AP News: ఐక్య పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం.. భవిష్యత్ కార్యాచరణపై రేపు నిర్ణయం
పీఆర్సీ అంశంలో ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఉమ్మడి
అమరావతి: పీఆర్సీ అంశంలో ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఉమ్మడి పోరాటంపై సమాలోచనలు జరిపారు. ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘పీఆర్సీ సాధన కోసం అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించాం. రేపు ఉదయం 11.30 గంటలకు సచివాలయ జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయంలో సమావేశమై ఉమ్మడి పోరాటం విధి విధానాలు రూపొందిస్తాం. ఇవాళ్టి వరకూ ఆయా సంఘాల నిర్ణయం మేరకు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. రేపటి నుంచి ఏ ఆందోళన చేపట్టినా నాలుగు సంఘాలు కలిసే చేస్తాయి. కొత్త పీఆర్సీ వల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఉద్యోగికి నష్టం జరుగుతోంది. అందుకే అందరం కలిసి పోరాడాలని నిర్ణయించాం. మాలో మాకు ఎలాంటి మనస్పర్థలు ఉన్నప్పటికీ అన్నీ పక్కన పెట్టి మెరుగైన పీఆర్సీ సాధించాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వం ముందు పెట్టాల్సిన డిమాండ్లపై రేపటి సమావేశంలో చర్చిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిర్ణయాన్ని మార్చుకోవాలి’’ అని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 21న సీఎస్కు సమ్మె నోటీసు ఇస్తామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు నిన్న ప్రకటించారు. సమ్మె నోటీసు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. సమ్మె నోటీసుపై రేపటి సమావేశంలో మిగిలిన సంఘాలతో కూడా చర్చిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం