టీచర్.. వృత్తి వ్యవసాయం..లక్షల సంపాదన
పుస్తకాలు విజ్ఞాన గనులు. వాటి ద్వారా వచ్చే జ్ఞానంతో కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే.. మరి కొందరు పారిశ్రామిక వేత్తలవుతుంటారు. కానీ, బాగా చదువుకొని వ్యవసాయం చేసేవాళ్లు చాలా తక్కువ. ఇటీవల కొంతమంది వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నప్పటికీ, అలాంటి వాళ్లని వేళ్ల మీద లెక్కించొచ్చు. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగంలో దాదాపు పదేళ్లకు పైగా సేవలందిస్తూనే.. వ్యవసాయం చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు. తాను చేయడమే కాకుండా వందల మందికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లా దౌలత్పూర్ గ్రామానికి చెందిన అమరేంద్ర ప్రతాప్ సింగ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. దాదాపు 10 ఏళ్లకు పైగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. కానీ, ఆయనకు వ్యవసాయం చేయాలనే కోరిక ఉండేది. దాదాపు నెలకి రూ.1.20 లక్షల జీతమొస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేయడమంటే మాటలా? బంధువులు వద్దన్నారు. కోరి కష్టాలు తెచ్చుకోవడమెందుకురా? అని స్నేహితులు అడ్డుపడ్డారు. కానీ, అమరేంద్ర వినిపించుకోలేదు. వెంటనే ఉద్యోగం మానేయకుండా ప్రయోగాత్మకంగా కొంత వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం ద్వారానే లక్షలు సంపాదించొచ్చని నిరూపించాలనుకున్నాడు. ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే కాస్త కష్టమే. అందరూ సంప్రదాయ తృణధాన్యాలు, గోధుమలు, చెరకు పండించేవారు. అయితే వీటి ద్వారా పెద్దమొత్తంలో సంపాదించడం కష్టం. ఎందుకంటే దిగుబడి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. చెరకు ద్వారా అధిక దిగుబడికి అవకాశమున్నప్పటికీ దాదాపు రెండేళ్లు నిరీక్షించాల్సిన పరిస్థితి.
విలక్షణ ప్రయోగాలతో..
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. దగ్గర్లోని పట్టణంలో వ్యవసాయ మెలకువలు తెలుసుకునేందుకు శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ మరింత సమాచారాన్ని సేకరించేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ఎకరం పొలంలో అరటి తోట పెంచడం మొదలుపెట్టాడు. మొదట్లో అంతగా అవగాహన లేకపోవడంతో నష్టాలే వచ్చాయి. అయినా తన పట్టుదలను వీడలేదు. ఒకే పొలంలో రకరకాల పంటలను వేసి ప్రయోగం చేశాడు. ఎకరా పొలంలోనే అరటి తోటను పెంచుతూ అంతర పంటలుగా అల్లం, పసుపు, క్యాబేజీ పంటలను వేశాడు. దీంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది. అల్లంతో పెద్దగా ఉపయోగం లేకపోయినా పసుపుతో బాగా కలిసొచ్చిందట. దీంతో ఇదే తరహాలో అమరేందర్ సేద్యాన్ని కొనసాగించాడు.
అంతర పంటలు వేస్తూ..
ఈ లోపు వ్యవసాయంపై పూర్తిగా అవగాహన వచ్చింది. తనకున్న మొత్తం 30 ఎకరాలతోపాటు, మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని అరటి పంట, అందులో కొన్ని అంతర పంటలను వేయడం ప్రారంభించాడు. పసుపు పంటలో వచ్చిన లాభాన్ని అరటి తోటలకు మదుపుగా పెట్టేవాడు. ఇలా ఏడాది పొడవునా ఆదాయం వచ్చేలా ప్రణాళిక వేసుకున్నాడు. అలా తన ప్రయోగాలను విస్తరించుకుంటూ అంతర పంటలుగా వాటర్ మిలన్, మస్క్మిలన్, బంగాళాదుంప, స్ట్రాబెర్రీ, క్యాప్సికం తదితర పంటలు వేసేవాడు. అంతేకాకుండా దగ్గర్లోని వ్యవసాయ క్షేత్రాలకు, ప్రయోగశాలలకు వెళ్లి కొత్త కొత్త వంగడాలు, వాణిజ్య పంటల గురించి తెలుసుకునే వాడు. ఆయా పద్ధతులను తాను కూడా అవలంబించేవాడు. తొలుత నష్టమొచ్చినా.. క్రమంగా లాభాలు వచ్చేవి. పంట వ్యర్థాలను కాల్చేయకుండా, వాటిని సేంద్రియ ఎరువులుగా తర్వాతి పంటలకు ఉపయోగించేవాడు. దీంతో తన వ్యవసాయ క్షేత్రంలో వ్యర్థమనే పదానికే చోటు లేకుండా చేశాడు.
మార్గనిర్దేశకుడిగా..
అధిక దిగుబడి సాధించేందుకు కాలానుగుణంగా మారుస్తున్నాడు. మొత్తం 30 ఎకరాల్లో కూరగాయలు, పళ్లు పండిస్తూ... మిగతా 30 ఎకరాల్లో చెరకు, గోదుమలు లాంటి పంటలు వేస్తున్నాడు. దీంతో ఏడాదికి రూ.1 కోటి వరకు ఆదాయమొస్తోందని, దాదాపు 70 లక్షలు పెట్టుబడిగా పోయినా ఏడాదికి 30 లక్షల లాభం మిగులుతోందట. తక్కువ నీటితో వ్యవసాయం చేసేలా ఇటీవల డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని కూడా ఉపయోగిస్తున్నట్లు రైతుగా మారిన ఈ ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. కేవలం తానొక్కడే కాకుండా తన అనుభవంతో చుట్టుపక్కల రైతులకు మార్గనిర్దేశకుడిగా నిలుస్తున్నాడు. రైతుల సందేహాలు తీరుస్తూ మరింత మందిని ప్రోత్సహిస్తున్నాడు. దాదాపు 350 మంది రైతులు ఆయన మార్గనిర్దేశంలో నడుస్తున్నారట. ‘‘ప్రతి రైతుకీ సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యవర్తుల మోసానికి ఎందరో బలైపోతున్నారు. తమ పంటలకు సరైన మద్దతు ధర లభించడం లేదు. నేరుగా వినియోగదారులకే తమ పంటలను చేరవేసేలా ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని అమరేందర్ చెబుతున్నాడు.
-ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Cuba: క్యూబా ప్రధాన చమురు నిల్వలో 40శాతం ఆహుతి..!
-
Politics News
Karnataka: ముఖ్యమంత్రి మార్పా?.. అబ్బే అదేం లేదు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Crime News
Gorantla madhav: మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ
-
Movies News
Naga Chaitanya: జీవితంలో ఏం జరిగినా ఆనందంగా స్వీకరించాలి: నాగచైతన్య
-
India News
Viral Video: పెద్దోళ్లు పట్టించుకోలేదు.. పసిపిల్లలు చేయందించారు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Balineni Srinivasa Reddy: బాలినేని జనసేనకు వెళ్తున్నారా? క్లారిటీ ఇచ్చిన మాజీమంత్రి