Smriti Irani: బావ కన్నేశాడు.. రాహుల్జీ కర్చీఫ్ వేయండి: స్మృతి ఇరానీ కౌంటర్
Smriti Irani - Rahul Gandhi: అమేఠీ స్థానంపై రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కన్నేశారన్నారు సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ. ఇక కాంగ్రెస్ నేత తన సీటుపై కర్చీఫ్ వేసుకోవాలేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
దిల్లీ: ఒకప్పటి పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అమేఠీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ (Congress) ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడి నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై భాజపా (BJP) ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై విమర్శలు చేశారు.
అమేఠీ (Amethi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి.. హస్తం పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘ఇలా ఎప్పుడైనా జరిగిందా? పోలింగ్కు ఇంకా 27 రోజులే ఉంది. కానీ, ఇంకా కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనం. ఈ స్థానంపై రాహుల్ గాంధీ బావ (రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ) కన్నేశారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో? ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్ వేసుకునేవారు. ఇప్పుడు రాహుల్ కూడా తన సీటును బుక్ చేసుకునేందుకు అలానే చేయాలేమో మరి’’ అంటూ కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు..
ఐదో విడత పోలింగ్లో భాగంగా అమేఠీ స్థానానికి మే 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండో సారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. 2019 కంటే ముందు వరుసగా మూడు సార్లు రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాజీవ్, సంజయ్ కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు. ఒకప్పుడు కాంగ్రెస్కు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు హస్తం ఆదరణ కోల్పోతూ వస్తోంది. గత ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓటమి ఆ పార్టీని గట్టిగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.
ఇదే సమయంలో ఇటీవల రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మరోవైపు రాహుల్ ఇక్కడి నుంచి పోటీపై స్పందిస్తూ.. పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని అన్నారు. ఆయన ప్రస్తుతం బరిలో ఉన్న కేరళలోని వయనాడ్ స్థానానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. ఇక అమేఠీలో నామినేషన్ సమర్పణకు మే 3 చివరి తేదీ. దీంతో వయనాడ్ పోలింగ్ తర్వాత అమేఠీలో రాహుల్ పోటీపై ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలైన ఓట్ల గణాంకాలు సకాలంలో వెల్లడికి ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం స్పందించింది. -
రాయ్బరేలీలో రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. -
వయనాడ్లో ఓటమి భయంతోనే.. రెండోచోట యువరాజు పోటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. -
ప్రియాంక ఎందుకు పోటీ చేయట్లేదు?
గాంధీ కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రెండు సీట్లలో ఎక్కడా పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా బరిలో నిలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ (59) మళ్లీ శివసేన (శిందే) గూటికి చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే సమక్షంలో శుక్రవారం ఆయన శివసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ!
ఆర్జేడీ కంచుకోట, గతంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన సారణ్ నుంచి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ఈసారి పోటీలో ఉన్నారు. -
50% రిజర్వేషన్ల పరిమితిని మోదీ ఎత్తేయగలరా?
దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (7)
మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది. -
రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తారా?
దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను తొలగించాలనేది ‘భాజపా-ఆరెస్సెస్’ల స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తారా? -
రాజ్యాంగ మౌలిక సూత్రాల్నిఏ పార్టీ, నాయకుడూ మార్చలేరు: గడ్కరీ
భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని పార్లమెంటు సహా ఏ పార్టీ, నాయకుడూ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం
రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. -
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్ గాంధీ ముందు రాయ్బరేలీలో గెలవాలని చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ సలహా ఇచ్చారు. ఓ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు. -
ఇక అమేఠీలో ర్యాపిడ్ ఫైర్ ప్రచారాలే..!
అమేఠీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాలే మిగిలిఉన్నాయి. హస్తం పార్టీకి దాదాపు రెండు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ శివసేన (శిందే వర్గం)లో చేరారు. -
ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు: శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అధికార భాజపాపై నిప్పులు చెరిగారు. -
ఉద్ధవ్ది ‘నకిలీ’ శివసేన: అమిత్ షా విమర్శలు
ఉద్ధవ్ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారని.. అసలైన పార్టీ శిందేతోనే ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ..!
లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై లాలూ పోటీ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. దీనివెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. -
ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చన్న అంశంపై చర్చ నడుస్తోన్న క్రమంలో ఆ పార్టీ స్పందించింది. -
‘వారసత్వం కాదు.. బాధ్యత’: రాహుల్ రాయ్బరేలీకి మారడంపై కాంగ్రెస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారడంపై విమర్శలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
చెప్పానుగా.. కొత్త సీటు వెతుక్కుంటారని: రాహుల్పై మోదీ సెటైర్
రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీపై ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది.