పుంగనూరు, తంబళ్లపల్లెలో మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు
వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు.
భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి
మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పక్కన నాయకులు
ఈనాడు, కడప, న్యూస్టుడే, ములకలచెరువు గ్రామీణ: వైకాపా ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరాచకాలకు, వనరుల దోపిడీలకు పాల్పడిందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శనివారం నిర్వహించిన ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలైన తెదేపా, భాజపా, జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో మరింత దోపీడీ సాగిందని, అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీకే పాలు పోయాలని, పోయకుంటే కేసులు పెడతామని రైతుల్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు. మామిడి కిలో ధర రూ.20 ఉండగా రూ.8కి అమ్ముకోవాల్సి వస్తోందంటూ ఇలా.. పాడి, మామిడి రైతుల ద్వారా ఏటా రూ.132 కోట్ల మేర దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు పెద్ద ప్రాజెక్టుల పనులు రూ.2,145 కోట్లతో చేపట్టి రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల ద్వారా రూ.2 వేల కోట్ల దోపిడీకి పెద్దిరెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి నియోజకవర్గంలో ప్రజల్ని బెదిరించి పేదల భూములు కబ్జా చేశారని, వీటన్నింటినీ తిరిగి పేదలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మంజూరు చేసిన నిధుల్ని.. వైకాపా ప్రభుత్వంలో పెద్దిరెడ్డి పుంగనూరుకు మళ్లించుకుపోయి పనుల పేరిట దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, తెదేపా అసెంబ్లీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి మద్దతు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండల కేంద్రంలో చోరీ
[ 16-06-2024]
మండల కేంద్రంలోని జి. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
అక్రమాలపై ‘రామ’బాణం సంధించాలి!
[ 16-06-2024]
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలో చేపట్టిన కాలేటివాగు ప్రాజెక్టుతోపాటు కురబలకోట మండలం ముదివేడు జలాశయం నిర్మాణపనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉంది. -
కడపలో నటి నిధి అగర్వాల్ సందడి
[ 16-06-2024]
కడప నగరంలో శనివారం సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన జోస్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల షోరూంను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవితో కలిసి ప్రారంభించారు. -
సరఫరా... అరకొర!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న బడి గంట మోగింది. అదే రోజు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. -
కబ్జాలపై ఉక్కుపాదం మోపండి!
[ 16-06-2024]
వైకాపా విధ్వంసకర పాలనకు చరమగీతం పాడిన తెదేపా, జనసేన, భాజపా కూటమిపై జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకించి జగన్ సర్కారు బాధితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది వైకాపా నేతలు ఊరూవాడ భూములను కాజేశారు. -
ఇసుక తరలింపుపై వైకాపా నాయకుల గొడవ... దాడికి యత్నం
[ 16-06-2024]
ఇసుక తరలింపుపై ప్రొద్దుటూరులో వైకాపా ముఖ్య నేతల అనుచరులు పెన్నా నదిలో దాడులకు పాల్పడుతున్నారు. తమ ఏరియాలో తాము మాత్రమే ఇసుకను తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. -
మంత్రి మండిపల్లి రాకతో పులకించిన రాయచోటి
[ 16-06-2024]
రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం రాయచోటికి వచ్చారు. -
పీలేరు... అక్రమాల జోరు!
[ 16-06-2024]
నియోజకవర్గ కేంద్రం పీలేరు విద్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే పంచాయతీకి ఆదాయం సమకూరుతోంది. అధికారం తమదేనని, అడిగేవారు లేరని గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పవన్ కల్యాణ్కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్.. అదేంటంటే?
-
దర్శన్, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్ ఏమన్నారంటే..
-
ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్