మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది.
కృషి చేస్తే యునెస్కో గుర్తింపు సైతం దక్కే అవకాశం..
అభ్యర్థులపైనా గురుతర బాధ్యత
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, ఈనాడు, మహబూబాబాద్: ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగుతున్నాయి.. మహబూబాబాద్ పరిధిలోని ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లో మేడారం జాతర వస్తుంది. అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధించినా గిరిజన జాతరకు జాతీయ హోదా.. యునెస్కో గుర్తింపు తీసుకురావాలని ఉమ్మడి వరంగల్ వాసులు కోరుతున్నారు.
ఏళ్లుగా ప్రయత్నాలు..
ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించే మహాజాతరకు కోటి మందికి పైగా తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఎంతో ప్రాశస్త్యం, విశిష్ఠత కలిగిన జాతరకు జాతీయ హోదా ప్రయత్నం ఏళ్లుగా సాగుతోంది. 2008 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 2018 నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ.. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళుతోంది. మన ఎంపీలు అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నారు.
ఇంటాంజిబుల్ విభాగంలో .
కాకతీయుల కట్టడమైన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. అశేష భక్తజనం తరలివచ్చే మేడారం జాతరకూ ఇంటాంజిబుల్ విభాగంలో ఈ అరుదైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పద్ధతులు, ఆచారాలు, పండగలు, విశ్వాసాలు, కళలు, నైపుణ్యాలు, ఇతర ప్రత్యేకతలను వారసత్వ సంపదగా గుర్తించి భావితరాలకు అందించేందుకు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చి వీటి పరిరక్షణకు పాటుపడతారు.
అభివృద్ధికి ఆస్కారం..
మేడారం మహాజాతర రాష్ట్ర పండగగా ఉమ్మడి రాష్ట్రంలోనే 1996లో గుర్తించారు. ఉత్తర భారతంలో జరిగే కుంభమేళాకు జాతీయ పండగ హోదా కల్పించడంతో నిర్వహణకు కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఈ హోదా మేడారానికి వస్తే రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించొచ్చు. యునెస్కో గుర్తింపు దక్కితే జాతర వైభవం ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. భావితరాలకు అందుతుంది.
ప్రత్యేక శ్రద్ధ వహిస్తా
-అజ్మీరా సీతారాంనాయక్, భాజపా అభ్యర్థి
గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు రామప్ప వద్ద పలు అభివృద్ధి పనులు చేశాం. ఈసారి సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాను.
కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాను
- మాలోత్ కవతి, భారాస అభ్యర్థి
మేడారానికి జాతీయహోదా దక్కేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాను. రామప్పలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ప్రత్యేక దృష్టి సారిస్తాను.
అది మన హక్కు..
- పోరిక బలరాంనాయక్, కాంగ్రెస్ అభ్యర్థి
మేడారానికి జాతీయ హోదా మన హక్కు.. ఈ విషయాన్ని మ్యానిఫెస్టోలోనూ చేర్చాం. రామప్ప అభివృద్ధికి కూడా చొరవ చూపుతాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షణకవచ్ ప్రశ్నార్థకం!
[ 18-06-2024]
‘‘రెండు రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వెంటనే వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్ వ్యవస్థ’ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది.. సోమవారం ·బెంగాల్లో ఒకే పట్టాల మీదకు రెండు రైళ్లు రావడంతో ఘోరం జరిగింది. -
కదలని చెత్త.. తీరని చింత
[ 18-06-2024]
బల్దియాలో చెత్త చింత తీరడం లేదు. ఇంటింటా సేకరించిన చెత్త, ప్రధాన, అంతర్గత రహదారుల్లో పోగవుతున్న వ్యర్థాలను డంప్ చేయడం అధికారులకు సవాల్గా మారింది. రాంపూర్ డంపింగ్యార్డు వ్యర్థాలతో నిండిపోయింది. -
అధికారులకు చెప్పినా.. ఆగని మట్టి తరలింపు
[ 18-06-2024]
వర్ధన్నపేట శివారులోని అక్కకుంట, ఉప్పరపల్లి గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో ఆదివారం రాత్రి నుంచి ఇటుకల బట్టి వ్యాపారులు వందల సంఖ్యలో టిప్పర్లలో మట్టి తరలించారు. -
అంగన్వాడీ.. గాడిన పడేలా!
[ 18-06-2024]
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు లబ్ధిదారులకు సక్రమంగా చేరడం లేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికే అందించేలా ప్రభుత్వం అంగన్వాడీల ఆధ్వర్యంలో నేషనల్ న్యూట్రీషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) అనే ప్రత్యేక యాప్ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి
[ 18-06-2024]
పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
బడి బస్సులపై నిఘా!
[ 18-06-2024]
జిల్లా ఆర్టీఏ అధికారులు, సిబ్బంది మొత్తం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తీసుకువెళ్లే ప్రైవేట్ బస్సులపై నిఘా పెట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేయడం ప్రారంభించారు. -
విద్యుత్తు సమస్యలపై.. ప్రజా‘వాణి’ విన్నారు!
[ 18-06-2024]
క్షేత్రస్థాయిలో నివాస, వ్యవసాయ, పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్తుపరంగా ఎదురవుతున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ.. వినియోగదారులకు చేరువయ్యేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన విద్యుత్తు ప్రజావాణికి తొలివారమే ఆశించిన స్పందన లభించింది. -
పర్యావరణ పరిరక్షణకు ఎకోక్లబ్
[ 18-06-2024]
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి 24 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. -
సంత.. సౌకర్యాల చింత
[ 18-06-2024]
ఉమ్మడి జిల్లాలోనే పాలకుర్తిలో సోమవారం నిర్వహించే సంతకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మేలైన మేకలు, గొర్రెలతోపాటు పాడి పశువులు, గెదేలు విరివిగా లభిస్తాయని నమ్మకం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోళ్లకు వస్తుంటారు. -
ఆక్రమించి.. చదును చేసి!
[ 18-06-2024]
ఇక్కడ కనిపిస్తున్న భూమి గణపురం మండలం ధర్మరావుపేటలోని ఊరచెరువు శిఖం భూమి. ఇందులో సుమారు 30 ఎకరాలను కొంత మంది చదును చేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. -
వయోపరిమితి పెంపు... పెరగనున్న ప్రయోజనం
[ 18-06-2024]
సింగరేణిలో వయోపరిమితి పెంపుతో వారసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా 300 మందికి పైగా వారసులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. -
గడువు పొడిగించినా.. పనులు పూర్తయ్యేనా.?
[ 18-06-2024]
మహబూబాబాద్లో ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమై రెండేళ్లుపూర్తయి మూడో విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలకు సమయం సమీపిస్తున్నా ఈ భవన నిర్మాణాలు మాత్రం ముందుకు కదలడం లేదు. -
రుణమాఫీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు
[ 18-06-2024]
ఆగస్టులో ప్రభుత్వం రూ.2 లక్షల రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయనుందని...ఆగస్టు నుంచి జనవరి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లు.. భారత్ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు
-
డిప్యూటీ సీఎం పవన్కు అమరావతిలో ఘనస్వాగతం
-
భారత్కు గూగుల్ జెమిని యాప్.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!
-
‘0.001% నిర్లక్ష్యం ఉన్నా’.. నీట్ వివాదంపై ‘సుప్రీం’ సీరియస్
-
ఎన్డీయే నేతలు కొందరు మాతో టచ్లో ఉన్నారు: రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఈనెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు