7 దశాబ్దాలు 10 మందే వనితలు
గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
శాసనసభలోకి అడుగిడింది వీరే
ఈనాడు, హైదరాబాద్
గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా శాసనసభలో వారి ప్రాతినిధ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 1952లో నియోజకవర్గాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం 10 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. పలు నియోజకవర్గాల్లో మహిళలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగినా అంతగా ప్రభావం చూపలేకపోయారు.
మేడ్చల్ నియోజకవర్గం 1967, 1972 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్గా కేటాయించారు. రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుమిత్రాదేవీ గెలుపొందారు.
ముషీరాబాద్లో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఒకే ఒక్క మహిళ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని నర్సింహారెడ్డి 2008లో రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి.అంజయ్య సతీమణి మణెమ్మ గెలుపొందారు. ఆ తర్వాతి ఎన్నికలోనూ ఆమె విజయకేతనం ఎగరేశారు.
1952 శాలిబండ, 1957 పత్తర్ఘట్టి నియోజకవర్గాల్లో మసూమా బేగం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
1962లో ఏర్పడిన చేవెళ్ల నియోజకవర్గానికి 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 1999 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో సబిత రాజకీయ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో 10వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో.. 2009లో ఏర్పడిన మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబిత పోటీ చేసి ప్రత్యర్థి తీగల కృష్ణారెడ్డిపై విజయం సాధించారు. 2018లోనూ ఆమె విజయం సాధించారు.
ఇబ్రహీంపట్నం నుంచి 1999 ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసిన కొండ్రు పుష్పలీల.. కాంగ్రెస్ అభ్యర్థి ఎ.గంగారాం కృష్ణపై గెలుపొందారు.
2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జయసుధ సమీప అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్పై గెలుపొందారు.
మలక్పేట్ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన బి.సరోజినీ పుల్లారెడ్డి విజయం సాధించారు.
సనత్నగర్ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరగ్గా.. 1983 ఎన్నికల్లో తెదేపా నుంచి తరఫున పోటీ చేసిన కాట్రగడ్డ ప్రసూన కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
- 1972లో గగన్మహల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన టి.శాంతాబాయి 5వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
- కంటోన్మెంట్లో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1967లో ఈ స్థానం నుంచి వి.రామారావు గెలిచారు. ఆయన మరణించడంతో 1969లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య వి.మంకమ్మ కాంగ్రెస్ తరఫున బరిలో దిగి గెలుపొందారు. 1972 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!