ఎన్నెన్నో మార్పులు ..చేర్పులు !
కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజపత్రం వెలువడటంతో పశ్చిమలో అనేక నైసర్గిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండనుండగా, ఏలూరు కొత్త జిల్లాగా అవతరిస్తుంది. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లనున్నాయి. భీమవరం
కొత్త జిల్లాల ఏర్పాటుకు రాజపత్రం వెలువడటంతో పశ్చిమలో అనేక నైసర్గిక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండనుండగా, ఏలూరు కొత్త జిల్లాగా అవతరిస్తుంది. గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లనున్నాయి. భీమవరం కొత్తగా రెవెన్యూ డివిజన్ కానుండగా, కుక్కునూరు డివిజన్ జంగారెడ్డిగూడెంలో కలిసిపోనుంది. నూజివీడు రెవెన్యూ డివిజన్ ఏలూరు జిల్లాలో కలవనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో చోటు చేసుకోనున్న అంశాలన్నీ ఆసక్తికరంగానే ఉండనున్నాయి. తాడేపల్లిగూడెం, న్యూస్టుడే:
అంతా ఒకే గొడుగు కిందకు..
జంగారెడ్డిగూడెం, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుతో జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ స్వరూపం మారనుంది. తొమ్మిది మండలాలతో ఏర్పాటయ్యే ఈ డివిజన్ మెట్ట, ఏజెన్సీ మండలాల సమాహారంగా ఉండనుంది. ఇప్పుడున్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలతోపాటు కామవరపుకోట, టి.నరసాపురం మండలాలు, నిర్వాసిత మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కొత్త డివిజన్లో కలవనున్నాయి. తద్వారా సబ్ కలెక్టర్ కార్యాలయం స్థాయికి ఈ డివిజన్ హోదా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలోనే ప్రత్యేకమైన పోలవరం ప్రాజెక్టు ఈ డివిజన్లోనే ఉంది. ప్రాజెక్టుతోపాటు నిర్వాసితులకు ఇక్కడే పునరావాసం కల్పిస్తున్నారు. ఈ కారణంగా ఈ ప్రాంతం ప్రత్యేకంగా నిలుస్తుంది. పోలవరం నియోజకవర్గం పూర్తిగా రెవెన్యూ డివిజన్ పరిధిలోకే రానుంది. గతంలో ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లో నాలుగు మండలాలు జంగారెడ్డిగూడెం, రెండు కుక్కునూరు, ఒక మండలం ఏలూరు డివిజన్లో ఉండేవి. ఈ ఏడింటిని ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు. నాలుగు మండలాలతో ఉన్న చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట మండలాలు మాత్రమే ఈ డివిజన్ పరిధిలో ఉండనున్నాయి. మిగిలిన చింతలపూడి, లింగపాలెం నూజివీడు రెవిన్యూ డివిజన్ (కొత్త ఏలూరు జిల్లా) పరిధిలోనికి వెళ్తున్నాయి. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం గ్రేడ్-2 మున్సిపాల్టీ కీలక పట్టణం కానుంది.
ప్రస్తుతం ఉన్న మండలాలు : 5
కొత్తగా చేరేవి : 4
‘చింతల’పూడి..
చింతలపూడి, న్యూస్టుడే: కొత్త జిల్లాల ఏర్పాటుతో చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాలను కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్లోకి కలపనున్నారు. ఈ రెండు మండలాలకు నూజివీడు 50 కి.మీ పైగా దూరంలో ఉంది. నూజివీడు వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. ఇప్పటివరకు ఏలూరు రెవెన్యూ డివిజన్లో ఈ రెండు మండలాలు ఉండేవి. కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని జిల్లా కార్యాలయాలు అక్కడే ఉండటంతో అన్ని పనులు చక్కబెట్టుకునేవారు. ఈ రెండు మండలాల నుంచి ఏలూరుకు నిత్యం బస్సులు ఉంటాయి. నూతన మార్పు దూరాభారంతో పాటు ఆర్థిక భారం కానుంది.
కీలక పట్టణాలన్నీ ఒకే డివిజన్లోకి..
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలు కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వీటిలో పెనుగొండ, పెనుమంట్రను నరసాపురం డివిజన్లోకి.. తణుకు, అత్తిలి, ఇరగవరంతోపాటు ఇప్పటి వరకు ఏలూరు డివిజన్ పరిధిలో ఉన్న తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు కొత్తగా ఏర్పడబోయే భీమవరం డివిజన్లో కలపనున్నారు. దీంతో ఇప్పటి వరకు పశ్చిమలో కీలకంగా ఉన్న ఆక్వా జోన్ భీమవరం, పారిశ్రామిక పట్టణం తణుకు, వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం ఒకే డివిజన్ పరిధిలోకి రానున్నాయి. పుణ్యక్షేత్రాలైన పెనుగొండ, పాలకొల్లు, గునుపూడి పశ్చిమలోనే ఉంటాయి. కొత్త ప్రతిపాదనతో నరసాపురం రెవెన్యూ డివిజన్లో నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాలు ఉంటాయి. భీమవరం రెవెన్యూ డివిజన్లో భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఉండనున్నాయి.
అన్నీ ఆసక్తికరమే..
●కొల్లేరు ప్రాంతమంతా పూర్తిగా ఏలూరు జిల్లా పరిధిలోనికి వచ్చేయనుంది. ఇంతకుముందు కొంత భాగం కృష్ణా జిల్లాలోనూ ఉండేది. ● ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం భీమవరానికి 17 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఏలూరు జిల్లాలోకి వెళ్లిపోయింది. ● కొయ్యలగూడెం మండల కేంద్రం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లాలంటే దాదాపు 40 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. మార్పు జరిగితే 4 కి.మీ. దూరంలోనే రాజమహేంద్రవరం జిల్లాలోని గోపాలపురం మండలం మొదలవుతోంది. ● పోలవరం నుంచి కొయ్యలగూడెం మండలంలోని కన్నాపురం వచ్చే రహదారిలో దొండపూడి, సాగిపాడు అనే గ్రామాలు తగులుతాయి. ఈ రెండు గ్రామాలు.. రాజమండ్రి జిల్లాలో కలుస్తాయి. ● నూతనంగా ఏర్పడే ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం కీలక పట్టణంగా మారనుంది. మన్యం గ్రామాలకు ముఖద్వారం కావడంతోపాటు, నిర్వాసిత గ్రామాలన్నీ దీని పరిధిలోకే వస్తాయి. ● పోలవరం ప్రాజెక్టుతోపాటు, మధ్య తరహా ప్రాజెక్టులైన ఎర్రకాలువ, కొవ్వాడ, జల్లేలు, జలాశయాలు ఏలూరు జిల్లా పరిధిలోనికి రానున్నాయి.
ద్వారకాతిరుమల తూర్పులోకి..
చాగల్లు, కొవ్వూరు పట్టణం, న్యూస్టుడే: తాజా పరిణామాలతో కొవ్వూరు డివిజన్ పరిధిలోని మండలాల కూర్పులో మార్పులు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, రాజమహేంద్రవరం అర్బన్, గ్రామీణ, అనపర్తి, రాజానగరం ఉన్నాయి. ఈ స్వరూపంలో మార్పు లేనప్పటికీ ఇప్పటి వరకూ కొవ్వూరు డివిజన్లో ఉన్న అత్తిలి, పెనుమంట్ర, ఇరగవరం, పెనుగొండ, తణుకు మండలాలు నరసాపురం జిల్లాలో కలిసిపోనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కానున్న రాజమహేంద్రవరానికి కొవ్వూరు 8 కి.మీ.దూరంలో అతి చేరువలో ఉండగా ద్వారకాతిరుమల నుంచి జిల్లా కేంద్రానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు