Nizamabad: పసుపు పంట ఆల్‌టైమ్‌ రికార్డు ధర

పసుపు పంటకు ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది.

Published : 11 Mar 2024 22:40 IST

నిజామాబాద్‌: పసుపు పంటకు ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలికింది. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో క్వింటా రూ.18,299 పలకడం విశేషం. పెర్కిట్‌కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు ఈ ధర లభించింది. మరోవైపు మార్కెట్‌లో క్వింటా పసుపు కొమ్ములు కనిష్ఠంగా రూ.8 వేలు, సగటున రూ.14,250కు పలికాయి. పసుపు పంటకు రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని