ఆ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాలి:కేటీఆర్
పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలపై చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు భూములు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని సంస్థలపై చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పెట్టుబడులు తెస్తున్నామని.. సంస్థలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలన్నారు. నిర్ణీత గడువులోపు కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకేచోట చేర్చి బ్లూ బుక్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల సమగ్ర వివరాలు, కంపెనీల ప్రాథమిక సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించిన డిజిటల్ ఫ్లాట్ఫామ్ను మంత్రి ప్రారంభించి దాని కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం