో పని చేస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఒక్కో రిజిస్ట్రేషన్ కోసం రెండు, మూడురోజులు తిరగాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమిస్తే చివరికి ప్రింటర్, స్కానర్లలో ఏదో ఒకటి పనిచేయని సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ప్రింటర్ సమస్యతో వారం రోజులు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చిన్న, చిన్న సమస్యలకు సేవలు నిలిచిపోతుండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పని ముగించుకు వెళ్లిపోదామనుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి..
స్థానికంగా ఉన్న సమస్యలను జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ కొద్ది రోజులుగా రూ.50, రూ.100 స్టాంపుల్లేవు. బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించాం. నెట్వర్క్ సమస్యతో పనుల్లో ఆలస్యం జరుగుతోంది. సమస్యలన్నీ అధిగమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- బాలామణి, ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్, టెక్కలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ