శాసనసభ్యుల కోట.. చిన్నచింతకుంట
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం చిన్నదే అయినా విశేషాలు పుట్టెడున్నాయి. ఉభయరాష్ట్రాల్లో పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రం ఇక్కడే కొలువై ఉంది.
కొత్తకోట, చిన్నచింతకుంట, న్యూస్టుడే : మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం చిన్నదే అయినా విశేషాలు పుట్టెడున్నాయి. ఉభయరాష్ట్రాల్లో పేరుగాంచిన కురుమూర్తి క్షేత్రం ఇక్కడే కొలువై ఉంది. పలువురు శాసనసభ్యుల పుట్టినిల్లుగా ఈ మండలం గుర్తింపు పొందింది. 1957లో అమరచింత నియోజకవర్గం ఏర్పడగా.. అమరచింత, చిన్నచింతకుంట, ఆత్మకూరు, దేవరకద్ర, ధన్వాడతో పాటు మక్తల్ మండలంలోని కొన్ని గ్రామాలు వచ్చేవి. ఇలా అమరచింత నియోజకవర్గంలో ఉన్న చిన్నచింతకుంట వాసులు ఇప్పటి వరకు ఐదుగురు పలుమార్లు ప్రజాభిమానం పొంది శాసనసభలోకి అడుగుపెట్టారు. శాసనసభ స్థానాల పునర్విభజనలో అమరచింత నియోజకవర్గం పేరు కనుమరుగై దేవరక్రద నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. పలు కొత్త మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి చేరినా తొలి ఎమ్మెల్యేగా అవకాశం చిన్నచింతకుంట వాసులకే దక్కింది.
తొలి ఎమ్మెల్యే సోంభూపాల్
అమరచింత సంస్థానాధీశులైన సోంభూపాల్ అమ్మాపూర్ దొర. 1962లో అమరచింత నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసి గెలుపొంది శాసనసభలోకి అడుగుపెట్టారు. 1967లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి దేవమ్మపై విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్లో చేరి ఎన్నికల బరిలో దిగారు. ఎవరూ నామినేషన్ వేయక పోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సాధించారు.
స్వర్ణ సుధాకర్
నవలా రచయిత్రి స్వర్ణసుధాకర్ మోటారు బీడీ పరిశ్రమ యజమాని సుధాకర్రెడ్డి సతీమణి. 2004లో ఆమెకు కాంగ్రెస్ టికెట్ వరించింది. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి దయాకర్రెడ్డిని ఆమె ఓడించారు. ఇదే సమయంలో దయాకర్రెడ్డి సతీమణి సీత దేవరక్రద జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ పదవిని తెదేపా తరఫున దక్కించుకున్నారు.
ఇస్మాయిల్ సేట్
బీడీ పరిశ్రమలకు, కార్మికులకు నిలయమైన చిన్నచింతకుంటలో వస్తాద్ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకులు ఇస్మాయిల్ సేట్కు 1983లో అమరచింత నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున బరిలో దిగి విజయం సాధించారు.
సీతాదయాకర్ రెడ్డి
కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గంలో చిన్నచింతకుంట మండలం చేరగా దయాకర్రెడ్డి సతీమణిగా జడ్పీ ఛైర్పర్సన్గా పరిచయమైన సీతకు 2009లో తెదేపా అభ్యర్థిత్వం దక్కింది. ఈ ఎన్నికల్లో తెదేపా, తెరాస పొత్తుండగా.. కాంగ్రెస్ నుంచి స్వర్ణ సుధాకర్ బరిలో దిగారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి దక్కక పోవడంతో రావుల రవీంద్రనాథ్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 20 వేల మెజారిటీతో సీతాదయాకర్రెడ్డి విజయం సాధించారు.
దయాకర్ రెడ్డి
పర్కాపురం గ్రామంలో ఇల్లు, ఆస్తులు ఉన్న కొత్తకోట దయాకర్ రెడ్డి హైదరాబాద్లో ఉండేవారు. 1989లో అమరచింత తెదేపా టికెట్ ఆయనకు వరించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్పై విజయం సాధించారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దయ్యింది. ఇందులోని మండలాలు అటు మక్తల్, ఇటు దేవరకద్ర నియోజకవర్గాల్లో కలిసి పోగా చిన్నచింతకుంట మండలం కొత్తగా ఏర్పాటైన దేవరకద్రలో చేరింది. 2009లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, తెరాస పొత్తులో భాగంగా మక్తల్ నియోజకవర్గం తెరాసకు కేటాయించారు. దయాకర్రెడ్డి అప్పటికే స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా చివరి క్షణంలో నాటకీయ పరిణామాల మధ్య బీ ఫాం దక్కించుకుని ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు.
ఒకే మండలం.. నలుగురు ఎమ్మెల్యేలు
వనపర్తి వ్యవసాయం, న్యూస్టుడే : ఉమ్మడి గోపాల్పేట మండలం నుంచి నలుగురు ఎమ్మెల్యేలయ్యారు. ఇందులో ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా పనిచేయగా.. మరొకరు ప్రభుత్వ విప్గా ఉన్నారు.
నాగం జనార్దన్రెడ్డి: నాగపూరు గ్రామానికి చెందిన నాగం జనార్దన్రెడ్డి 1985లో తెదేపా తరఫున మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2004, 2009లో తెదేపా తరఫున విజయం సాధించారు. 2012లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. తెదేపా పాలనలో పలు శాఖల మంత్రిగా పనిచేశారు.
డి.కిరణ్కుమార్ : శానాయిపల్లి గ్రామానికి చెందిన డి.కిరణ్కుమార్ సాంఘిక సంక్షేమ వసతి గృహం అధికారిగా విధులు నిర్వహిస్తూ కాంగ్రెస్పార్టీలో చేరారు. అచ్చంపేట రిజర్వ్ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జిల్లెల చిన్నారెడ్డి : జయన్నతిరుమలాపురం గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1989లో వనపర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2014ఎన్నికల్లో వనపర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.
గువ్వల బాలరాజు : పొలికెపాడు గ్రామానికి చెందిన గువ్వల బాలరాజు 2009లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా నాగర్కర్నూల్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు