శ్రీశైలం ఆనకట్ట వద్ద భారీగా ట్రాఫిక్జామ్
శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర....
సున్నిపెంట సర్కిల్: శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్విచ్యార్డు వరకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం సందర్శకులు ఆనకట్టను చూసేందుకు వస్తుండటంతో అక్కడి నుంచి సున్నిపెంట వరకు వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. జలాశయం చూసేందుకు వచ్చిన వారు వాహనాలను రోడ్ల పక్కనే నిలిపేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగాలగట్టు ప్రాంతంలో చేపలను విక్రయిస్తుండటంతో యాత్రికులు వాహనాలను రోడ్లపై నిలిపి వాటిని కొనుగోలు చేశారు. ట్రాఫిక్ను నియంత్రించే క్రమంలో పోలీసులు, యాత్రికుల మధ్య పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి