నిద్ర లేపేందుకు ప్రత్యేక ఉద్యోగం
ప్రజలు పగలంతా కష్టపడి రాత్రి నిద్ర పోతారు. మళ్లీ పొద్దునే ఎవరి పనులకు వారు వెళ్లాలి కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచేలా అలారం పెట్టుకుంటారు. కొంతమందికి అలారంతో పనిలేకుండా నిద్ర లేచే అలవాటు ఉన్నా.. చాలా మంది అలారం మోగితేగాని నిద్ర లేవలేరు. ఇప్పుడంటే
ప్రజలు పగలంతా కష్టపడి రాత్రి నిద్ర పోతారు. మళ్లీ పొద్దునే ఎవరి పనులకు వారు వెళ్లాలి కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచేలా అలారం పెట్టుకుంటారు. కొంతమందికి అలారంతో పనిలేకుండా నిద్ర లేచే అలవాటు ఉన్నా.. చాలా మంది అలారం మోగితేగాని నిద్ర లేవలేరు. ఇప్పుడంటే అందరికీ గడియారాలు, మొబైల్ అలారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అలారం అందుబాటులో లేని రోజుల్లో బ్రిటన్ ప్రజలు ఉదయాన్నే తమని లేపడం కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకునేవారట. ఆ ఉద్యోగం విశేషాలు మీరే చదవండి.
18వ శతాబ్దం ద్వితీయార్ధంలో యూరప్, అమెరికాలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఫ్యాక్టరీ, కంపెనీలకు కార్మికుల అవసరం పెరిగింది. అందుకు తగ్గట్టే కార్మికులను, ఉద్యోగులను నియమించుకొని పనులు చేయించుకోవడం ప్రారంభించాయి. దీంతో అక్కడి ప్రజలు సమయానికి కార్యాలయం చేరుకోవడం కోసం ఉదయాన్నే లేవాల్సి వచ్చేది. ఆ కాలంలో అలారం గడియారాలు ఉన్నా.. సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితులు ఉండేవి కావు. దీంతో పారిశ్రామీకరణ పుణ్యమా అని ప్రజలను నిద్ర లేపే కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. అదే.. ‘నాకర్-అప్పర్స్’. పగలంతా శారీకంగా ఎంతో శ్రమపడి రాత్రుళ్లు ఆదమరిచి నిద్రపోయే ప్రజలను లేపడమే వీరి పని.
నాకర్-అప్పర్స్ను ప్రజలు వ్యక్తిగతంగా లేదా సంస్థల యజమానులు వారి ఉద్యోగుల కోసం నియమించుకునేవారు. దీంతో వీరు తెల్లవారుజామున ప్రజల ఇంటి వద్ద నిలబడి వెదురు కర్రతో తలుపులు, కిటికీలను బాదడం గానీ, కిటికీలపై బఠానీలు విసరడం గానీ చేసేవారు. ఆ శబ్దాలకు పడుకున్న వాళ్లు లేచేవారు. ఒక వేళ లేవకపోతే లేచేవరకు నాకర్-అప్పర్స్ తలుపులు, కిటికీలను బాదుతూనే ఉండేవారు. ఇలా నిద్ర లేపుతున్నందుకు గాను వీరు ప్రజలు లేదా కంపెనీల నుంచి రెండు వారాలకొకసారి ఫీజు తీసుకునేవారు. డబ్బులు ఇవ్వకపోతే నిద్రలేపేవారు కాదు. ఇలాంటి ఉద్యోగం 1940 వరకు యూరప్లో ఉండేది. ఎప్పుడైతే అలారం గడియారాలు ప్రజలకు అందుబాటు ధరలో లభించడం మొదలైందో అప్పటి నుంచి ఈ ఉద్యోగులు సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. 1950 నాటికి నాకర్-అప్పర్స్ అనే ఉద్యోగం పూర్తిగా కనుమరుగైంది. అయితే 1970 వరకు ఇంగ్లాండ్లోని కొన్ని పారిశ్రామికవాడల్లో ఈ ఉద్యోగులు ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం