ఉన్నది ఇద్దరే తనిఖీ మొక్కుబడే
ఏలూరు, భీమవరం, తణుకు, నరసాపురం తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పాలకొల్లు.. వంటి ఒక్కో పట్టణంలో రెండొందల నుంచి అయిదొందల వరకు ఆహార విక్రయ కేంద్రాలు(హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు) ఉన్నాయి. ఇతర చెప్పుకోదగ్గ ఒక్కో పట్టణంలోనూ
ఆహార విక్రయాలపై కొరవడిన నిఘా
ఈనాడు డిజిటల్, ఏలూరు, తాడేపల్లిగూడెం, న్యూస్టుడే
ఏలూరు, భీమవరం, తణుకు, నరసాపురం తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పాలకొల్లు.. వంటి ఒక్కో పట్టణంలో రెండొందల నుంచి అయిదొందల వరకు ఆహార విక్రయ కేంద్రాలు(హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు) ఉన్నాయి. ఇతర చెప్పుకోదగ్గ ఒక్కో పట్టణంలోనూ వంద నుంచి 200 వరకు ఇవి కనిపిస్తాయి. కొన్ని గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఆహార భద్రత అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నవి పదిశాతానికి మించదు. పొందిన కేంద్రాల్లోనూ రెన్యువల్ చేయించుకున్నవి సగానికి సగమే ఉంటాయి. పెద్ద హోటళ్లకు కూడా దీనిపై శ్రద్ధ లేదంటే ఆహార భద్రత.. జిల్లాలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
* ఏలూరు సత్రంపాడు సెంటర్లో కొన్ని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు సాయంత్రం అయిదు గంటల నుంచి పదకొండు గంటల వరకు నిరాటంకంగా నడుస్తాయి. వందల మంది భోజనం చేస్తారు. మురుగు కాలువల పక్కన, నోరు తెరుచుకున్న బోదెల పైనా ఏర్పాటు చేసిన ఆ ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద పరిశుభ్రత, నాణ్యత.. కనుచూపు మేరలో కనిపించవు.
* ఏలూరు బస్టాండు సెంటర్లో మూడు ఆహార విక్రయ వ్యాన్లు రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టి ఉంటాయి. విక్రయాలు సైతం జోరుగా సాగుతుంటాయి. విక్రయానికి ఎలాంటి అనుమతులూ లేవు.
* తాడేపల్లిగూడెంలో పెద్దభోజన హోటళ్లు 18, చిన్నవి 22 ఉన్నాయి. ఇవి కాకుండా 19 కర్రీపాయింట్లు, దాబాహోటళ్లు 12ఉన్నాయి. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఇతర ఫుడ్ అవుట్లెట్లు.. అన్నీ కలిపి కలిపి దాదాపు 200కు పైగా ఉంటాయి. వీటిలో లైసెన్సు పొందినవి పదహారే. గత తొమ్మిది నెలలుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలు లేవు. కనీసం పర్యవేక్షణ చేసిన దాఖలాలు కూడా లేవు.
2021-22 సంవత్సరానికి ఫుడ్ లైసెన్సుల సంఖ్య సుమారు 2,000
వసూలు చేసిన అపరాధ రుసుము సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు
ఇదీ పరిస్థితి
* ఉమ్మడి జిల్లాలో మొత్తం 45 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ల అవసరముంది. ఉన్నది జిల్లాకొక్కరు చొప్పున ఇద్దరే. వీరితో తనిఖీలు నామమాత్రమే.
* ఏలూరు, భీమవరం వంటి ఒక్కో పట్టణంలోనే హోటళ్లు, ఫాస్ట్ఫుడ్, టిఫిన్, బిర్యానీ సెంటర్లు.. ఇతర అన్ని రకాల ఆహార పదార్థాలను విక్రయించే ఫుడ్ అవుట్లెట్లు.. కలిపి రెండు వేలకు పైగా ఉంటాయి. అంటే మిగతా చోట్ల ఉన్నవన్నీ అనధికారిక ఆహార విక్రయ కేంద్రాలే.
* ఎవరైనా అనుమతులు లేకుండా ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని తెలిస్తే తొలుత నోటీసులిస్తారు. ఆ తరువాత సైతం అలాగే కొనసాగిస్తే రూ.అయిదు లక్షలు జరిమానాతోపాటు సదరు వ్యక్తులకు ఆరు నెలలు జైలు శిక్ష వేసే అవకాశముంది. కానీ 2021-22 సంవత్సరానికి నమోదు చేసిన కేసులు 25 మాత్రమే. దీంతో ఆహార భద్రత విభాగం పనితీరును అంచనా వేయొచ్చు.
* చాలా ఆహార విక్రయ కేంద్రాలకు లైసెన్సులు లేవు. వీధి విక్రయ కేంద్రాల్లోనే కాదు. చాలా హోటళ్లలో ఎలాంటి నిబంధనలూ పాటించట్లేదు. ఆయా మార్గదర్శకాలను పాటిస్తున్నామని పేర్కొంటూ దరఖాస్తు చేసుకుంటే అధికారులు తనిఖీ చేసి లైసెన్సు మంజూరు చేస్తారు. కానీ ఉభయ జిల్లాల్లో అసలు లైసెన్సుతో పనిలేకుండా.. వేల కొద్దీ ఆహార విక్రయ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిని పట్టించుకునే నాథుడు లేరు.
* చాలా హోటళ్లలో అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. జాతీయరహదారి పక్కనే డ్రమ్ముకు పొయ్యిలు ఏర్పాటు చేసి వాటితోనే వండుతూ ఉంటారు. పక్కనే మురుగు పారుతుంటుంది. మరోవైపు ఆయా పదార్థాలను దుమ్ముధూళి మధ్యే బహిరంగంగా వండుతూ ఉంటారు. ప్టాస్టిక్ కవర్లలో వేడి వేడి కూరలు వేసి ఇస్తుంటారు.
* ఉన్న సిబ్బందితోనే చేస్తున్నాం.. ‘ఉమ్మడి జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న అధికారులతోనే సాధ్యమైనంత మేర తనిఖీలు చేస్తున్నాం. ఫుడ్లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు అంతా కలిపి 7 వేలకు పైగా ఇచ్చాం. ఆహార పదార్థాలు విక్రయించేవారు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’