వివేకా కేసు రికార్డులు సీబీఐకి అప్పగించండి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అనుమానితులను

Updated : 11 Nov 2020 17:31 IST

పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించిన ఏపీ హైకోర్టు

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలని పులివెందుల మెజిస్ట్రేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అనుమానితులను ప్రశ్నించిన సీబీఐ.. స్థానికంగా దర్యాప్తు చేసిన పోలీసులను సైతం విచారించింది. ఈ క్రమంలో పులివెందుల కోర్టులో ఉన్న రికార్డులు పరిశీలిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని సీబీఐ అధికారులు భావించారు. ఆ రికార్డులు తమకు అందించాలని కోరుతూ పులివెందుల కోర్టులు పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం నిరాకరించింది.

దీంతో సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. వివేకా హత్య కేసు రికార్డులను తమకు అప్పగించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌ వేసింది. ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి రికార్డుల్లోని అంశాలు ఉపయోగపడతాయని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. కేసు రికార్డులను సీబీఐకి అప్పగించాలంటూ పులివెందుల మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని