హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!
‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు.
గురువులపై జగన్ సర్కారు నిరంకుశత్వం
కేసులు, అరెస్టులతో జులుం
యాప్ల పేరుతో నిత్యం వేధింపులు
భీమవరం పట్టణం, ఏలూరు అర్బన్, న్యూస్టుడే: ‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా..? అని ప్రశ్నిస్తూ ఉద్యమించిన ఉపాధ్యాయులపై కక్షగట్టిన వైకాపా సర్కారు వారిపై ఉక్కుపాదం మోపింది. పలు సందర్భాల్లో గృహనిర్బంధం చేసి పోలీసులను కాపలా ఉంచింది. ఉద్యమాలకు పిలుపునిచ్చిన ప్రతిసారీ గృహనిర్బంధాలు, అరెస్టులతో భయాందోళనలకు గురిచేసింది. గతంలో ఎన్నడూ చూడని స్థాయి నిరంకుశత్వంతో గురువులు విలవిల్లాడారు.
జగన్ సర్కారు విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పైకి చెబుతూనే తెర వెనుక ఉపాధ్యాయులను ఇరుకున పెట్టే చర్యలకు దిగింది. ఇబ్బడి ముబ్బడిగా బోధనేతర పనులు అప్పగిస్తూ చెలగాటమాడింది. ముఖ ఆధారిత హాజరు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన, మూల్యాంకనం, అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, చిక్కీలు.. ఇలా అనేక పేర్లతో యాప్లు తీసుకొచ్చారు. అప్లోడ్ సమయంలో సర్వర్ మొరాయించినా ఉపాధ్యాయులే బాధ్యులు. ఇలా 67 మందికి తాఖీదులిచ్చారు.
అన్ని విధాలా ఒత్తిళ్లు
బడుల్లో మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా ప్రధానోపాధ్యాయులదే బాధ్యత అంటూ తాఖీదులు ఇచ్చారు. శుభ్రంగా ఉన్నాయో లేదో రోజూ ఫొటోలు తీసి నిర్దేశిత యాప్లో అప్లోడ్ చేయాలి. నాడు-నేడు పనుల పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇసుక, కంకర, సిమెంటు ఆయా పాఠశాలలకు అర్ధరాత్రి వచ్చేవి. వాటిని దిగుమతి చేసుకునేందుకు ఉపాధ్యాయులు దగ్గర ఉండాలి. నిర్మాణం అనేది ఇంజినీరింగ్ అధికారులపై ఆధారపడి ఉంటుంది. కానీ నాణ్యత లోపిస్తే దానికి కూడా ఉపాధ్యాయులే బాధ్యులన్నారు. ఇలాంటి కారణాలతో 200 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులిచ్చారు. ఈ పనుల పర్యవేక్షణ కూడా తల్లిదండ్రుల కమిటీల పేరుతో స్థానిక వైకాపా నాయకులకే పెత్తనం అప్పగించారు. భీమవరం ప్రాంతంలో నిర్మాణ సామగ్రి తప్పించేందుకు యత్నించిన ఓ పాఠశాల కమిటీని ప్రశ్నించినందుకు పంచాయితీ చేసి సంబంధిత ఉపాధ్యాయుడ్ని బదిలీ చేయించారు. మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తానన్న జగన్ ఆ దుకాణాల వద్ద గురువులను కాపలా ఉంచారు. కరోనా సమయంలో ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర కాపలాను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
నిరసన ప్రదర్శనలో ఉపాధ్యాయులు (పాత చిత్రం)
65 మందిపై కేసులు.. వేర్వేరు సందర్భాల్లో 65 మందిపై కేసులు బనాయించారు. 2023 ఏప్రిల్లో పాలకోడేరు మండలం మోగల్లు నుంచి ప్రదర్శనగా విజయవాడ బయలుదేరిన ఉపాధ్యాయ సంఘ నాయకులను అరెస్టు చేశారు. వారి కళ్లుగప్పి విజయవాడ చేరుకున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అవమానించటం, అగౌరవపరచిన పరిస్థితులను ఇప్పటికీ ఉపాధ్యాయలోకం మరిచిపోలేకపోతోంది. పాఠశాలల్లో కనీస వసతులు ఉండవు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయలేదు. బోధన సామగ్రి ఇవ్వరు. పుస్తకాల పంపిణీ సక్రమంగా ఉండదు. అనేక యాప్లు తీసుకొచ్చి, బోధన మినహా అన్ని పనులు చేయించారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
పోలీస్ స్టేషన్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడి నిర్బంధం (పాత చిత్రం)
భారం మోపి.. వేధించి
- జీవో 117 పేరుతో పాఠశాల విద్యను విభజించి వేలాది ఉపాధ్యాయ కొలువులను రద్దుచేశారు. జిల్లాలో ఇలా 2500 వరకు పోస్టులు రద్దయ్యాయి. జీవో ప్రకారం 3, 4, 5 తరగతులను సమీప ఉన్నతపాఠశాలలో విలీనం చేశారు. టీచర్లపై రెట్టింపు స్థాయి భారం మోపింది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
- పిల్లలకు పాఠాలు చెప్పడం కంటే వర్కుబుక్ రాయించడానికే సమయం సరిపోయేది. వీటిని సకాలంలో రాయించలేదంటూ యలమంచిలి, పాలకొల్లు మండలాల్లో అయిదుగురు ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు రద్దు చేశారు.
- కరోనా సమయంలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాలనే ఒత్తిడితో బయటకు వెళ్లిన పాలకోడేరు మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కొవిడ్తో మృతి చెందారు. ఇలాంటి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టలేదు.
ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు 3,300
ఉపాధ్యాయుల సంఖ్య 14,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దండుకోవడమే పనిగా..
[ 12-06-2024]
ఏలూరు నగరపాలికలో కొందరు వైకాపా కార్పొరేటర్ల దోపిడీ పరాకాష్ఠకు చేరింది. ప్రభుత్వం మనది..ఏం చేసినా అడిగేదెవరు అన్నట్లు గత అయిదేళ్లు దందాలు చేస్తూ దోచుకున్నారు. పట్టణ ప్రణాళిక విభాగాన్ని అడ్డు పెట్టుకుని దాదాగిరి చేశారు. -
నిమ్మల, కొలుసులకు మంత్రివర్గంలో చోటు
[ 12-06-2024]
కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా పాలకొల్లు, నూజివీడు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథిలకు చోటు దక్కింది. -
కొలువుదీరిన కాంతులు
[ 12-06-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, మంత్రులుగా మరికొందరు బుధవారం కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
మనోళ్లు అదరగొట్టారు
[ 12-06-2024]
గురి అంతా లక్ష్యం వైపే. ఆ మార్గంలో ఎన్ని సవాళ్లున్నా.. తమ సాధన ముందు చిన్నబోవాల్సిందే. ఒక్కో మెట్టు ఎక్కుతూ భవితను తీర్చిదిద్దుకునేలా ముందుకు సాగుతున్నారు. -
బండిపోతే అంతేనండి!
[ 12-06-2024]
ఉమ్మడి జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలు ఎక్కువగా ఉండగా... ఆ మేరకు రికవరీలు జరగటంలేదు. -
ఇక ఏఎంసీల వంతు!
[ 12-06-2024]
వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల సభుల రాజీనామాపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. రాజీనామా చేయాల్సిందిగా ఇప్పటికే పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇచ్చారు. -
పెదకొమ్ములేరుపై కూలిన వంతెన
[ 12-06-2024]
తాడినాడ- పోతుమర్రు గ్రామాల సరిహద్దులో పెదకొమ్ములేరు కాలువపై ఉన్న వంతెన కుప్పకూలింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ వారధిపై 10 టైర్ల భారీ లోడు వాహనం వెళ్తుండగా పెద్ద శబ్దంతో వంతెన మధ్య భాగం విరిగి కాలువలో పడిపోయింది. -
ఇంట్లో కోడె నాగుల హల్చల్
[ 12-06-2024]
పట్టణంలోని ఓ ఇంట్లో రెండు పాములు హల్చల్ చేయడంతో ఆ కుటుంబ సభ్యులు భయంతో హడలిపోయారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ఇద్దరి మృతి
[ 12-06-2024]
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు నూజివీడు రూరల్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి తెలిపారు. -
సాంకేతిక పథం.. విజ్ఞాన రథం
[ 12-06-2024]
దేశంలోనే తొలి సంచార సాంకేతిక విజ్ఞాన ల్యాబ్ (ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్) ప్రాజెక్టును పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన క్రొవ్విడి మధులాష్బాబు రూపొందించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. -
ఆచంట రైతుకు పురస్కారం
[ 12-06-2024]
ఆచంటకు చెందిన ఆదర్శ రైతు నెక్కంటి సుబ్బారావుకు దిల్లీలో అరుదైన గౌరవం దక్కింది. దిల్లీ ఐఏఆర్ఐ(ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) సంస్థ నుంచి పురస్కారం అందుకుని మంగళవారం ఆయన ఆచంటకు వచ్చారు. -
బియ్యపు గింజపై చంద్రబాబు చిత్రం
[ 12-06-2024]
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలూరులోని శనివారపుపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు దొరా శివప్రసాద్ బియ్యపు గింజపై ఆయన చిత్రాన్ని చెక్కారు. -
చెక్కపై రామాయణ వృత్తాంతం
[ 12-06-2024]
చింతలపూడికి చెందిన ప్రముఖ శిల్పకారుడు మందుగుల కనకలింగ వీరబ్రహ్మం 30 రోజుల పాటు కష్టపడి చెక్కపై ‘శ్రీమద్ రామాయణ వృత్తాంతం’ అందంగా తీర్చిదిద్దారు. -
రూ. 12 లక్షలతో ఉడాయింపు
[ 12-06-2024]
భీమవరం రెండో పట్టణంలో ఉన్న చిట్ఫండ్ సంస్థ ఉద్యోగి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ.12 లక్షలతో ఉడాయించినట్లు సమాచారం. -
అమరావతి అభివృద్ధికి రూ.25 లక్షల విరాళం ఇస్తా
[ 12-06-2024]
అమరావతి అభివృద్ధికి ఎకరం పొలం విరాళంగా అందిస్తానని గతంలో తాను ఇచ్చిన హామీ ప్రకారం, ఆ భూమి అమ్మిన మొత్తం రూ.25 లక్షలను విరాళంగా ఇవ్వనున్నట్లు అమరావతి మాజీ బ్రాండ్ అంబాసిడర్, ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి మంగళవారం వీడియో సందేశం ద్వారా తెలిపారు.